శ్రీరామనగరంలో సమతాకుంభ్
సమతామూర్తి స్ఫూర్తికేంద్రం శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల తొలి వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ శివారులోని శ్రీరామనగరంలో ఫిబ్రవరి 2 నుంచి 12 వరకూ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు త్రిదండి రామానుజ చినజీయర్స్వామి తెలిపారు.
శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాలు
ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు..
అందరూ ఆహ్వానితులే..
చినజీయర్ స్వామి వెల్లడి
ఈనాడు, హైదరాబాద్; న్యూస్టుడే, శంషాబాద్: సమతామూర్తి స్ఫూర్తికేంద్రం శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల తొలి వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ శివారులోని శ్రీరామనగరంలో ఫిబ్రవరి 2 నుంచి 12 వరకూ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు త్రిదండి రామానుజ చినజీయర్స్వామి తెలిపారు. శ్రీరామనగరంలోని తన ఆశ్రమంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ‘సమతాకుంభ్-2023’గా నామకరణం చేశామని, శ్రీరామానుజాచార్యుల సమతాస్ఫూర్తి సందేశాన్ని ప్రజలందరికీ వివరించాలన్న లక్ష్యంతో లక్షల మందిని ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. ఇకపై ఏటా సమాతాకుంభ్ పేరుతో బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలు మతపరమైనవి కావని, ప్రజలంతా ఆహ్వానితులేనని తెలిపారు. రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపలేదని వివరించారు.
రాజకీయ పార్టీలు, నాయకుల మధ్య అంతరాలు పెరగడం ప్రజలకు క్షేమం కాదు
సమాజ శ్రేయస్సుకు కృషి చేస్తున్న రాజకీయ పార్టీలు, నాయకుల మధ్య అంతరాలు పెరగడం ప్రజలకు క్షేమం కాదని చినజీయర్ స్వామి అన్నారు. ఒకరినొకరు దూషించుకోవడం మంచిది కాదని, వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యాఖ్యానించడం సరికాదని, ఇది ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపుతుందని అన్నారు.
పద్మభూషణ్ ఇస్తామన్నారు.. సరేనన్నా..
‘‘కొద్దిరోజుల క్రితం దిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. మీకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించాలనుకుంటున్నామని.. మీకేమైనా అభ్యంతరమా అంటూ అడిగారు. సరే అన్నాను. నాకేం అభ్యంతరం లేదని చెప్పాను. పద్మభూషణ్ కావాలంటూ నేను ఎవరినీ అభ్యర్థించలేదు’’ అని చినజీయర్ స్వామి తెలిపారు. ఏడాది వ్యవధిలో 2 కోట్ల మంది సమతామూర్తిని సందర్శించుకున్నారని, రోజూ సగటున 5 వేల మంది సందర్శకులు వస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో సముద్రాల రంగ రామానుజాచార్యులు, దేవనాధ జీయర్స్వామి, అహోబిల జీయర్ స్వామి, వికాస తరంగణి అధ్యక్షుడు, విశ్రాంత ఐఏఎస్ జగదీశ్వర్లు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల ప్రత్యేకతలు..
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏ పుణ్యక్షేత్రానికి, దేవాలయానికైనా భక్తులంతా దేవుని వద్దకు వెళ్తారని, ఇందుకు భిన్నంగా శ్రీరామనగరంలోని 108 దివ్యదేశాల ఆలయాల్లో కొలువైన ఉత్సవమూర్తులను భక్తుల వద్దకే తీసుకురానున్నట్లు చినజీయర్ స్వామి తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ప్రత్యేకమేనని, రామానుజ నూత్తందాది, శాంతి కల్యాణమహోత్సవం, తెప్పోత్సవం, లక్షమందితో గీతా పారాయణం ప్రధానమైనవని వెల్లడించారు.
* ఫిబ్రవరి 5న 108 దివ్యక్షేత్రాల్లో కొలువైన 108 దేవుళ్లకు సాయంత్రం 5 గంటల నుంచి శాంతి కల్యాణ మహోత్సవం. దేశంలో తొలిసారిగా 18 మంది గరుత్మంతులతో గరుడ వాహనసేవలు.
* 8న క్షీరసాగర శయనుడికి 18 రూపాల్లో సాయంత్రం 4.30 నుంచి తెప్పోత్సవం. మధ్యాహ్నం 1.30 గంటలకు భగవద్గీతలోని శ్లోకాలపై 10 వేల మంది విద్యార్థులకు ‘సూపర్ మెమొరీ’ పరీక్ష.
* 11న లక్ష మంది భక్తులు, విద్యార్థులతో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి విశ్వశాంతి విరాట్ గీతా పారాయణం. ఉదయం రథోత్సవం, పుష్కరిణిలో చక్రస్నానం.
* 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా వికాస తరంగిణి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 250 మంది వైద్యనిపుణులతో మహిళలకు ప్రత్యేకంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది. -
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. -
వైకాపా సైన్యం బరితెగింపు
ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. -
వేతనాల చెల్లింపులపై నేడు ‘చివరి గ్రీవెన్స్ డే’
వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి ‘గ్రీవెన్స్ డే’(వినతుల స్వీకరణ)లో పరిష్కరించుకోవాలని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ సూచించారు. -
జగన్పై పోస్టులో అభ్యంతరకర భాగాన్ని తొలగించండి
వైకాపా అధ్యక్షుడు జగన్పై తెదేపా ఎక్స్ ఖాతాలో ఉంచిన పోస్టులో అభ్యంతరకరమైన ఓ భాగాన్ని తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం లేఖ రాసింది. -
కక్షిదారులకు వెంటనే న్యాయం అందించాలి
న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. -
ఓఎంఆర్ షీట్లో గల్లంతైన విద్యార్థిని పేరు
విద్యాశాఖ అధికారుల తీరుతో పదో తరగతి విద్యార్థిని అరగంటపాటు తల్లడిల్లాల్సి వచ్చింది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వర్షిణి తనకు కేటాయించిన బైపాస్లోని రత్నం పరీక్షా కేంద్రం వద్దకు అరగంట ముందుగానే చేరుకుంది. -
కోడ్ కూసే ముందు.. అయినవారికే నిధులు
ఇప్పటికే పలు దఫాలు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ పరిధిలో రహదారుల పనులు చేసిన గుత్తేదార్లకు మాత్రమే చెల్లింపులు చేశారంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. -
కాసులివ్వని కపట ప్రేమ!
పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు.. రైతులకు మాత్రం సున్నా వడ్డీ లేదు. పెట్టుబడి సాయమూ లేదు. -
గ్రహణం వీడితేనే గట్టెక్కేది!
చుట్టూ నీళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ నిర్మాణాలు టిడ్కో ఇళ్లు. ఒంగోలు నగరం సమీపంలోని చింతల వద్ద తెదేపా హయాంలో నిర్మించారు. -
ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు
ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది. -
ఉత్తుత్తి సంక్షేమం
‘గడప గడపకు సంక్షేమం’ పేరుతో వైకాపా ప్రభుత్వం పేదలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. -
కోడ్ ఉల్లంఘన విచారణలో జాప్యం: కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వాలంటీర్ల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదేం సామాజిక న్యాయం జగన్?
వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం నేతి బీర చందంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాను కలిపి వైకాపా టికెట్ల కేటాయింపు పరిశీలిస్తే.. జగన్ మార్క్ న్యాయం ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
సీపీఎస్ ఉద్యోగుల డబ్బులు రూ.2,800 కోట్లు హాంఫట్
జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. -
ఆగని సలహాదారు నియామకాల జోరు
ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకంపై హైకోర్టు అభ్యంతరం చెప్పినా జగన్ ప్రభుత్వ తీరు మారడంలేదు.
తాజా వార్తలు (Latest News)
-
Gadchiroli: గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టుల హతం
-
మూడు కార్లలో తాయిలాల సరకు దాటిపోయిందా...?!
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
వంట త్వరగా చేయలేదని భార్యను హతమార్చి.. ఆపై ఆత్మహత్య
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
-
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం