CM Jagan: త్వరలో విశాఖే రాజధాని
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన ఏ పారిశ్రామికవేత్తకైనా.. ఎలాంటి అసౌకర్యం కలిగినా పరిష్కరించేందుకు ఒక్క ఫోన్కాల్ దూరంలో అందుబాటులో ఉంటాం.
రాబోయే నెలల్లో నా మకాం అక్కడికే..
దౌత్యవేత్తలు, పారిశ్రామికవేత్తల సదస్సులో సీఎం జగన్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులతో రావాలని పిలుపు
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన ఏ పారిశ్రామికవేత్తకైనా.. ఎలాంటి అసౌకర్యం కలిగినా పరిష్కరించేందుకు ఒక్క ఫోన్కాల్ దూరంలో అందుబాటులో ఉంటాం.
సీఎం
ఈనాడు, అమరావతి: విశాఖపట్నం త్వరలో ఆంధ్రప్రదేశ్ రాజధాని కాబోతోందని, రాబోయే కొన్ని నెలల్లో తన మకాం అక్కడికే మారనుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. విశాఖలో మార్చి 3, 4 తేదీల్లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు సన్నాహకంగా దిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్లో మంగళవారం నిర్వహించిన అంతర్జాతీయ దౌత్యవేత్తలు, పారిశ్రామిక ప్రతినిధుల సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన ఈ విషయం చెప్పారు. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో కాబోయే రాజధాని విశాఖేనని స్పష్టంగా చెప్పగా.. ఆయన కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో మాత్రం దానిని ‘కార్యనిర్వాహక రాజధాని’గా మార్చారు. ‘పెట్టుబడిదారుల సదస్సుకు మీ అందరినీ వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నా. సదస్సుకు హాజరవడంతోపాటు, రాష్ట్రంలో పెట్టుబడులకూ ముందుకు రావాలని కోరుతున్నా. మీతోపాటు విదేశాల్లోని మీ కంపెనీల సహచరులనూ తీసుకురండి. ఏపీలో వ్యాపారం చేయడం ఎంత సులభమో స్వయంగా చూడండి’ అని జగన్ పేర్కొన్నారు.
పెట్టుబడులకు ఏపీ అత్యంత అనుకూలం
దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే ఏపీలో పెట్టుబడులు పెట్టేవారికి భిన్నమైన అనుకూలతలు ఉన్నాయని జగన్ పేర్కొన్నారు. ఏపీకి పెట్టుబడులతో వచ్చేవారికి తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందజేస్తుందని, ప్రపంచంలో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన దేశాల్లో భారత్ ఇప్పటికే ముందంజలో ఉందని, ప్రపంచ వేదికపై దేశాన్ని ఆ స్థాయిలో నిలబెట్టినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీలో 11.43% వృద్ధితో దేశంలోనే వేగంగా పురోగమిస్తున్న రాష్ట్రాల్లో అగ్రగామిగా నిలిచింది. సులభతర వాణిజ్యంలో మూడేళ్లుగా ఏపీ మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రానికి పరిశ్రమలను ఆకర్షించేందుకు మేం చేస్తున్న కృషితోపాటు, రాష్ట్రంలో ఉన్న అనుకూల వాతావరణంపై పారిశ్రామికవేత్తలు బాగా చెప్పడంవల్లే మేం మూడేళ్లుగా మొదటి స్థానంలో స్థిరంగా కొనసాగుతున్నాం. పరిశ్రమల స్థాపనకు ఏపీ ఎంత అనుకూలమో చెప్పేందుకు ఇదే నిదర్శనం’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో సింగిల్ డెస్క్ పోర్టల్ విధానంలో పరిశ్రమలకు 21 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 48 రకాల ఖనిజ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఖనిజాధార పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనుకూలమని తెలిపారు. ‘974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. 4 ప్రాంతాల్లో 6 ఓడరేవులున్నాయి. మరో 4 ఓడరేవులు నిర్మిస్తున్నాం. 6 విమానాశ్రయాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 3 పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తున్నాం. పారిశ్రామికవేత్తలకు ఉన్న అనుకూలతలు, అనుసంధానానికి ఇవి నిదర్శనం’ అని జగన్ పేర్కొన్నారు. సమావేశంలో మంత్రులు రాజేంద్రనాథ్రెడ్డి, గుడివాడ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు వ్యక్తంచేసిన అభిప్రాయాలివీ..
రెండో ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నాం
- సెర్జియో లీ, డైరెక్టర్, అపాచె, హిల్టాప్ గ్రూప్ (తైవాన్)
2006లో ఏపీలో బూట్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేశాం. ప్రస్తుత ముఖ్యమంత్రి తండ్రి సీఎంగా ఉండగా మేం ఎంవోయూ కుదుర్చుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోతే ఈ స్థాయిలో విజయం సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు రెండో ప్రాజెక్టు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్తో ఆధునిక టెక్నాలజీతో ఆ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తాం.
ఏపీలో పరిశ్రమల విస్తరణ
-రోషన్ గుణవర్ధన, డైరెక్టర్, ఎవర్టన్ టీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఇటలీ)
ఏపీలో టీ తోటలు లేకపోయినా... రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకంతో ఇక్కడ మా పరిశ్రమలు ఏర్పాటు చేశాం. మా యూనిట్లలో పని చేసే వారిలో 99% స్థానికులే. ఏపీలో మా పరిశ్రమలను మరింత విస్తరించే యోచనలో ఉన్నాం. ప్రభుత్వం నుంచి మరింత సహకారం ఆశిస్తున్నాం.
ప్రభుత్వ సహకారంతోనే అగ్రశ్రేణి వాహన సంస్థగా నిలిచాం
- తే జిన్ పార్క్, ఎండీ, సీఈఓ, కియా మోటార్స్ (కొరియా)
వాహన పరిశ్రమల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. 2017లో మేం రాష్ట్రానికి వచ్చినప్పటి నుంచి... భూసేకరణ, విద్యుత్, నీటి సదుపాయం కల్పించడం, పోర్టులకు అనుసంధానం వంటి విషయాల్లో ఎనలేని సహకారం అందించింది. దానివల్లే కియా ఇప్పుడు దేశంలో అగ్రశ్రేణి వాహన సంస్థగా నిలిచింది. ఏటా 3 లక్షల కార్లను ఉత్పత్తి చేస్తున్నాం. కృష్ణపట్నం, చెన్నై రేవులకు సమీపంలో మా పరిశ్రమ ఉండటంవల్ల... 95 దేశాలకు కార్లను ఎగుమతి చేస్తున్నాం.
సింగిల్విండో అనుమతులు భేష్
- దీపక్ ధర్మరాజన్ అయ్యర్, ప్రెసిడెంట్, క్యాడ్బరీ ఇండియా (అమెరికా)
శ్రీసిటీలో 2016లో పరిశ్రమ ప్రారంభించాం. రూ.2,500 కోట్ల పెట్టుబడి పెట్టాం. ప్రత్యక్షంగా 6వేల మందికి, పరోక్షంగా కొన్నివేల మందికి ఉపాధి కల్పించాం. మా పరిశ్రమలో 50% మహిళలే పని చేస్తున్నారు. మేం చాక్లెట్ల తయారీతోపాటు... ఏపీలో కోకో తోటలూ పెంచుతున్నాం. 3-4వేల మంది రైతుల్ని కోకో సాగులోకి తెచ్చాం. దేశంలో ఉత్తమమైన సింగిల్విండో క్లియరెన్స్ విధానం ఏపీలో ఉంది.
2030కి పెట్టుబడి రెట్టింపు చేస్తాం
- యమగుచి, ఎండీ, సీఈఓ, తోరే ఇండస్ట్రీస్ (జపాన్)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మాకు పూర్తి సహకారం అందుతోంది. రాష్ట్రంలో రెండు బిజినెస్ యూనిట్లలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టాం. అంతలో కొవిడ్ మహమ్మారి వచ్చింది. ప్రభుత్వ సహకారంతో 2020 జూన్ నుంచి ఉత్పత్తి ప్రారంభించాం. 2030 నాటికి రాష్ట్రంలో మా కంపెనీ పెట్టుబడులు రెట్టింపు చేయాలన్నది లక్ష్యం.
పెట్టుబడులకు అనుకూలం
- ఫణికుమార్, సీఎండీ, సెయింట్ గోబైన్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఫ్రాన్స్)
ఏపీలో కొవిడ్ సమయంలో ఫ్యాక్టరీ ప్రారంభించాం. ప్రభుత్వం, అధికారుల నుంచి మంచి సహకారం లభించింది. ఏపీలో నైపుణ్యం గల మానవ వనరులకు కొరత లేదు. ఏపీ ప్రభుత్వం పరిశ్రమలకు సకాలంలో రాయితీలు అందిస్తోంది. సులభతర వాణిజ్యంతో నిలకడగా మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. భారత్లో పెట్టుబడి పెట్టాలనుకున్న వారు... మొదట ఏపీవైపే చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్