Andhra News: కరిగిపోయిన స్థిరాస్తి కల
రాష్ట్రంలో స్థిరాస్తి రంగం వృద్ధి కలలా కరిగిపోయింది. అమరావతి రాజధాని ప్రకటనతో ఊపందుకున్న స్థిరాస్తి వ్యాపార వృద్ధి.. ప్రభుత్వం మారి రాజధాని పనులు నిలిచిపోవడంతో అర్ధంతరంగా ఆగిపోయింది.
పొరుగు రాష్ట్రం తెలంగాణలో భారీ వృద్ధి
ఏపీలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
రాజధాని నిర్మాణం ఆపేయడంతో మధ్యలోనే నిలిచిపోయిన ప్రాజెక్టులు
పెట్టుబడిదారులు, ప్రవాసాంధ్రుల చూపు పొరుగు రాష్ట్రాలవైపే..
ఈనాడు - అమరావతి
రాష్ట్రంలో స్థిరాస్తి రంగం వృద్ధి కలలా కరిగిపోయింది. అమరావతి రాజధాని ప్రకటనతో ఊపందుకున్న స్థిరాస్తి వ్యాపార వృద్ధి.. ప్రభుత్వం మారి రాజధాని పనులు నిలిచిపోవడంతో అర్ధంతరంగా ఆగిపోయింది. పొరుగు రాష్ట్రం తెలంగాణతో పోల్చితే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ బాగా వెనకబడింది. 2015-16, 2021-22 సంవత్సరాల్లో రిజిస్టరైన డాక్యుమెంట్లు, ప్రభుత్వానికి వచ్చిన ఆదాయపరంగా చూస్తే.. రెండు రాష్ట్రాల మధ్య తేడా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 2015-16తో పోల్చితే 2021-22లో తెలంగాణ రిజిస్ట్రేషన్ల ఆదాయం 228.29 శాతం పెరిగింది. ఏపీలో ఆ వృద్ధి 104.89 శాతమే. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో భూముల మార్కెట్ ధరలను 2021 వరకూ పెంచలేదు. 2021 తర్వాతే రెండు సార్లు సవరించారు. ఏపీలో దాదాపు రెండేళ్లకోసారి రిజిస్ట్రేషన్ ధరలను పెంచుతూనే ఉన్నారు. దీనివల్లే ఆదాయంలో వృద్ధి కనిపించింది తప్పితే లావాదేవీలు పెరగలేదని స్థిరాస్తి రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో ఉపాధి, ఉద్యోగావకాశాలు గణనీయంగా తగ్గిపోవడం, ఎక్కువ జీతాలొచ్చే ఐటీ వంటి రంగాల్లో హైదరాబాద్తో పోల్చితే విజయవాడ, విశాఖ వంటి నగరాలు వెనకబడి ఉండటంతో స్థిరాస్తి రంగంలో వృద్ధి రేటు మందగించింది. ఏపీలో ఓ స్థాయి నిర్మాణదారుల నుంచి భారీ ప్రాజెక్టులు చేపట్టిన పెద్ద పెద్ద సంస్థలవారు హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు తరలిపోయారు. స్థలాలు, ఇళ్లపై పెట్టుబడి పెడదామనుకునే ప్రవాసాంధ్రులు.. ఏపీ కంటే హైదరాబాద్ వంటి ఇతర ప్రాంతాలవైపే మొగ్గు చూపుతున్నారు.
* 2015-16లో తెలంగాణలో 10.62 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.3,786 కోట్ల ఆదాయం వచ్చింది. ఏపీలో 15.12 లక్షల రిజిస్ట్రేషన్లు జరగ్గా రూ.3,585.12 కోట్ల ఆదాయం వచ్చింది. తెలంగాణలో కంటే ఏపీలో 4.5 లక్షల రిజిస్ట్రేషన్లు ఎక్కువ జరిగినా.. ఆదాయం తెలంగాణకే రూ.200.88 కోట్లు అధికంగా వచ్చింది.
* 2021-22కి వచ్చేసరికి తెలంగాణలో రిజిస్ట్రేషన్లు దాదాపు రెట్టింపయ్యాయి. 20.38 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2015-16తో పోల్చితే తెలంగాణలో రిజిస్ట్రేషన్లు 91.91 శాతం, ఆదాయం 228.29 శాతం పెరిగాయి. 2015-16లో రెండు రాష్ట్రాల్లో జరిగిన రిజిస్ట్రేషన్ల దామాషా ప్రకారం చూస్తే 2021-22లో ఏపీలో 30 లక్షలకుపైగా రిజిస్ట్రేషన్లు జరగాలి. కానీ 25.74 లక్షల రిజిస్ట్రేషన్లే జరిగాయి. 2015-16తో పోల్చితే ఏపీలో రిజిస్ట్రేషన్లు 70.23 శాతం, ఆదాయం 104.89 శాతం పెరిగాయి.
* 2015-16లో తెలంగాణ ప్రభుత్వానికి రూ.3,786 కోట్ల ఆదాయం రాగా, 2021-22 నాటికి అది రూ.12,429 కోట్లకు చేరింది. 2015-16 లెక్కలతో పోల్చి చూస్తే 2021-22లో ఏపీకి దాదాపు రూ.12వేల కోట్ల ఆదాయం రావాలి. కానీ రూ.7,345.88 కోట్లే వచ్చింది.
* 2015-16లో రెండు రాష్ట్రాల మధ్య ఆదాయంలో వ్యత్యాసం 5.60 శాతం ఉంటే అది 2021-22కి 69.21 శాతానికి పెరిగింది.
* 2018-19కి, 2021-22కి మధ్య.. తెలంగాణలో రిజిస్ట్రేషన్ల ఆదాయం 87.98 శాతం పెరిగితే, ఏపీ ఆదాయంలో వృద్ధి 55.46 శాతమే నమోదయింది.
* తెలంగాణలో రిజిస్ట్రేషన్ల సంఖ్య 2015-16 నుంచి 2019-20 వరకు స్వల్పంగా పెరుగుతూ వచ్చింది. 2019-20లో 16.58 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగి రూ.7,061 కోట్ల ఆదాయం వచ్చింది. కొవిడ్ ప్రభావంతో 2020-21లో రిజిస్ట్రేషన్ల సంఖ్య 14.96 లక్షలకు తగ్గిపోయి, ఆదాయం రూ.5,260 కోట్లకు పడిపోయింది. 2021-22లో రిజిస్ట్రేషన్ల సంఖ్య, ఆదాయం అనూహ్యంగా పెరిగాయి. 20.38 లక్షలకుపైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. రూ.12,429 కోట్ల ఆదాయం వచ్చింది.
* ఆంధ్రప్రదేశ్లో 2015-16లో 15.12 లక్షలున్న రిజిస్ట్రేషన్ల సంఖ్య 2016-17లో 13.71 లక్షలకు తగ్గింది. మళ్లీ క్రమంగా పెరుగుతూ 2020-21కి 17.20 లక్షలకు చేరింది. 2021-22లో ఒక్కసారి 25.74 లక్షలకు పెరిగింది. 2015-16లో రూ.3,585.12 కోట్లున్న ఆదాయం.. 2016-17లో కొంత తగ్గి, ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ వెళ్లింది. 2020-21లో రూ.5,399.41 కోట్ల ఆదాయం రాగా 2021-22లో రూ.7,345.38 కోట్లకు పెరిగింది.
* 2020-21లో తెలంగాణకు వచ్చిన ఆదాయం రూ.5,260 కోట్లయితే, ఏపీ ఆదాయం రూ.5,399.41 కోట్లు. 2015-16లో తెలంగాణ కంటే ఆదాయంలో రూ.200 కోట్లు వెనకబడిన ఆంధ్రప్రదేశ్.. 2020-21లో సుమారు రూ.140 కోట్ల ఆదాయం అధికంగా సాధించింది. కానీ 2021-22కి వచ్చేసరికి తెలంగాణ ఆదాయం రూ.12,429 కోట్లకు చేరగా, ఏపీ రాబడి రూ.7,345.38 కోట్లే. వ్యత్యాసం సుమారు రూ.5,084 కోట్లు. 2020-21తో పోల్చితే 2021-22లో తెలంగాణ ఆదాయంలో 136.29 శాతం వృద్ధి నమోదవగా, ఏపీలో 36.04 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది.
* ప్రాప్టైగర్ అనే సంస్థ దేశంలోని 8 అగ్రశ్రేణి నగరాల్లో స్థిరాస్తి రంగం పురోభివృద్ధిపై చేసిన అధ్యయనం ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికం కంటే రెండో త్రైమాసికంలో ఫ్లాట్ల విక్రయాల్లో అత్యధిక వృద్ధి నమోదైన నగరాల్లో అహ్మదాబాద్ తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్లో 21 శాతం వృద్ధి నమోదైంది.
ని‘బంధనాల’తో మరింత ప్రతికూలత
తాజాగా 200 అడుగుల రహదారులకు అటూ ఇటూ 250 మీటర్ల దూరం వరకు నిర్మించే భవనాలకు చదరపు అడుగుకు రూ.75 చొప్పున అదనంగా ఇంపాక్టు ఫీజు కట్టాలంటూ ప్రభుత్వం మరో నిబంధన తెచ్చింది. ఇది కొత్త నిర్మాణాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
* వీఎంఆర్డీఏ ఇది వరకు ఏటా సగటున 80 వరకు లేఅవుట్లకు అనుమతులిచ్చేది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు వరకు 8 లేవుట్లకే అనుమతులిచ్చింది. లేఅవుట్ల సంఖ్య ఏ స్థాయిలో పడిపోయిందో చెప్పడానికి ఇదో నిదర్శనం మాత్రమే.
రాజధాని నిర్మాణం కొనసాగి ఉంటే!
రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనుకున్నవారికి అమరావతి చుక్కానిలా కనిపించింది. అనతికాలంలోనే అమరావతికి అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ రావడంతో చుట్టుపక్కలున్న విజయవాడ, గుంటూరు, తాడేపల్లి, మంగళగిరి వంటి ప్రాంతాలకూ గిరాకీ పెరిగింది. ప్రముఖ నిర్మాణ సంస్థలు భారీ ప్రాజెక్టులు చేపట్టాయి. ఇటు విజయవాడలోనూ, అటు గుంటూరులోనూ నిర్మాణ రంగం ఊపందుకుంది. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేసేందుకు అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, మెడ్టెక్ జోన్ ఏర్పాటు, లులు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, అదానీ డేటా సెంటర్ వంటి ప్రాజెక్టులకు స్థలాలు కేటాయించడంతో విశాఖలోనూ నిర్మాణ రంగం వేగం పుంజుకుంది. వైకాపా అధికారంలోకి వచ్చాక అమరావతి నిర్మాణాన్ని ఆపేయడంతో.. విజయవాడ- గుంటూరు మధ్య జాతీయ రహదారి పక్కన చేపట్టిన భారీ ప్రాజెక్టుల్లో చాలావరకు ఆగిపోయాయి. ఎల్ఈపీఎల్, జయభేరి, అపర్ణ వంటి సంస్థలు మూడేళ్ల క్రితమే నిర్మాణాలు పూర్తి చేసినా వాటిలో ఫ్లాట్ల విక్రయాలు పూర్తవలేదు. మరికొన్ని సంస్థలు ప్రాజెక్టుల్ని వదిలేసి వెళ్లిపోయాయి. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య, ఆదాయం ఆశించినంత పెరగకపోవడానికి ఇదో ప్రధాన కారణం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ