ప్రభుత్వ భూమిలో దర్జాగా లేఅవుట్
అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ప్రభుత్వ భూమిలోనే లేఅవుట్ వేసేశారు. యంత్రాల సహాయంతో భూమిని చదును చేసి ప్లాట్లుగా విభజించి అమ్మకాలు చేపట్టారు.
అక్రమంగా అమ్మకాలు
అనకాపల్లి జిల్లా వల్లూరులో వైకాపా నేతల భూదందా
తమకు మంత్రి అమర్నాథ్ అండదండలు ఉన్నాయని బెదిరింపులు
ఈనాడు డిజిటల్, అనకాపల్లి - లక్ష్మీదేవిపేట, న్యూస్టుడే: అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ప్రభుత్వ భూమిలోనే లేఅవుట్ వేసేశారు. యంత్రాల సహాయంతో భూమిని చదును చేసి ప్లాట్లుగా విభజించి అమ్మకాలు చేపట్టారు. డిమాండునుబట్టి సెంటుకు రూ.4 లక్షల నుంచి రూ.6లక్షల వరకూ వసూలు చేస్తున్నారు. ఈ తంతు బహిరంగంగానే జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా భూదందా కొనసాగుతోంది. ఎవరైనా గ్రామస్థులు ప్రశ్నిస్తే మంత్రి అమర్నాథ్, మండల స్థాయి నేత అండదండలున్నాయని, ఎవరూ ఏమీ చేయలేరని ఎదురు తిరుగుతున్నారు. మంత్రి తమకు అనుకూలంగా ఇచ్చిన లెటర్ ఉందని చెబుతున్నట్లు తెలిసింది. అనకాపల్లి జిల్లా వల్లూరు గ్రామంలోని సర్వే నంబరు 159లో రూ.కోట్ల విలువైన రెండెకరాల ప్రభుత్వ భూమి ఉంది. తాజాగా అనకాపల్లి జిల్లాగా ఏర్పడటం, మరోవైపు ఈ గ్రామం జీవీఎంసీ పరిధిలో ఉండటంతో ఇక్కడి భూములకు డిమాండ్ పెరిగింది. దీంతో గ్రామానికి చెందిన కొంత మంది వైకాపా నాయకులు ముఠాగా ఏర్పడి భూదందాకు తెరతీశారు.
గతంలో 60 మందికి పట్టాల పంపిణీ
1993లో 60 మంది రిక్షా కార్మికులకు ఈ సర్వే నంబరులో ఒక్కొక్కరికి 3 సెంట్ల చొప్పున స్థలాలిచ్చారు. అయితే అనువుగా లేకపోవడంతో ఎవరూ ఇళ్లు నిర్మించుకోవడానికి ముందుకు రాలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టా ఇచ్చిన 6 నెలల్లో నిర్మాణం చేపట్టకపోతే మళ్లీ ఆ స్థలం రెవెన్యూ ఆధీనంలోకి వెళ్లిపోతుంది. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల క్రితం కొంతమంది అక్రమంగా చొరబడి నిర్మాణ పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు నిర్మాణాలను కూల్చివేసి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఇటీవల గ్రామానికి చెందిన కొంతమంది వైకాపా నాయకులు రెవెన్యూ హెచ్చరిక బోర్డు పీకేసి యంత్రాల సహాయంతో దున్నేశారు. లేఅవుట్ వేసి దర్జాగా అమ్మకాలు చేపడుతున్నారు. గతంలో పట్టాలు పొందినవారిలో కొంత మందిని బెదిరించి మరీ పత్రాలు లాగేసుకున్నట్లు సమాచారం.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం
వల్లూరులో ప్రభుత్వ భూమి ఆక్రమణపై పరిశీలించి చర్యలు తీసుకుంటాం. తహసీల్దార్ను పంపించి వివరాలను సేకరిస్తాం. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే కేసులు నమోదు చేస్తాం. నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తాం.
చిన్నికృష్ణ, ఆర్డీఓ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. -
వైకాపా సైన్యం బరితెగింపు
ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. -
వేతనాల చెల్లింపులపై నేడు ‘చివరి గ్రీవెన్స్ డే’
వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి ‘గ్రీవెన్స్ డే’(వినతుల స్వీకరణ)లో పరిష్కరించుకోవాలని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ సూచించారు. -
జగన్పై పోస్టులో అభ్యంతరకర భాగాన్ని తొలగించండి
వైకాపా అధ్యక్షుడు జగన్పై తెదేపా ఎక్స్ ఖాతాలో ఉంచిన పోస్టులో అభ్యంతరకరమైన ఓ భాగాన్ని తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం లేఖ రాసింది. -
కక్షిదారులకు వెంటనే న్యాయం అందించాలి
న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. -
ఓఎంఆర్ షీట్లో గల్లంతైన విద్యార్థిని పేరు
విద్యాశాఖ అధికారుల తీరుతో పదో తరగతి విద్యార్థిని అరగంటపాటు తల్లడిల్లాల్సి వచ్చింది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వర్షిణి తనకు కేటాయించిన బైపాస్లోని రత్నం పరీక్షా కేంద్రం వద్దకు అరగంట ముందుగానే చేరుకుంది. -
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!
అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
కోడ్ కూసే ముందు.. అయినవారికే నిధులు
ఇప్పటికే పలు దఫాలు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ పరిధిలో రహదారుల పనులు చేసిన గుత్తేదార్లకు మాత్రమే చెల్లింపులు చేశారంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. -
కాసులివ్వని కపట ప్రేమ!
పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు.. రైతులకు మాత్రం సున్నా వడ్డీ లేదు. పెట్టుబడి సాయమూ లేదు. -
గ్రహణం వీడితేనే గట్టెక్కేది!
చుట్టూ నీళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ నిర్మాణాలు టిడ్కో ఇళ్లు. ఒంగోలు నగరం సమీపంలోని చింతల వద్ద తెదేపా హయాంలో నిర్మించారు. -
ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు
ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది. -
ఉత్తుత్తి సంక్షేమం
‘గడప గడపకు సంక్షేమం’ పేరుతో వైకాపా ప్రభుత్వం పేదలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. -
కోడ్ ఉల్లంఘన విచారణలో జాప్యం: కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వాలంటీర్ల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదేం సామాజిక న్యాయం జగన్?
వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం నేతి బీర చందంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాను కలిపి వైకాపా టికెట్ల కేటాయింపు పరిశీలిస్తే.. జగన్ మార్క్ న్యాయం ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
సీపీఎస్ ఉద్యోగుల డబ్బులు రూ.2,800 కోట్లు హాంఫట్
జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. -
ఆగని సలహాదారు నియామకాల జోరు
ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకంపై హైకోర్టు అభ్యంతరం చెప్పినా జగన్ ప్రభుత్వ తీరు మారడంలేదు. -
ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!
పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది. -
మధ్యవర్తిత్వంతో సత్వర న్యాయం
కోర్టుల్లో పేరుకుపోతున్న కేసుల పరిష్కారంతో పాటు సత్వర న్యాయానికి మధ్యవర్తిత్వం దోహదపడుతుందని ఏపీ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి పేర్కొన్నారు.