బడిలో గంజాయి పొగ!
‘నాడు- నేడు’ ద్వారా పాఠశాలల రూపురేఖలను మార్చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా చెబుతోంది. తరగతి గదిలోని పిల్లల్లో వస్తున్న మార్పులను మాత్రం గమనించడం లేదు.
మత్తుకు బానిసవుతున్న బాల్యం
విద్యార్థులే లక్ష్యంగా పాఠశాల సమీపంలో విక్రయాలు
ఈనాడు డిజిటల్, అనకాపల్లి - న్యూస్టుడే, అచ్యుతాపురం: ‘నాడు- నేడు’ ద్వారా పాఠశాలల రూపురేఖలను మార్చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా చెబుతోంది. తరగతి గదిలోని పిల్లల్లో వస్తున్న మార్పులను మాత్రం గమనించడం లేదు. అనకాపల్లి జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని పాఠశాలల్లో గంజాయి మత్తు గుప్పుమంటోంది. సామాజిక మాధ్యమాల ప్రభావం, విచ్చలవిడిగా లభిస్తున్న గంజాయి కారణంగా కొందరు భావి పౌరులు మత్తుకు అలవాటు పడుతున్నారు. ప్రధానంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కళాశాలల చుట్టుపక్కల విద్యార్థులే లక్ష్యంగా గుట్టుగా గంజాయి విక్రయాలు సాగుతున్నాయి.
నిషా.. సీసా
గంజాయిని హుక్కాలా పీల్చేందుకు తయారు చేసిన ఓ సీసా అచ్యుతాపురం మండలంలోని ఓ పాఠశాల పక్కనే దొరకడం తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. ఖాళీ సీసాకు మధ్యలో ఓ వైపు రంధ్రం చేసి అందులోకి స్ట్రాలాగా బొప్పాయి గొట్టం జొప్పించారు. సీసాలో గంజాయి పొగను నింపి, గొట్టంతో పీల్చేలా ఈ ఏర్పాటు ఉంది. పాఠశాల విడిచిపెట్టాక కొందరు విద్యార్థులు చాటుగా దీన్ని ఉపయోగిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
* విశాఖ నగరంలోనూ కొందరు వలస కార్మికుల పిల్లలు, తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన కొందరు పిల్లలు ఈ వ్యసనం బారినపడినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలో చదువును పక్కనపెట్టిన కొంతమంది పిల్లలు దారి తప్పారని విద్యాశాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. విద్యా సంస్థల చుట్టుపక్కలే గుట్టుగా మత్తు పదార్థాల విక్రయాలు సాగుతుండటమూ ఓ కారణమని చెబుతున్నారు.
నిఘా పెట్టాం..
గంజాయి విక్రయాలపై నిఘా పెట్టాం. రవాణాను కట్టడి చేశాం. పూర్తిగా నియంత్రించేలా చర్యలు తీసుకుంటున్నాం. మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే కష్టనష్టాలపై అవగాహన కల్పిస్తున్నాం. గంజాయి విక్రయాలు, వినియోగంపై ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు తెలియజేసి సహకరించాలని కోరుతున్నాం.
శ్రీనివాసరావు, డీఎస్పీ, పరవాడ
కళ్లముందే తాగేస్తున్నారు..
* ‘బడికెళ్లే పిల్లలూ గంజాయి తాగున్నారని పోలీసులే చెబుతున్నారు’ అని ఎలమంచిలి ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణమూర్తి రాజు ఇటీవల అచ్యుతాపురం ఉన్నత పాఠశాలలో ట్యాబ్ల పంపిణీలో పేర్కొనడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.
* ఇటీవల అచ్యుతాపురం మండలం హరిపాలెం-కొండకర్ల రహదారిలో పాఠశాల ముగిశాక కొందరు పిల్లలు గంజాయి తాగుతుండటాన్ని ఓ పెద్దాయన చూశారు. మంచిది కాదని వారించగా.. వారు ఆయనతో హేళనగా మాట్లాడి దాడి చేయబోయారు.
* విశాఖ నగర పరిధిలోని ఓ బడి సమీపంలో విద్యార్థులు రోడ్డుపై కొట్లాటకు దిగారు. మరో పాఠశాలలో ఫ్యాన్లు విరగొట్టేశారు. గంజాయి మత్తువల్లే విద్యార్థులు ఇలా ప్రవర్తించారని తెలుసుకున్న అధికారులు విషయం బయటికి పొక్కకుండా వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు.
* అచ్యుతాపురం మండలంలోని ఓ బడి సమీపంలో విద్యార్థులే లక్ష్యంగా కొందరు గంజాయి విక్రయిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?