స్మార్ట్ మీటర్లు వద్దన్నా డిస్కంలకు భలే ఆసక్తి
స్మార్ట్ మీటర్లలో వినియోగించే సాంకేతికత ఆమోదించదగినదేనా? వాటిలోని సాంకేతికతను అనుసంధానించే విషయంలో సమస్యలు తలెత్తుతున్నట్లు ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి. భారీ సంఖ్యలో ఏర్పాటు చేసే మీటర్ల విషయంలో మా అనుమతి లేకుండా డిస్కంలు ముందుకు వెళ్లవద్దు’
ఏపీఈఆర్సీ ఆమోదం లేకుండానే ఒప్పందాలు
రూ.14,495 కోట్ల విలువైన పనులకు టెండర్లు
స్మార్ట్ మీటర్లలో వినియోగించే సాంకేతికత ఆమోదించదగినదేనా? వాటిలోని సాంకేతికతను అనుసంధానించే విషయంలో సమస్యలు తలెత్తుతున్నట్లు ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి. భారీ సంఖ్యలో ఏర్పాటు చేసే మీటర్ల విషయంలో మా అనుమతి లేకుండా డిస్కంలు ముందుకు వెళ్లవద్దు’
రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) 2022-23 రిటైల్ సప్లై టారిఫ్ (ఆర్ఎస్టీ) ఆర్డర్లో డిస్కంలను ఉద్దేశించి ఇచ్చిన ఆదేశాలివి.
ఈనాడు, అమరావతి: ‘ఆర్డీఎస్ఎస్ పథకం కింద ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వరంగ సంస్థలు, వీధి దీపాలు, గ్రామీణ, పట్టణ తాగునీటి పథకాలు, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లకు మాత్రమే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు డిస్కంలు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చాయి. దీనివల్ల ఇతర విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి ఆర్థిక భారం పడబోదని చెప్పాయి’ ఇదే విషయాన్ని ఆర్ఎస్టీ ఆర్డర్లో ఏపీఈఆర్సీ పేర్కొంది. ఈ మేరకు మీటర్ల ఏర్పాటు ఖర్చు వినియోగదారులపై మోపడానికి వీల్లేదు. అయితే అధికారులు మాత్రం మీటర్ల ఏర్పాటు, నిర్వహణ ఖర్చు మొత్తం సోషలైజ్ చేస్తామని చెబుతున్నారంటే నియంత్రణ సంస్థ ఆదేశాలను ఉల్లంఘించినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
‘స్మార్ట్’పైనే అనుమానాలు..
స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై అనుమతి లేకుండా ముందుకు వెళ్లొద్దని ఏపీఈఆర్సీ స్పష్టంగా చెప్పినా.. ఆ ఆదేశాలను డిస్కంలు ఖాతరు చేయడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనలతో స్మార్ట్ మీటర్లు, అనుబంధ పరికరాలు, నిర్వహణకు టెండర్లు పిలిచాయి. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) కింద రెండు దశల్లో కలిపి సుమారు 50 లక్షల విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో భాగంగా మొదటి దశలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక, ప్రభుత్వ కార్యాలయాలకు కలిపి మొత్తం 27.68 లక్షల మీటర్లు ఏర్పాటు చేస్తున్నాయి. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు 18.5 లక్షల మీటర్లను డిస్కంలు పెడుతున్నాయి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు, అనుబంధ పరికరాలు, నిర్వహణ ఖర్చుల కింద అడ్డగోలు ధరలకు డిస్కంలు టెండర్లు పిలిచాయి. ఈ ప్రకారం ఒక్కో మీటర్కు రూ.35 వేల వంతున.. రూ.6,480 కోట్లు డిస్కంలు ఖర్చు చేయడంపై విద్యుత్ రంగ నిపుణులు, ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు రావడంతో రద్దు చేశాయి. ధరలను సవరించి మళ్లీ టెండర్లు పిలిచాయి. సవరించిన ధరల ప్రకారం ఒక్కో మీటర్కు రూ.30,625 వంతున.. రూ.5,568.33 కోట్లను డిస్కంలు ఖర్చు చేస్తున్నాయి. అలాగే, గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లకు కూడా మీటర్ల ఏర్పాటు కోసం కేంద్రం ఇచ్చే గ్రాంటు రూ.5,356.42 కోట్లు పోను.. రూ.3,570.91 కోట్లను రుణంగా డిస్కంలు తీసుకుంటున్నాయి. మొత్తంగా వ్యవసాయ, వ్యవసాయేతర విద్యుత్ కనెక్షన్లకు కలిపి సుమారు రూ.14,495 కోట్లను డిస్కంలు ఖర్చు చేస్తున్నాయి. ఈ భారం మొత్తం పరోక్షంగా విద్యుత్ ఛార్జీల రూపేణా ప్రజలపై పడుతుంది.
ఒప్పందాలు కుదుర్చుకుని.. తీరిగ్గా ఏపీఈఆర్సీకి సమాచారం
విద్యుత్ సంస్థల్లో చేపట్టే అభివృద్ధి పనులు, విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి చేసే ఖర్చులకు సంబంధించి ముందస్తుగా ఏపీఈఆర్సీ నుంచి ఆమోదం తీసుకోవాలి. ఆ తర్వాతే తగిన చర్యలు తీసుకోవాలి. ఆర్డీఎస్ఎస్ కింద స్మార్ట్ మీటర్లకు సంబంధించి 2022-23 ఆర్ఎస్టీవోలో ఏపీఈఆర్సీ డిస్కంలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ పథకం కింద రూ.వేల కోట్లను వెచ్చించడానికి ముందే ఏపీఈఆర్సీ నుంచి ఆమోదం తప్పనిసరి అని పేర్కొంది. దీన్ని డిస్కంలు ఎక్కడా పాటించడం లేదు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలతో ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. 2022 మార్చి 17న ఆర్డీఎస్ఎస్ను కేంద్రం ఆమోదించింది. దీని అమలుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందించేలా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)తో కుదుర్చుకున్న ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంలు 2022 మార్చి 25న సంతకాలు చేశాయి. ఈ పెట్టుబడి ప్రతిపాదనను 2022 మే 24న ఏపీఈఆర్సీకి డిస్కంలు అందచేశాయి. దీంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందు ఏపీఈఆర్సీ నుంచి ఎలాంటి ఆమోదాన్ని డిస్కంలు తీసుకోలేదని తేలింది. విద్యుత్ సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షించే సంస్థ అనుమతి లేకుండానే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు డిస్కంలు చకచకా ఎందుకు అడుగులు వేశాయి? ఆ భారాన్ని వినియోగదారులపై వేయబోమని చెప్పి.. ఇప్పుడు సోషలైజేషన్ చేస్తామని అధికారులు చెబుతున్నారంటే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం కాదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు కోసం డిస్కంలు పంపిన ప్రతిపాదనకు ఇప్పటికీ ఏపీఈఆర్సీ ఆమోదం లేదు.
డిస్కంలే మీటర్లు ఎందుకు కొనాలి?
ఏపీఈఆర్సీ నిబంధనల ప్రకారం ఫలానా మీటరే కొనాలని వినియోగదారులను డిస్కంలు ఒత్తిడి చేయకూడదు. ఈ విషయాన్ని 2006 జనవరి 6న జారీ చేసిన నిబంధనల్లో ఏపీఈఆర్సీ స్పష్టంగా పేర్కొంది. నిబంధనల ప్రకారం వినియోగదారుడు డిస్కంలు గుర్తించిన కంపెనీల నుంచి మీటర్ను కొనాలి. దీనికోసం మీటర్ల తయారీ కంపెనీల జాబితాను డిస్కంలు ఎప్పటికప్పుడు ప్రకటించాలి. ఒకవేళ వినియోగదారుడు కోరితేనే మీటరు ఏర్పాటు చేసి.. ఆ ఖర్చును వినియోగదారుడి నుంచి వసూలు చేయాలి. ఈ నిబంధనకు విరుద్ధంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు చేసే ఖర్చును సోషలైజేషన్ పేరిట ప్రతి వినియోగదారుడిపై వేస్తామని ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో సాక్షాత్తు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ చెప్పారు. అలాగే వ్యవసాయ కనెక్షన్లకు ప్రభుత్వం చేసే ఖర్చుభారం కూడా అంతిమంగా ప్రజలపైనే పడుతుంది. ప్రస్తుతం వినియోగిస్తున్న ఐఆర్డీఏ మీటర్లను 10 ఏళ్ల నుంచే డిస్కంలు ఏర్పాటు చేస్తున్నాయి. వాటి స్థానంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసినా.. కేవలం ఆన్లైన్ విధానంలో మీటర్ రీడింగ్ నమోదు చేసే వెసులుబాటు మాత్రమే డిస్కంలకు కలుగుతుంది. ఐఆర్డీఏ, స్మార్ట్ మీటర్లలో వినియోగించే సాంకేతికతలో అంతకు మించి ఎలాంటి వ్యత్యాసం లేదని నిపుణులు చెబుతుండటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది. -
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. -
వైకాపా సైన్యం బరితెగింపు
ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. -
వేతనాల చెల్లింపులపై నేడు ‘చివరి గ్రీవెన్స్ డే’
వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి ‘గ్రీవెన్స్ డే’(వినతుల స్వీకరణ)లో పరిష్కరించుకోవాలని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ సూచించారు. -
జగన్పై పోస్టులో అభ్యంతరకర భాగాన్ని తొలగించండి
వైకాపా అధ్యక్షుడు జగన్పై తెదేపా ఎక్స్ ఖాతాలో ఉంచిన పోస్టులో అభ్యంతరకరమైన ఓ భాగాన్ని తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం లేఖ రాసింది. -
కక్షిదారులకు వెంటనే న్యాయం అందించాలి
న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. -
ఓఎంఆర్ షీట్లో గల్లంతైన విద్యార్థిని పేరు
విద్యాశాఖ అధికారుల తీరుతో పదో తరగతి విద్యార్థిని అరగంటపాటు తల్లడిల్లాల్సి వచ్చింది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వర్షిణి తనకు కేటాయించిన బైపాస్లోని రత్నం పరీక్షా కేంద్రం వద్దకు అరగంట ముందుగానే చేరుకుంది. -
కోడ్ కూసే ముందు.. అయినవారికే నిధులు
ఇప్పటికే పలు దఫాలు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ పరిధిలో రహదారుల పనులు చేసిన గుత్తేదార్లకు మాత్రమే చెల్లింపులు చేశారంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. -
కాసులివ్వని కపట ప్రేమ!
పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు.. రైతులకు మాత్రం సున్నా వడ్డీ లేదు. పెట్టుబడి సాయమూ లేదు. -
గ్రహణం వీడితేనే గట్టెక్కేది!
చుట్టూ నీళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ నిర్మాణాలు టిడ్కో ఇళ్లు. ఒంగోలు నగరం సమీపంలోని చింతల వద్ద తెదేపా హయాంలో నిర్మించారు. -
ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు
ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది. -
ఉత్తుత్తి సంక్షేమం
‘గడప గడపకు సంక్షేమం’ పేరుతో వైకాపా ప్రభుత్వం పేదలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. -
కోడ్ ఉల్లంఘన విచారణలో జాప్యం: కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వాలంటీర్ల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదేం సామాజిక న్యాయం జగన్?
వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం నేతి బీర చందంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాను కలిపి వైకాపా టికెట్ల కేటాయింపు పరిశీలిస్తే.. జగన్ మార్క్ న్యాయం ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
సీపీఎస్ ఉద్యోగుల డబ్బులు రూ.2,800 కోట్లు హాంఫట్
జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. -
ఆగని సలహాదారు నియామకాల జోరు
ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకంపై హైకోర్టు అభ్యంతరం చెప్పినా జగన్ ప్రభుత్వ తీరు మారడంలేదు.
తాజా వార్తలు (Latest News)
-
NDA: ఎన్డీఏ ‘మహా’ వ్యూహం.. ఉద్ధవ్కు చెక్ పెట్టేందుకు రంగంలోకి రాజ్..!
-
Stock market: భారీ నష్టాల్లో సూచీలు.. సెన్సెక్స్ 700 పాయింట్లు డౌన్
-
India- China: ఎన్నిసార్లు వాదించినా వాస్తవాలు మారవు.. చైనాకు భారత్ కౌంటర్
-
CAA: సీఏఏపై స్టే కోరుతూ పిటిషన్లు.. కేంద్రానికి మూడు వారాల గడువిచ్చిన సుప్రీం
-
Sita Soren: జేఎంఎంకు షాక్..! భాజపాలోకి శిబూ సోరెన్ పెద్ద కోడలు
-
Mumbai Indians: హార్దిక్.. అంత వీజీ కాదు