రహస్య పాలనపై రచ్చరచ్చ!
రహస్య పాలన ఎంత ప్రమాదకరమో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజలకు శనివారం స్పష్టంగా అవగతమైంది. ఇలాంటి పరిపాలన ఎంత గందరగోళానికి దారి తీస్తుందో తెలిసి వచ్చింది.
ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ఫేక్ జీవో
సామాజిక మాధ్యమాల్లో హల్చల్
ఉద్యోగులు, నిరుద్యోగుల్లో గందరగోళం
చివరికి ఖండించిన ప్రభుత్వం
జీవోలన్నీ రహస్యంగా ఉంచడంతో సమస్యలెన్నో..
ఈనాడు, అమరావతి: రహస్య పాలన ఎంత ప్రమాదకరమో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజలకు శనివారం స్పష్టంగా అవగతమైంది. ఇలాంటి పరిపాలన ఎంత గందరగోళానికి దారి తీస్తుందో తెలిసి వచ్చింది. చివరకు ప్రభుత్వమూ కంగారు పడాల్సి వచ్చింది. నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ఊరు చుట్టి వస్తుందని సామెత. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై సామాజిక మాధ్యమాల్లో వ్యాపించిన ఫేక్ జీవో ఇలాంటి పరిస్థితులనే సృష్టించింది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏ ఉత్తర్వులిచ్చినా అందులో పారదర్శకత, ప్రజాప్రయోజనాలు ఇమిడి ఉండాలి. దీనికి భిన్నంగా రాష్ట్రంలో ఇటీవల రహస్య పాలన కొనసాగుతోంది. జగన్ సర్కారు ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. ప్రభుత్వం ఏ రోజు ఏ ఉత్తర్వులిస్తుందో బయటపెట్టరు. 2008 నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జీవోఐఆర్ వెబ్సైట్ను జగన్ సర్కారు మూసేసి పారదర్శకతకు పాతరేసిందనే విమర్శలను ఎదుర్కొంటూనే ఉంది. దాని బదులు ఏపీ ఈ గెజిట్ వెబ్సైట్ను ప్రభుత్వం ప్రారంభించింది. ఎప్పుడో వెలువరించిన జీవోలను అనేక రోజులు గడిచాక ఈ వెబ్సైట్లో ఉంచుతోంది. ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితులు కొనసాగుతుండటంతో శనివారం పెద్ద గందరగోళమే ఏర్పడింది.
పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచారట..!
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచుతున్నట్లు శనివారం సామాజిక మాధ్యమాల్లో ఒక జీవో రూపంలో ప్రచారమైంది. రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ జనవరి 28న ఈ మేరకు ఉత్తర్వులిచ్చినట్లు ఇందులో ఉంది. 2023 జనవరి ఒకటి నుంచి ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయని, పదవీ విరమణ వయసు పెంపునకు ప్రభుత్వం ఆర్డినెన్సు ఇచ్చిందని ఇందులో ప్రస్తావించారు. ఇది ఉద్యోగుల్లో గందరగోళం సృష్టించింది. లోతుగా పరిశీలిస్తే రెండు కారణాలవల్ల అయోమయ పరిస్థితులు ఏర్పడినట్లు స్పష్టమవుతోంది.
* పారదర్శకంగా ఉన్న జీవోఐఆర్ (గవర్నమెంటు ఆర్డర్స్ ఇన్ఫర్మేషన్ రిజిష్టర్) వెబ్సైట్ స్థానంలో.. వైకాపా ప్రభుత్వం వచ్చాక ప్రారంభించిన ఏపీ ఈ గెజిట్ వెబ్సైట్లో జీవోలన్నింటినీ బయటపెట్టడం లేదు. కేవలం కొన్నింటినే ఉంచడంతో నిజంగానే సర్కారు ఈ జీవో ఇచ్చిందేమోనని అనుమానించాల్సి వచ్చింది. కొన్ని జీవోలు ఏపీ ఈ గెజిట్లోకి రాకముందే సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైన అనుభవాలు ఉండటం ఈ అనుమానాలకు బలం చేకూర్చింది.
* ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో కొద్ది కాలంపాటు పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించే భారం తప్పుతుందనే ఎత్తుగడగా అప్పట్లో దీన్ని అభివర్ణించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ప్రతి నెలా ఒకటిన ఇవ్వలేకపోతోంది. పదవీ విరమణ ప్రయోజనాలను సకాలంలో చెల్లించడమూ గగనమవుతోంది. రాష్ట్రంలోని అస్తవ్యస్త ఆర్థిక పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు మళ్లీ పదవీ విరమణ వయసు పెంచేశారేమోనని కంగారుపడ్డారు.
ఎన్నెన్నో మార్పులు
2008లోని జీవోఐఆర్ వెబ్సైట్ అందుబాటులోకి రాకముందు ప్రభుత్వంలోని ప్రతి శాఖ.. జీవోల విడుదలకు మాన్యువల్గా మూడు రకాల రిజిష్టర్లు నిర్వహించేది. 1. జీవోఎంఎస్ అంటే పాలన, విధానపరమైన, దీర్ఘకాలం అమల్లో ఉండే ఉత్తర్వులిచ్చేవారు. 2. నిర్దుష్ట కాలపరిమితి ఉండే ఉత్తర్వులకు జీవోఆర్టీ పేరుతో రిజిష్టర్ నిర్వహించేవారు. 3. జీవో పి పేరుతో రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలను కొన్నింటిని వెలువరించేవారు. ప్రభుత్వ ఉత్తర్వు తయారీకి రాష్ట్ర సచివాలయంలోని 33 ప్రభుత్వ శాఖలు ఒకే విధానం అనుసరిస్తాయి. జీవోకు సంబంధించిన నోట్ ఫైల్ ముందు సిద్ధమవుతుంది. దానిపై సంబంధిత ప్రభుత్వశాఖ కార్యదర్శి, మంత్రి, ముఖ్యమంత్రి నిర్ణయాలు, సంతకాలుంటాయి. ఆ నిర్ణయాల మాన్యువల్ ప్రతిని సంబంధిత రిజిష్టర్లో నమోదు చేసి సీరియల్ నంబరు కేటాయిస్తారు. జీవోపై అదే నంబరు వేసి ఆర్డర్ కాపీని సంబంధిత శాఖలు, అమలు చేసే ఏజెన్సీలకు పంపేవారు. ఆర్డర్ కాపీని స్టాక్ఫైల్ రూపంలో భద్రపరిచేవారు. వ్యయప్రయాసలతో గతంలో ప్రభుత్వ ఉత్తర్వులు సిద్ధమయ్యేవి. ఏ జీవో ఎప్పుడు? ఎందుకోసం ఇచ్చారో తెలుసుకోవడమూ కష్టమయ్యేది. రికార్డులు దొరికేవి కావు. చెదలు పట్టేవి. కాలిపోయిన సందర్భాలూ ఉన్నాయి.
డిజిటల్లోకి వచ్చాక మార్పులు
2005లో సమాచార హక్కు చట్టం వచ్చాక పెరిగిన సాంకేతికతను అందిపుచ్చుకుని అంతకుముందు మాన్యువల్ రూపంలో చేసిన పనిని డిజిటలైజ్ చేశారు. ఆన్లైన్ వెబ్సైట్లో జీవోలను ఉంచి ప్రజలకు సౌకర్యం కల్పించారు. జగన్ సర్కారు వచ్చాక పారదర్శకంగా ఉన్న జీవోఐఆర్ వెబ్సైట్ను మూసేసింది. మాన్యువల్ రిజిష్టర్లో నమోదు విధానాన్ని పునరుద్ధరించింది. జీవోల విడుదలకు సంబంధించి కొత్త ఉత్తర్వులిచ్చింది. టాప్ సీక్రెట్, సీక్రెట్, కాన్ఫిడెన్షియల్, రొటీన్ నేచర్ అని వర్గీకరించింది. తొలి మూడు రకాల జీవోలను బహిర్గతం చేయబోమని పేర్కొంది. నాలుగో రకం జీవో విడుదలైన వారానికి ఏపీ ఈ గెజిట్ వెబ్సైట్లో ఉంచుతామని వెల్లడించింది. దీంతో మొత్తం జీవోల్లో కేవలం 7.3 శాతమే ఏపీ ఈ గెజిట్కు చేరుతున్నాయి.
ఫేక్ జీవోపై ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఉద్యోగ సంఘం నేత ఒకరు వివరణ ఇస్తూ.. పోస్టింగులు పెట్టారు. ప్రభుత్వం అధికారికంగా జీవోలను అందుబాటులో ఉంచకపోతే ఇలా నకిలీ ఉత్తర్వులను రూపొందించి కొందరు వర్తింపజేసుకునేందుకు అవకాశముంటుందని సచివాలయ అధికారులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒరిజినల్ జీవోలోనూ మార్పులు చేసే ప్రమాదమూ ఉందని భావిస్తున్నారు.
ఫేక్ జీవోపై కేసు నమోదు: తప్పుడు జీవోను సృష్టించి ప్రచారం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ప్రకటనలో తెలిపారు. ఫేక్ జీవోపై విచారించి బాధ్యులను శిక్షించాలని ఆర్థికశాఖ డిప్యూటీ సెక్రటరీ శాంతకుమారి తుళ్లూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐటీ యాక్టు, ఐపీసీ సెక్షన్ల కింద నాన్బెయిల్బుల్ కేసు నమోదు చేశామని డీఎస్పీ పోతురాజు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.