నిషేధం.. అస్తవ్యస్తం
నిషిద్ధ భూముల జాబితా తయారీ అస్తవ్యస్తంగా జరుగుతోంది. సబ్డివిజన్ల వారీగా కాకుండా సర్వే నంబర్లలోని భూములు మొత్తాన్ని నిషిద్ధ జాబితాలో చేరుస్తున్నారు.
నిషిద్ధ జాబితాలోనే మొత్తం సర్వే నంబరు
క్రయ, విక్రయాలు జరగక... యజమానుల విలవిల
ఈనాడు, అమరావతి: నిషిద్ధ భూముల జాబితా తయారీ అస్తవ్యస్తంగా జరుగుతోంది. సబ్డివిజన్ల వారీగా కాకుండా సర్వే నంబర్లలోని భూములు మొత్తాన్ని నిషిద్ధ జాబితాలో చేరుస్తున్నారు. దీనివల్ల లక్షల ఎకరాలు చిక్కుల్లో పడ్డాయి. జిల్లా రెవెన్యూ, దేవాదాయ, వక్ఫ్, ఇతరశాఖల నుంచి ఈ జాబితాలు రిజిస్ట్రేషన్లు, స్టాంపులశాఖ జిల్లా అధికారులకు వెళ్తున్నాయి. ప్రభుత్వ భూములను మార్కెట్ ధరకు కొన్నా.. వాటినీ నిషిద్ధ జాబితాలో పెడుతున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో మినహా ఇలా చేయకూడదు. 2016లో న్యాయస్థానం పాత నిషిద్ధ భూముల జాబితాలను పరిశీలించి, కొత్త జాబితాలను రూపొందించాలని పేర్కొంది. అయినా రిజిస్ట్రేషన్లు, స్టాంపులశాఖ అధికారులకు వెళ్తున్న జాబితాల్లో ఇప్పటికీ స్పష్టత లేదు. నిషిద్ధ భూముల జాబితా తయారీలో సమస్యలపై ఇటీవల విజయవాడలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో చర్చ జరిగింది. ఉన్నతస్థాయి అధికారి ఒకరు విశాఖ, కాకినాడలలో వందల ఎకరాలను అనవసరంగా నిషిద్ధ జాబితాలో ఉంచారని వెల్లడించారు. మరోవైపు.. నిషిద్ధ జాబితా నుంచి భూములను తప్పించడంపై 2021లో ఉన్నతస్థాయి కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేసినా పరిస్థితుల్లో మార్పు లేదు. రెవెన్యూశాఖ చర్యలను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలవుతున్న పిటిషన్లలో ఇవీ ఉంటున్నాయి. విశ్రాంత న్యాయమూర్తుల నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేసి, వారి సిఫార్సుల మేరకు నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా జీవో వెలువడినా తదుపరి చర్యల్లో పురోగతి లేదు.
గ్రామకంఠం భూములకూ కష్టాలే
గ్రామకంఠం భూములను నిషిద్ధజాబితా నుంచి తప్పించాలని ప్రభుత్వం 2015లో జారీ చేసిన జీవో 187, జీవో 361లలో స్పష్టంగా పేర్కొంది. ఇప్పటికీ ఈ భూములు చాలాచోట్ల నిషిద్ధ జాబితాలోనే కొనసాగుతున్నాయి.
మాజీ సైనికులకూ తప్పని పాట్లు
1963 ఏప్రిల్ 30న జారీ చేసిన జీవో 743 ప్రకారం మాజీ సైనికోద్యోగులు ప్రభుత్వం కేటాయించిన భూమిని పదేళ్లు అనుభవించాక విక్రయించుకోవచ్చు. పదేళ్ల తర్వాత వీటిని అమ్మాలంటే ప్రభుత్వ అనుమతి అవసరమన్న నిబంధనకు కొంతకాలం క్రితం మినహాయింపు ఇచ్చారు. కానీ... ఇప్పటికీ కొన్నిచోట్ల ఈ భూముల్లో సమస్యలు వస్తూనే ఉన్నాయి.
1954 ముందునాటి ఎసైన్డ్ భూములకూ..
1954లో జూన్ 18న జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేదలకు అందజేసిన భూములను బదిలీ చేయకూడదని షరతు పెట్టారు. ఈ నిబంధన అమల్లోకి రాకముందు వచ్చిన ఎసైన్డ్ పట్టాలనూ రిజిస్టరు చేయడం లేదు. వీటిని నిషిద్ధ జాబితాలో ఉంచక్కర్లేదు. ఆ సర్వే/డోర్ నంబరు మొత్తాన్ని నిషిద్ధ భూమిగా పెట్టడంతో రిజిస్ట్రేషన్లు ఆగుతున్నాయి.
చుక్కల భూములకూ సమస్యలు
ఆర్ఎస్ఆర్లోని కాలమ్-16 ప్రకారం ఏయే భూములకు చుక్కలు పెడితే.. వాటిని చుక్కల భూములుగా పరిగణిస్తున్నారు. ‘ఆర్ఎస్ఆర్’లో చుక్కల భూములకు హక్కుదారుల వివరాలు నమోదై ఉంటే వాటిని 21ఏ జాబితా నుంచి తప్పించాలి. ఏపీ డాటెడ్ ల్యాండ్స్ చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం.. నిర్ణీత వ్యవధిలోగా వచ్చిన విజ్ఞప్తులను పరిష్కరించాలి. 22ఏ (1) (ఇ) కింద పెట్టిన చుక్కల భూముల్లో ప్రభుత్వం మంజూరు చేసినవి ఉంటే.. వాటిని 22ఏ 1 (ఏ) కింద మార్చాలి. చుక్కల భూములపై హక్కులున్నాయని ఆధారాలు చూపిస్తే నిషిద్ధ జాబితా నుంచి తప్పించాలి.
దేవాదాయ, వక్ఫ్ భూములంటేనే భయం
దేవాదాయ, వక్ఫ్ భూములను నిషిద్ధ జాబితాలో చేర్చడంలో ఎక్కువ సమస్యలొస్తున్నాయి. సబ్ డివిజన్ పేర్కొనకుండా సర్వే నంబరు వేస్తున్నారు. ప్రభుత్వ అనుమతితో దేవాదాయ, వక్ఫ్శాఖలు విక్రయించిన భూములూ నిషిద్ధ జాబితాలో ఉన్నాయి. ఇంటి స్థలాల విషయంలో ఇలాగే జరిగితే సర్వేయరు స్కెచ్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశమున్నా... కొర్రీలు పడుతూనే ఉన్నాయి.
* ఒకసారి ప్రభుత్వానికి మార్కెట్ విలువ ప్రకారం చెల్లింపులు జరిగితే.. అవి ప్రైవేటు భూములవుతాయి. వీటిని నిషిద్ధ జాబితాలో ఉంచక్కర్లేదని అధికారులు చెబుతున్నా ఈ దిశగా చర్యల్లేవు.
* దేవాదాయ, వక్ఫ్, రెవెన్యూశాఖల నుంచి మాన్యువల్గా నిషిద్ధ భూముల జాబితాలు రిజిస్ట్రేషన్లశాఖకు అందుతున్నాయి. ఈ వివరాల నమోదులో దొర్లుతున్న తప్పులు కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?