పోటెత్తుతున్న ఎర్ర బంగారం

తెలంగాణలోని ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఎండుమిర్చి పోటెత్తుతోంది. విపణిలో ఎటు చూసినా ఎర్రబంగారమే.

Published : 01 Feb 2023 04:54 IST

తెలంగాణలోని ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఎండుమిర్చి పోటెత్తుతోంది. విపణిలో ఎటు చూసినా ఎర్రబంగారమే. మంగళవారం సుమారు 60 వేల బస్తాల సరకు రావడంతో మార్కెట్‌ ఆవరణ పూర్తిగా నిండిపోయింది. ఈ సీజన్‌లో ఇవే అత్యధిక నిల్వలు కావటం విశేషం. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, నల్గొండ, సూర్యాపేట, ఏపీలోని వివిధ జిల్లాల రైతులు ఇక్కడ మిరప పంటను విక్రయిస్తారు. వారం రోజులుగా నిల్వలు పెరుగుతున్నాయి. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు.

 ఈనాడు, ఖమ్మం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని