Viveka murder Case : అవినాష్ కాల్డేటాపై ఆరా?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. ఆయన కాల్ డేటా నుంచి హత్య విషయంలో చోటుచేసుకున్న ఆర్థిక లావాదేవీలపైనా ఆరా తీసింది.
ఆర్థిక లావాదేవీలపై కూడా
వివేకా హత్య కేసులో నాలుగున్నర గంటలపాటు కడప ఎంపీని విచారించిన సీబీఐ
మరోసారి రావాలని సూచన
విచారణ విషయాలను బహిర్గతం చేయలేను: అవినాష్రెడ్డి
తొలుత కడప పోలీసులను విచారించిన సీబీఐ
ఈనాడు, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. ఆయన కాల్ డేటా నుంచి హత్య విషయంలో చోటుచేసుకున్న ఆర్థిక లావాదేవీలపైనా ఆరా తీసింది. హైదరాబాద్ కోఠిలోని కేంద్రీయ సదన్లో ఉన్న సీబీఐ కార్యాలయంలో దిల్లీ నుంచి వచ్చిన బృందం ఆయనను శనివారం నాలుగున్నర గంటలకుపైగా విచారించింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో కార్యాలయం లోపలికి వెళ్లిన ఆయన తిరిగి రాత్రి ఏడున్నర గంటల సమయంలో బయటకు వచ్చారు. దిల్లీ సీబీఐ ఎస్సీ-3 విభాగం ఎస్పీ రాంసింగ్ నేతృత్వంలోని బృందం అవినాష్రెడ్డిని సుదీర్ఘంగా విచారించింది. వీడియో తీయాలని.. తన న్యాయవాది సమక్షంలోనే విచారణ జరగాలని అవినాష్రెడ్డి సీబీఐ అధికారులను కోరారు. అందుకు సీబీఐ నిరాకరించడంతో ఆయన ఒంటరిగానే కార్యాలయంలోనికి వెళ్లారు. బయటకు వచ్చిన తర్వాత ఎంపీ అవినాష్రెడ్డి మాట్లాడుతూ.. విచారణకు సంబంధించిన విషయాలను ఇప్పుడు బహిర్గతం చేయలేనని చెప్పారు. ఎంపీ అవినాష్రెడ్డిని విచారించడానికి ముందు నాడు వివేకా హత్య జరిగిన సమయంలో దర్యాప్తు చేసిన కడప పోలీసులను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. వైయస్ఆర్ జిల్లా నుంచి అవినాష్రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. రాయచోటి, రైల్వేకోడూరు ఎమ్మెల్యేలు శ్రీకాంత్రెడ్డి, శ్రీనివాసులు సహా పలువురు ప్రజాప్రతినిధులు ఆయన వెంట వచ్చారు. తెలంగాణ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ బృందం విచారణ ముగిసేవరకు ఇక్కడే ఉంది. అవినాష్రెడ్డి కడిగిన ముత్యంలా బయటపడతారని శ్రీకాంత్రెడ్డి మీడియాతో పేర్కొన్నారు. విచారణ అనంతరం మరోసారి రావాలని అవినాష్రెడ్డికి సీబీఐ సూచించింది.
248 మంది వాంగ్మూలాల ఆధారంగా విచారణ
2019 మార్చిలో వైఎస్ వివేకానంద హత్య జరిగింది. తొలుత గుండెపోటు మరణంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందనే ఆరోపణలు మిన్నంటాయి. దాదాపు ఏడాది తర్వాత హైకోర్టు ఆదేశాలతో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. అప్పటి నుంచి దర్యాప్తు కొనసాగుతోంది. పలు విడతలుగా సీబీఐ దర్యాప్తు బృందాలు కడప జిల్లాకు వెళ్లి క్షేత్ర స్థాయిలో సాక్ష్యాధారాల్ని సేకరించాయి. 248 మంది నుంచి వాంగ్మూలాలను సేకరించాయి. ఈ కేసులో అవినాష్రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు వ్యక్తమైనా ఇప్పటివరకు దృష్టి సారించలేదు. పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించాకే ఆయనను విచారించే యోచనలో సీబీఐ అధికారులున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే అవినాష్రెడ్డిని సీబీఐ విచారణకు పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వీడియో విచారణకు అంగీకరించలేదు: అవినాష్రెడ్డి
సీబీఐ ఇచ్చిన 160 సీఆర్పీసీ నోటీసుకు స్పందించి హాజరయ్యానని అవినాష్రెడ్డి చెప్పారు. విచారణ అనంతరం సీబీఐ కార్యాలయం బయట ఆయన మీడియాతో మాట్లాడారు. ‘విచారణ పారదర్శకంగా జరగాలని సీబీఐని కోరా. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చా. వారి అనుమానాల్ని నివృత్తి చేశా. మళ్లీ ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తా. కొంతకాలంగా నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఓ వర్గం, కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయి. అందుకే ప్రజలకు వాస్తవాలు తెలియాలని విచారణ మొత్తాన్ని వీడియో తీయాలని కోరా. అందుకు సీబీఐ ఒప్పుకోలేదు. ఒంటరిగా హాజరయ్యా. మళ్లీ ఎప్పుడు పిలిచినా వస్తా’ అని అవినాష్రెడ్డి పేర్కొన్నారు.
10న విచారణకు హాజరు కావాలి
వివేకా హత్య కేసులో నిందితులకు సమన్లు
హైదరాబాద్ సీబీఐ కోర్టు ఆదేశం
ఈనాడు, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో హైదరాబాద్కు చేరిన వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు హైదరాబాద్ సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 10న విచారణకు హాజరు కావాలంటూ నిందితులైన గజ్జల ఉమాశంకర్రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, సునీల్ యాదవ్, ఎర్ర గంగిరెడ్డి, అప్రూవర్గా మారిన దస్తగిరిలకు ఈ సమన్లు జారీ అయ్యాయి. కడప సెషన్స్ కోర్టు నుంచి ఇటీవల 3 పెట్టెల్లో ఎఫ్ఐఆర్తోపాటు సీబీఐ దాఖలు చేసిన రెండు అభియోగ పత్రాలు, అంతకు ముందు సిట్ దర్యాప్తు చేసిన పత్రాలు, దస్త్రాలు సీబీఐ కోర్టుకు అందాయి. దర్యాప్తు అధికారులు ఇప్పటివరకూ 248 మందిని విచారించి వాంగ్మూలాలను నమోదు చేసినట్లు సమాచారం. ఇవన్నీ సీబీఐ కోర్టుకు చేరాయి. వీటిని పరిశీలించిన సీబీఐ కోర్టు అభియోగ పత్రం, అనుబంధ అభియోగ పత్రాలను విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకుంటూ కేసుకు ఎస్సీ 1/2023గా నంబరు కేటాయించింది. జైలులో ఉన్న ఉమాశంకర్రెడ్డి, శివశంకర్రెడ్డి, సునీల్ యాదవ్లను హైదరాబాద్కు జైలుకు తరలించని పక్షంలో ఇక్కడికి తీసుకువచ్చి కోర్టులో హాజరు పరచాల్సి ఉంటుంది. లేని పక్షంలో కోర్టు అనుమతితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు పరచడానికి అవకాశాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి... శివ అన్నపురెడ్డి పేరుతో చలామణీ అవుతూ సవాల్ విసురుతుంటే సీబీఐ చేష్టలుడిగి చూస్తోంది. -
సీఎం వస్తున్నారంటే.. చెట్లపై వేటు పడాల్సిందేనా?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఇంకేముంది షరామామూలుగా గొడ్డలికి పనిచెప్పారు అధికారులు. -
అమ్మా.. నాన్న ఏరీ.. ఎక్కడ?
జగన్పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు, ఆటోడ్రైవర్ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. -
నవీన్ పట్నాయక్ నిర్మించారు.. జగన్ ముంచేశారు
ఒడిశాలో నాగావళి నదిపై మూడు గ్రామాల ప్రజల కోసం వంతెన నిర్మాణానికి అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ చొరవ చూపగా.. ఏపీలో అదే నదిపై 33 గ్రామాల ప్రజల కోసం వారధి నిర్మాణానికి స్వయంగా జగనే హామీ ఇచ్చినా నేటికీ పూర్తికాలేదు. -
కిడ్నాప్ చేసి.. ‘డ్రగ్స్’ చేతిలో పెట్టి వీడియో!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
అప్పులకు అలవాటు పడిన జగన్ సర్కార్.. విద్యుత్ పంపిణీ సంస్థలనూ వాటికి అలవాటు చేసింది. డిస్కంల నెత్తిన గత నవంబరు నాటికి రూ.61,407 కోట్ల అప్పుల భారం వేసింది. -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అదే అరాచకం.. అదే దౌర్జన్యం
గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. -
జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు!
మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు... దళితుడిని చంపి ఇంటికి డోర్డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు... దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం... చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్ అసలు రూపం. -
వ్యాధి తేల్చరు.. వేదన తీర్చరు!
తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు... వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే. -
పింఛన్ తుంచెన్.. పేదలను వంచించెన్!
మోసం.. దగా.. కుట్ర.. వీటికి ప్యాంటు, చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం జగన్ మాదిరే ఉంటాయేమో..! ‘నవరత్నాల’ కింద పింఛను ఇచ్చి అవ్వాతాతలను నవ్విస్తామని ఒంటరి మహిళలను ఆదుకుంటామని వితంతువులకు భరోసా కల్పిస్తామని వేదికలపై ఆయన ప్రదర్శించిన నటనాచాతుర్యాన్ని చూసి నంది అవార్డు కూడా ‘వామ్మో’ అని చిన్నబోవాల్సిందేనేమో..!! -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యం అందిస్తాం
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తే ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 40మంది అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
బస శిబిరంలోనే సీఎం జగన్ విశ్రాంతి
‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేశారు. -
వివేకా హంతకులకు ఓటేయొద్దు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకుడికి ఓటు వేయవద్దని వివేకా కుమార్తె సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. -
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి పునశ్చరణ తరగతులు
ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
తల్లిదండ్రుల కమిటీ సమావేశం వాయిదా
విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ తెలిపారు. -
పట్టణాభివృద్ధికి పాడె కట్టిన జగన్!
ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా... తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా... ఇరుకు రోడ్లను విస్తరించకున్నా... తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా... లేశమాత్రమైనా జంకు లేకుండా... పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించానని మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్! -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
-
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
-
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
-
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
-
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..