కార్మికుల నిధుల దారి మళ్లింపు
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను ప్రభుత్వం దారి మళ్లిస్తోంది. భవన నిర్మాణదారుల నుంచి వసూలు చేస్తున్న ఒక శాతం పన్ను మొత్తాన్ని కార్మికుల కోసం ప్రత్యేకంగా వెచ్చించడం లేదు.
బోర్డు నిధులు రూ.1,200 కోట్లు ఫైనాన్షియల్ కార్పొరేషన్లో డిపాజిట్
నవరత్నాల్లో ఇస్తున్నామంటూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల నిలిపివేత
ఈనాడు, అమరావతి: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను ప్రభుత్వం దారి మళ్లిస్తోంది. భవన నిర్మాణదారుల నుంచి వసూలు చేస్తున్న ఒక శాతం పన్ను మొత్తాన్ని కార్మికుల కోసం ప్రత్యేకంగా వెచ్చించడం లేదు. గతంలో ఎన్ని సంక్షేమ పథకాలున్నా కార్మికుల పథకాలను అలాగే కొనసాగించేవారు. ఈ ప్రభుత్వం అన్నింటినీ నవరత్నాల్లో కలిపేసి కార్మికులకు ఉన్న ప్రత్యేక పథకాలను నిలిపేసింది. సాధారణ లబ్ధిదారుల్లాగే వీరినీ పరిగణిస్తోంది. నవరత్నాల పథకాల లబ్ధికి అర్హత నిబంధనల కారణంగా కొంతమంది కార్మికులకు ప్రయోజనాలు దక్కడం లేదు. గతంలో భవన నిర్మాణ కార్మికుల బోర్డులో సభ్యత్వముంటే చాలు అన్ని ప్రయోజనాలు అందేవి. ఇప్పుడా పరిస్థితి దూరమైంది.
నిబంధనలు గాలికి..
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను వారి కోసమే వెచ్చించాలి. ఈ నిబంధన కారణంగా బోర్డు నిధులను ప్రభుత్వం రాష్ట్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్లో డిపాజిట్ చేయించి వాడుకుంటోంది. బోర్డు నుంచి మూడున్నరేళ్లలో రూ.1,200 కోట్లు డిపాజిట్ కింద వెళ్లిపోయాయి. వీటికి ప్రభుత్వం వడ్డీ ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ తీసుకొని ఇతర కార్యక్రమాలను అమలు చేస్తున్న దాఖలాల్లేవు. ఏటా సుమారు రూ.200 కోట్లను వైఎస్సార్ బీమా ప్రీమియానికి మళ్లిస్తోంది.
కష్టాల్లో కనికరించరు..
వైకాపా అధికారంలోకి వచ్చిన మొదట్లో కొత్త ఇసుక విధానమంటూ రేవులను కొన్నాళ్లు మూసేసింది. ఇసుక కొరతతో పనులు లేక కార్మికులు ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత కరోనాతో మరింత కుదేలయ్యారు. ఇప్పుడు స్థిరాస్తి వ్యాపారం సరిగా లేక పూర్తి స్థాయిలో పనులు లేవు. కార్మికులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా నవరత్నాలు ఇస్తున్నామంటూ బోర్డు పథకాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. కరోనా మొదటి దశలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నుంచి సాయం అందుతుందని కేంద్రం ప్రకటించింది. ఇందుకోసం కార్మికుల ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాల నమోదును 3 నెలల్లోపు పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ పథకం కింద లభించే రూ.5వేల కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర కార్మికశాఖ 2020 జులైలో ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేల మంది కార్మికులు దరఖాస్తు చేసుకున్నారు. వారెవరికీ ఇప్పటి వరకూ సాయం అందలేదు. కేంద్రం నిర్దేశాల మేరకు చాలా రాష్ట్రాలు సంక్షేమ నిధి నుంచి కార్మికులకు రూ.5-6వేల చొప్పున చెల్లించాయి.
వేరే పథకాలున్నా..
కార్మికులు బోర్డులో నమోదై ఉంటే వారి ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లకు వివాహ కానుక కింద రూ.20వేల చొప్పున అందేవి. కొత్తగా తీసుకొచ్చిన ‘వైఎస్సార్ కళ్యాణమస్తు’లో ఉన్న పలు నిబంధనల కారణంగా ఆ సాయం అందడం లేదు. గతంలో ఇచ్చిన రూ.20వేలను రూ.లక్షకు పెంచామని ప్రభుత్వం ఘనంగా చెబుతున్నా ఇప్పటివరకూ చాలామంది ప్రయోజనాన్ని కోల్పోయారు.
* కార్మికుడు ప్రమాదంలో మరణించినా, శాశ్వత వైకల్యమేర్పడినా బోర్డు రూ.5లక్షల పరిహారాన్ని కుటుంబానికి ఇచ్చేది. వైఎస్సార్ బీమాలో కలిపి దీనినీ నిలిపేశారు. ఇందులో తమ దరఖాస్తులకు మోక్షం లేదని కార్మికులు వాపోతున్నారు. ఇప్పటికి 262 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.