బచ్చుల అర్జునుడికి చంద్రబాబు పరామర్శ

గుండెపోటుకు గురై విజయవాడ రమేష్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మంగళవారం రాత్రి పరామర్శించారు.

Published : 01 Feb 2023 02:34 IST

విజయవాడ (కరెన్సీనగర్‌), న్యూస్‌టుడే: గుండెపోటుకు గురై విజయవాడ రమేష్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మంగళవారం రాత్రి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులద్వారా తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘బచ్చుల అర్జునుడిని ఈ పరిస్థితుల్లో చూస్తానని అనుకోలేదు. చాలా బాధాకరం. ఒకరోజు ముందు నాతో ఫోన్లో మాట్లాడి చాలా విషయాలు చెప్పారు. ఇంతలోనే ఇలా జరిగింది’ అని పేర్కొన్నారు. మరో రెండురోజుల వరకూ ఏమీ చెప్పలేమని వైద్యులు అంటున్నారని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని, పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని చంద్రబాబు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని