ఆర్టీసీ నుంచి మరింత పిండేద్దాం!
ఆర్టీసీ రాబడి నుంచి మరింత సొమ్ము తీసుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నెలకు 25 శాతం రాబడుతున్న సర్కారు.. ఇకపై రోజువారీ ఆదాయంలో ఖర్చులు పోనూ, మిగిలినదంతా తీసుకునేందుకు సిద్ధమవుతోంది.
రాబడిలో నెలకు 25 శాతం తీసుకుంటున్న ప్రభుత్వం
ఇకపై రోజువారీగా తీసుకునేందుకు సన్నాహాలు
ఖర్చులు పోనూ మిగులంతా సర్కారు ఖజానాకే
ఆర్టీసీ రాబడి నుంచి మరింత సొమ్ము తీసుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నెలకు 25 శాతం రాబడుతున్న సర్కారు.. ఇకపై రోజువారీ ఆదాయంలో ఖర్చులు పోనూ, మిగిలినదంతా తీసుకునేందుకు సిద్ధమవుతోంది. దీనివల్ల నెలకు అదనంగా మరో రూ.50 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాలోకి చేరిపోతుంది. ఆర్టీసీ ఉద్యోగులు ప్రజా రవాణాశాఖ (పీటీడీ)లో విలీనమయ్యాక వారి జీతాలను ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఆర్టీసీకి జీతాల భారం లేకపోవడంతో.. ఆ సొమ్ముతో బ్యాంకు రుణాల చెల్లింపులు, ఉద్యోగుల పాత బకాయిలను ఒకొక్కటిగా తీర్చుకుంటూ వస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వం కన్ను ఆర్టీసీ రాబడిపై పడింది. జీతాలు చెల్లిస్తున్నందున.. సంస్థ నుంచి కొంత మొత్తం తీసుకునేందుకు వీలైన అంశాలను పరిశీలించింది. మొదట ఆర్టీసీని లీజుకు తీసుకునేలా, రాబడిలో ఖర్చులు పోనూ మిగిలినదంతా ప్రభుత్వానికి దక్కేలా.. అధికారుల కమిటీ నివేదిక రూపొందించింది. ముందుగా రాబడి నుంచి నెలకు 25 శాతం తీసుకునే ప్రక్రియను ఆరంభించారు. నెలకు రాబడి సగటున రూ. 480-500 కోట్ల వరకు ఉండగా.. అందులో రూ.120-125 కోట్లు ప్రతినెలా ప్రభుత్వానికి వెళ్తోంది.
మరో రూ.50 కోట్ల వరకు రాబట్టేలా..
తాజాగా మరింత ఎక్కువ మొత్తం తీసుకోవడానికి వీలుగా.. నెలవారీగా కాకుండా, ఆర్టీసీకి నిత్యం వచ్చే రాబడిలో వ్యయాలు మినహాయించుకొని మిగిలినదంతా జిల్లాలవారీగా ప్రభుత్వ ఖజానాకు జమచేయాలని ప్రతిపాదిస్తోంది. సాధారణంగా ఆర్టీసీ రాబడిలో డీజిల్కు 50 శాతం, విడిభాగాలు, నిర్వహణ వ్యయాల కింద 15 శాతం ఖర్చవుతుంది. మిగిలిన 35 శాతంలో 25 శాతం ప్రభుత్వం తీసుకుంటోంది. ఇంకా 10 శాతం ఉంటుంది. దానిని సంస్థ ఇతర అవసరాలకు వినియోగించేందుకు అవకాశం ఉంటోంది. ఇపుడు ఈ మొత్తంపైనా ప్రభుత్వం కన్నేసింది. ఖర్చులన్నీ పోనూ నిత్యం మిగిలేదంతా తీసుకోవడం ద్వారా మొత్తంగా నెలకు సంస్థ రాబడిలో 35 శాతం వరకు సర్కారుకు వెళ్తుంది. అంటే ఇపుడు నెలకు రూ.125 కోట్లు సర్కారుకు చేరుతుండగా, కొత్త ప్రతిపాదనతో మరో రూ.50 కోట్లు ఆర్టీసీ వదులుకోవాల్సి ఉంటుంది. దీనిని ఒకటి, రెండు నెలల్లో అమలు చేసేందుకు చూస్తున్నట్లు సమాచారం.
కొత్త బస్సుల కొనుగోళ్లు ప్రశ్నార్థకమే?
ఆర్టీసీ కాలం చెల్లిన బస్సుల స్థానంలో వెంటనే 617 కొత్త బస్సులు తీసుకోవాలని, దీనికి రూ.250 కోట్ల వరకు వ్యయమవుతుందని ప్రతిపాదించింది. రాబడిలో 25 శాతం ప్రభుత్వానికి ఇవ్వగా, మిగిలే మొత్తాన్ని బస్సుల కొనుగోలుకి వినియోగించవచ్చని అధికారులు భావించారు. ఇపుడు మిగులు మొత్తమంతా సర్కారు తీసుకుంటే కొత్త బస్సుల కొనుగోళ్లు ప్రశ్నార్థకమవుతుందని ఆర్టీసీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది. -
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. -
వైకాపా సైన్యం బరితెగింపు
ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. -
వేతనాల చెల్లింపులపై నేడు ‘చివరి గ్రీవెన్స్ డే’
వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి ‘గ్రీవెన్స్ డే’(వినతుల స్వీకరణ)లో పరిష్కరించుకోవాలని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ సూచించారు. -
జగన్పై పోస్టులో అభ్యంతరకర భాగాన్ని తొలగించండి
వైకాపా అధ్యక్షుడు జగన్పై తెదేపా ఎక్స్ ఖాతాలో ఉంచిన పోస్టులో అభ్యంతరకరమైన ఓ భాగాన్ని తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం లేఖ రాసింది. -
కక్షిదారులకు వెంటనే న్యాయం అందించాలి
న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. -
ఓఎంఆర్ షీట్లో గల్లంతైన విద్యార్థిని పేరు
విద్యాశాఖ అధికారుల తీరుతో పదో తరగతి విద్యార్థిని అరగంటపాటు తల్లడిల్లాల్సి వచ్చింది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వర్షిణి తనకు కేటాయించిన బైపాస్లోని రత్నం పరీక్షా కేంద్రం వద్దకు అరగంట ముందుగానే చేరుకుంది. -
కోడ్ కూసే ముందు.. అయినవారికే నిధులు
ఇప్పటికే పలు దఫాలు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ పరిధిలో రహదారుల పనులు చేసిన గుత్తేదార్లకు మాత్రమే చెల్లింపులు చేశారంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. -
కాసులివ్వని కపట ప్రేమ!
పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు.. రైతులకు మాత్రం సున్నా వడ్డీ లేదు. పెట్టుబడి సాయమూ లేదు. -
గ్రహణం వీడితేనే గట్టెక్కేది!
చుట్టూ నీళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ నిర్మాణాలు టిడ్కో ఇళ్లు. ఒంగోలు నగరం సమీపంలోని చింతల వద్ద తెదేపా హయాంలో నిర్మించారు. -
ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు
ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది. -
ఉత్తుత్తి సంక్షేమం
‘గడప గడపకు సంక్షేమం’ పేరుతో వైకాపా ప్రభుత్వం పేదలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. -
కోడ్ ఉల్లంఘన విచారణలో జాప్యం: కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వాలంటీర్ల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదేం సామాజిక న్యాయం జగన్?
వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం నేతి బీర చందంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాను కలిపి వైకాపా టికెట్ల కేటాయింపు పరిశీలిస్తే.. జగన్ మార్క్ న్యాయం ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
సీపీఎస్ ఉద్యోగుల డబ్బులు రూ.2,800 కోట్లు హాంఫట్
జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. -
ఆగని సలహాదారు నియామకాల జోరు
ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకంపై హైకోర్టు అభ్యంతరం చెప్పినా జగన్ ప్రభుత్వ తీరు మారడంలేదు.
తాజా వార్తలు (Latest News)
-
Nalgonda: ఆర్పీఎఫ్ ఎస్ఐగా చలామణి.. పెళ్లి చూపుల్లో బయటపడిన యువతి మోసం
-
NDA: ఎన్డీఏ ‘మహా’ వ్యూహం.. ఉద్ధవ్కు చెక్ పెట్టేందుకు రంగంలోకి రాజ్..!
-
Stock market: భారీ నష్టాల్లో సూచీలు.. సెన్సెక్స్ 700 పాయింట్లు డౌన్
-
India- China: ఎన్నిసార్లు వాదించినా వాస్తవాలు మారవు.. చైనాకు భారత్ కౌంటర్
-
CAA: సీఏఏపై స్టే కోరుతూ పిటిషన్లు.. కేంద్రానికి మూడు వారాల గడువిచ్చిన సుప్రీం
-
Sita Soren: జేఎంఎంకు షాక్..! భాజపాలోకి శిబూ సోరెన్ పెద్ద కోడలు