రాజ్యాంగ పరిరక్షణకు స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి అవసరం
రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణకు స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో పోరాడాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.
తెదేపా అధినేత చంద్రబాబు
ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేస్తున్న చంద్రబాబు
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణకు స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో పోరాడాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘విజన్- 2047’తో ప్రణాళికాబద్ధంగా సాగితే భవిష్యత్తులో ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రస్థానానికి చేరుతుందని తెలిపారు. నైపుణ్యం గల పౌరులు, డిజిటల్ సామర్థ్యం, ప్రపంచంలో ఎవరికీ లేని యువశక్తి భారతదేశానికి ఉన్న బలమని చెప్పారు. ‘ఐటీ విప్లవాన్ని అవకాశంగా మార్చుకుని తెలుగువారు ప్రపంచ స్థాయిలో ఉత్తమ విజయాలు సాధించారు. 2029కి ఏపీని దేశంలో నంబర్వన్ గా మార్చేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రణాళికాబద్ధంగా పని చేశాం. నేడు వైకాపా ప్రభుత్వం తన విధ్వంస విధానాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. రాజ్యాంగ విరుద్ధ, ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో పడింది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
తెదేపా కేంద్ర కార్యాలయంలో...
ఈనాడు డిజిటల్, అమరావతి: మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాడు బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమికొట్టిన ఘట్టాల్ని రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకోవాలని, రాష్ట్రాన్ని ఏలుతున్న నియంతల్ని అదే స్ఫూర్తితో పరుగులు పెట్టించాల్సిన బాధ్యత ఏపీ యువతపై ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అశోక్బాబు, పార్టీ కార్యానిర్వాహక కార్యదర్శి బుచ్చిరామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం