Polavaram: పోలవరానికి దిగులు..
రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు జగన్ ప్రభుత్వం కేంద్రం నుంచి ఎలాంటి నిధులూ సాధించలేకపోతోంది. జాతీయ హోదా దక్కినా నిధులు చిక్కడం లేదు.
కేంద్ర బడ్జెట్లో రిక్తహస్తం
నిధులు సాధించలేకపోతున్న జగన్ సర్కార్
ఇలాగైతే 50 ఏళ్లకైనా పూర్తయ్యేనా?
కర్ణాటకలోని అప్పర్ భద్రకు రూ. 5,300 కోట్లు
ఈనాడు-అమరావతి: రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు జగన్ ప్రభుత్వం కేంద్రం నుంచి ఎలాంటి నిధులూ సాధించలేకపోతోంది. జాతీయ హోదా దక్కినా నిధులు చిక్కడం లేదు. అదే సమయంలో కర్ణాటకలోని అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇవ్వడంతో పాటు ఈ బడ్జెట్లో ఏకంగా రూ. 5,300 కోట్లు కేటాయించడం గమనార్హం. పైగా ఆ ప్రాజెక్టు నిర్మాణం వల్ల దిగువ రాష్ట్రమైన ఆంధప్రదేశ్ నష్టపోతుంది. ఒకవైపు నష్టం కలిగించే ప్రాజెక్టును నిలువరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోంది. మరోవైపు పోలవరానికీ నిధులూ సాధించలేకపోతోంది. కేంద్ర బడ్జెట్లో పోలవరం ఊసే ఎత్తలేదు. అప్పర్ భద్రకు నిధుల గురించి ఆర్థికమంత్రి ప్రస్తావించారు. యూపీ, ఎంపీల ఉమ్మడి ప్రాజెక్టు కెన్బెత్వాకు రూ. 3,500 కోట్ల కేటాయించారు. ‘రాష్ట్రంలో అన్ని ఎంపీ స్థానాల్లో గెలిపించండి ప్రత్యేక హోదాతో సహా సర్వం సాధిస్తామని’ పదేపదే చెప్పిన జగన్ ఆఖరికి రాష్ట్ర విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా పేర్కొన్న పోలవరానికి కనీస స్థాయిలో కూడా నిధులు తీసుకురాలేకపోతుండడం విశేషం.
కావలసింది రూ.25 వేల కోట్లు.. ఇచ్చింది రూ. 478 కోట్లు
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఇంకా రూ. 25,000 కోట్లకు పైగా అవసరం. అలాంటిది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఇచ్చింది రూ. 478 కోట్లు మాత్రమే. దిల్లీ వెళ్లిన ప్రతిసారీ సీఎం జగన్ పోలవరం నిధులపై మాట్లాడినట్లు ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు. మరోవైపు ఇంతవరకు రాష్ట్రం వెచ్చించిన నిధుల్లో రూ. 2,873 కోట్లు కేంద్రం రీయింబర్స్ చేయాలి. వాటి విషయం పక్కన పెడితే తాత్కాలికంగా రూ. 10,000 కోట్లు కావాలని అడుగుతున్నా అదీ దిక్కులేదు. కేంద్రం నియమించిన కమిటీ రూ. 5,306 కోట్లకే సిఫార్సు చేసినా రీయింబర్స్ నిధులకూ దిక్కులేదు.. తాత్కాలిక నిధులకూ అడ్రస్ లేదు.
* పోలవరం ప్రాజెక్టుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన నిధులు, అవసరమైన నిధులతో పోలిస్తే ఈ ప్రాజెక్టును పూర్తి కావడానికి మరో 50 ఏళ్లు పడుతుంది. ఆలస్యం అయ్యే కొద్దీ పెరిగిపోయే అంచనా వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే ఈ పరిస్థితి. ఇక వాస్తవ దృక్పథంతో ఆలోచిస్తే పోలవరం పూర్తి చేయడం సాధ్యమేనా అనే ప్రశ్న వినిపిస్తోంది.
నీళ్లు లేని ప్రాజెక్టుకు ఇన్ని కోట్లా?
పైగా జాతీయ హోదా కూడానా?
ఎగువ రాష్ట్రం కర్ణాటక తలపెట్టిన అప్పర్భద్ర ప్రాజెక్టుకు స్పష్టమైన నీటి కేటాయింపులు లేకున్నా జలసంఘం అనుమతులూ, కేంద్రం జాతీయ హోదా ఇవ్వడంతో పాటు కేంద్ర బడ్జెట్లో ఏకంగా రూ.5,300 కోట్ల నిధులూ కేటాయించేయడం ఆందోళన కలిగిస్తోంది. దీని వల్ల రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాలు, కరవు ప్రాంతాలకు భవిష్యత్తులో నీరందక కరవు ఏర్పడే ప్రమాదమూ ఉంది. కృష్ణా ట్రైబ్యునల్ కేటాయింపులు లేకున్నా.. కర్ణాటక రకరకాలుగా నీటి లభ్యతను చూపి ప్రాజెక్టుకు అన్నీ సాధించుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ దీనిపై కేంద్ర జలసంఘానికి, కేంద్ర జల్శక్తి శాఖకు అభ్యంతరాలు తెలియజేస్తున్నా రాజకీయంగా గట్టి ప్రతిఘటన ప్రదర్శించడం లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు దీనిపై కనీసం పల్లెత్తు మాట అనడం లేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో తనకు అలౌకిక బంధం ఉందని బహిరంగంగా ప్రకటించారు. అయితే ఆ బంధాలేవీ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడటం లేదనేందుకు రాష్ట్రానికి వాటిల్లుతున్న ఇలాంటి నష్టాలే సాక్ష్యం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్