IT Jobs: నైపుణ్యమే నిను నిలిపేది
కొవిడ్ సమయంలో ఐటీ కంపెనీలు పోటీలు పడి మరీ కొత్త ఉద్యోగులను నియమించాయి. కానీ ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా ఉద్యోగులను ఎడాపెడా తొలగిస్తున్నాయి.
అయిదారేళ్లకోసారి ఐటీలో కుదుపులు సహజం
కొలువు నిలవాలంటే కొత్త పంథా తప్పదు
నూతన సాంకేతికతపై పట్టు సాధించాలి
భయం వద్దు.. కొత్త విభాగాల్లో ఉద్యోగాలు పెరుగుతున్నాయ్
నిపుణుల విశ్లేషణ
ఈనాడు బిజినెస్ బ్యూరో, హైదరాబాద్
కొవిడ్ సమయంలో ఐటీ కంపెనీలు పోటీలు పడి మరీ కొత్త ఉద్యోగులను నియమించాయి. కానీ ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా ఉద్యోగులను ఎడాపెడా తొలగిస్తున్నాయి. చిన్న, మధ్య స్థాయి కంపెనీల నుంచి దిగ్గజ కంపెనీల వరకూ ఇదే వరుస. ఈ పరిస్థితిని ఊహించని ఐటీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ముఖ్యంగా ఉద్యోగంపై భరోసాతో వేసుకున్న ఆర్థిక ప్రణాళికలు చిన్నాభిన్నమవుతున్నాయి. కొత్త ఉద్యోగం ఎప్పటికి దొరుకుతుందో అనే ఆందోళనతో సతమతమవుతున్నారు. మన ఐటీ పరిశ్రమ, అమెరికా మీద అధికంగా ఆధారపడినందున, అక్కడి ఆర్థిక పరిస్థితుల ప్రభావం ఇక్కడ కనిపిస్తోంది. 2022 నవంబరు నుంచి ఇప్పటి వరకూ అమెరికాలో దాదాపు 2 లక్షల ఐటీ ఉద్యోగాలు పోయినట్లు అంచనా. మన దేశంలోనూ కంపెనీలు కొద్ది నెలలుగా ఐటీ ఉద్యోగాల్లో భారీగానే కోత పెడుతున్నాయి. ఈ పరిస్థితి ఎన్నాళ్లు ఉంటుంది.. ఐటీ రంగంలో తాజాగా ఎటువంటి మార్పులు వస్తున్నాయి.. దానికి ఉద్యోగులు ఎలా సన్నద్ధం కావాలనేది ప్రస్తుతం ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
అంకురాల్లోనూ...
మన దేశంలోని పలు అంకుర సంస్థలూ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఇంక్42.కామ్ నివేదిక ప్రకారం అంకుర సంస్థలు దాదాపు 18,000 మందిని తొలగించాయి. ఇందులో బైజూస్, ఓలా, బ్లింకిట్, అన్ అకాడమీ, వేదాంతు, వైట్హ్యాట్ జూనియర్ తదితరాలున్నాయి. ఒక్క బైజూస్లోనే 2,500 మంది ఉద్యోగులను తీసేశారు. ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ మనదేశంలో వెయ్యి మంది ఉద్యోగులను తొలగిస్తామంటోంది.
ఎంత ప్రయత్నించినా లాగిన్ కాదు
మన దేశంలో ప్రస్తుత సీజన్లో ఐటీ రంగంలో 50,000కుపైగా ఉద్యోగాలు పోయి ఉంటాయని అంచనా. ఇది ఇంతటితో అయిపోలేదు. వచ్చే 6 నెలలు, ఏడాదిపాటు తొలగింపులుంటాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. బెంగళూరుకు చెందిన ఒక హెచ్ఆర్ రిక్రూటింగ్ సేవల సంస్థ అయితే మన దేశంలో ఇంకా లక్షకుపైగా ఐటీ ఉద్యోగాలు పోయే అవకాశముందని స్పష్టం చేస్తోంది. ఇంటి నుంచి పని చేస్తున్న ఉద్యోగుల్లో కొందరు... ఉదయాన తమ షిఫ్టు ప్రకారం ‘ల్యాప్ట్యాప్ తీసి లాగిన్ అయ్యేందుకు ప్రయత్నిస్తే అది పని చేయడానికి నిరాకరిస్తోంది. ఏమైందని కంపెనీ హెచ్ఆర్ విభాగాన్ని సంప్రదిస్తే... ‘మీ ఉద్యోగం పోయింది. మీకు రావాల్సిన సొమ్ము బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. అన్ని వివరాలతో మెయిల్ పంపిస్తాం’ అనే సమాధానం వస్తోందట. ‘ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లి ఐడీ కార్డు పంచ్ చేసినప్పుడు... పచ్చ లైటు వెలిగితే ఉద్యోగం ఉన్నట్లు. ఎర్ర లైటు వెలిగితే ఐడీ కార్డు అక్కడ సెక్యూరిటీకి ఇచ్చేసి వెనుదిరిగి రావటమే’ అనే పద్ధతి అమెరికాలో నెలకొంది.
అసలు ఎందుకిలా?
* ప్రపంచం మొత్తం దాదాపు రెండేళ్లపాటు కొవిడ్తో సతమతమైంది. ఆ సమయంలో డిజిటల్ టెక్నాలజీ, రిమోట్ వర్కింగ్, బయోటెక్నాలజీ, హెల్త్కేర్ విభాగాల్లో ఎన్నో కొత్త ప్రాజెక్టులు ఐటీ కంపెనీలకు లభించాయి. దీంతో ఉద్యోగుల అవసరాలు పెరిగి పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టాయి. ఆయా ప్రాజెక్టులు పూర్తయ్యాక కొత్తగా వచ్చేవి తగ్గుతున్నందున ఉద్యోగుల అవసరాలు తగ్గిపోయాయి. ఆరోగ్య సంరక్షణ, ఔషధ పరిశోధన విభాగాల్లో కొన్ని ప్రాజెక్టులుపూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగాఉద్యోగులను తొలగిస్తున్నారు.
* ఆటోమేషన్ విస్తరించడమూ మరొక ప్రధాన కారణం. ఎన్నో విభాగాల్లో ఆటోమేషన్ జరిగినందున, ఒక కంపెనీలో 10 మంది చేసే పనిని... ఇద్దరు, ముగ్గురే పూర్తి చేసేస్తున్నారు. కృత్రిమ మేధ (ఏఐ), ఫేస్ రికగ్నిషన్, క్వాంటమ్ టెక్నాలజీ, ఏఆర్-వీఆర్, బ్లాక్చైన్... వంటి సాంకేతికతలు వినియోగిస్తున్నందున ఆయా విధులను నిర్వర్తించే ఉద్యోగులను కంపెనీలు తొలగిస్తున్నాయి.
* ఆర్థిక మాంద్యం మరొక ముఖ్యమైన ముప్పుగా ఐటీ వర్గాలు వివరిస్తున్నాయి. అమెరికాకు ఈ ఏడాదిలో మాంద్యం ఎదురయ్యే అవకాశమున్నట్లు అనుమానిస్తున్నారు. చైనాలో ఇప్పటికే వృద్ధి క్షీణించింది. ఈ రెండూ పెద్ద ఆర్థిక వ్యవస్థలైనందున.. ఆ పరిణామాల ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాలపై పడుతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు, ఐటీ సేవల కంపెనీలు ముందుగానే జాగ్రత్త పడుతున్నాయి.
కొత్త ఉద్యోగాలూ వస్తున్నాయి
ఐటీ రంగంలో పెద్ద ఎత్తున సాంకేతిక మార్పులు వస్తున్నందున, ప్రస్తుతమున్న ఉద్యోగాలు భారీగా తగ్గిపోతాయని ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ ఇటీవల అంచనా వేసింది. అదే సమయంలో ఇంతకంటే అధికంగా కొత్త టెక్నాలజీల్లో ఉద్యోగాలు లభిస్తాయని వివరించింది. ప్రధానంగా ఏఐ, డిజిటల్ సాంకేతికతల్లో కొత్త ఉద్యోగాలు వస్తాయని విశ్లేషించింది. కొందరు ఉద్యోగులను తొలగిస్తున్న ఐటీ కంపెనీలే, ఆటోమేషన్ వంటి కొత్త విభాగాల్లో నైపుణ్యాలు ఉన్న వారిని తీసుకుంటున్నాయని తెలంగాణ ఐటీ అసోసియేషన్ అధ్యక్షుడు సందీప్ కుమార్ వివరించారు. 5 నుంచి 7ఏళ్లకోసారి ఐటీలో సాంకేతిక మార్పులు రావడం సహజమని, అందువల్ల పాత నైపుణ్యాలకే పరిమితమైన వారి ఉద్యోగాలు పోవడం సాధారణమేనని గుర్తు చేస్తున్నారు. అటువంటి మార్పు ఇప్పుడు కనిపిస్తోందని తెలిపారు.
నైపుణ్యాలు పెంచుకోవాల్సిందే
నైపుణ్యాలు పెంచుకోవడంపై దృష్టి సారిస్తే ఐటీ నిపుణులకు ఉద్యోగ భద్రత ఉంటుందని స్థానిక ఐటీ రంగ పరిశీలకుడు సునీల్ చక్రవర్తి తెలిపారు. మాంద్యం భయం ఐటీ రంగాన్ని ఆత్మ రక్షణ ధోరణిలోకి నెడుతోందని, ప్రస్తుత ఉద్యోగాల కోతకు ఇదొక ప్రధాన కారణమని ఆయన వివరించారు. పదేళ్ల నాటి నైపుణ్యాలతో పని చేస్తామంటే మనగలిగే పరిస్థితి ఇప్పుడు ఐటీ రంగంలో లేదని, ఎప్పటికప్పుడు తాజా అవసరాలకు అనుగుణంగా నూతన నైపుణ్యాలతో సన్నద్ధమైతేనే ఉద్యోగం పోయే ముప్పు ఉండదని తెలిపారు. కీలక ఐటీ ప్రాజెక్టుల్లో నేరుగా పాల్గొనే వారితో పోల్చితే, సపోర్టు సేవల్లో ఉండే ఐటీ ఉద్యోగులకు ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM