నేడు దిల్లీకి సీఎం

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం దిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరి 6.45కు దిల్లీ చేరుకుంటారు.

Published : 30 Jan 2023 04:57 IST

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం దిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరి 6.45కు దిల్లీ చేరుకుంటారు. రాత్రికి 1 జనపథ్‌ నివాసంలో బస చేస్తారు. మంగళవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ దిల్లీలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో దౌత్యవేత్తలతో జరగనున్న ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ రౌండ్‌ టేబుల్‌లో పాల్గొంటారు. సాయంత్రం 6.05కు దిల్లీ నుంచి బయల్దేరి రాత్రి 8.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని