ఉద్యోగుల జీతభత్యాలకు ప్రత్యేక చట్టం చేయాలి
ఉద్యోగులు, పింఛనుదారుల ఆర్థిక ప్రయోజనాలు, జీతభత్యాల చెల్లింపులకు ప్రత్యేకచట్టం చేయాలని ఉద్యోగసంఘాల నాయకులు డిమాండు చేశారు.
ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తోంది
ఉద్యోగుల సీపీఎస్ వాటాను వాడేసుకుంటోంది
పిల్లల పెళ్లిళ్లు వాయిదాలు వేసుకుంటున్నాం
చర్చావేదికలో ఉద్యోగసంఘాల నాయకుల ఆవేదన
ఈనాడు, అమరావతి: ఉద్యోగులు, పింఛనుదారుల ఆర్థిక ప్రయోజనాలు, జీతభత్యాల చెల్లింపులకు ప్రత్యేకచట్టం చేయాలని ఉద్యోగసంఘాల నాయకులు డిమాండు చేశారు. జీతభత్యాల చెల్లింపులకు ప్రత్యేకచట్టం చేయాలని కోరుతున్నట్లు వెల్లడించారు. విజయవాడలో గురువారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ‘ఉద్యోగుల బకాయిలు-చెల్లింపులు-చట్టబద్ధత’ అనే అంశంపై ఉద్యోగసంఘాల నాయకులతో చర్చావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ‘జీతాలు, పీఎఫ్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ రుణాలు, ఆర్జిత సెలవుల చెల్లింపుల్లో ప్రభుత్వం మార్గదర్శకాలను పాటించనప్పుడు ఏంచేయాలి? రుణాలు, క్లెయిములను ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఉద్యోగులు పిల్లల పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. అధికారులు, మంత్రులకు విన్నవించాకే చట్టం చేయాలని గవర్నరును కలవాల్సి వచ్చింది. నాలుగేళ్లుగా ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించలేదు. చట్టం చేస్తే ఉద్యోగులకు హక్కు వస్తుంది. దీన్ని ఉల్లంఘిస్తే న్యాయస్థానాల నుంచి రక్షణ లభిస్తుంది’ అని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తిమద్దతు ఇస్తామని ప్రకటించారు.
గవర్నరును కలవడం తప్పెలా అవుతుంది
ఆర్థిక ప్రయోజనాలు, జీతభత్యాలపై చట్టం చేయాలని గవర్నరును కలవడం తప్పు ఎలా అవుతుంది? అవసరమైతే మరోసారి కలుస్తాం. సగటు ఉద్యోగి, పింఛనుదారులకు ప్రతినిధిగా మా సంఘం వ్యవహరిస్తోంది. ఒకటో తేదీన జీతాలు ఇవ్వట్లేదు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ప్రస్తుతం రూ.12వేల కోట్లు ఉన్నాయి. నెలవారీ జీతభత్యాలు, పింఛన్లకే రూ.6వేల కోట్ల వరకు అవసరమవుతాయి. 2024 ఫిబ్రవరి నుంచి పదవీవిరమణలు ఉంటాయి. నెలవారీ జీతభత్యాలు, ఆర్థిక ప్రయోజనాలు చెల్లిస్తూ పెండింగ్ బకాయిలను ఎప్పటికి చెల్లిస్తుంది? ప్రతిపక్షాల వద్దకు వెళ్తే రాజకీయముద్ర వేస్తారు. ఇక మిగిలినది గవర్నరే అని భావించి ఆయనకు విన్నవించాం. దీన్ని తప్పనే అధికారం ఎవ్వరికీ లేదు. ఉద్యోగులకు తెలియకుండా జీపీఎఫ్ డబ్బులు రూ.480 కోట్లను ప్రభుత్వం తీసేసుకుంది. ఉద్యోగుల సమస్యలపై ఆందోళనకు సిద్ధమవుతుంటే మరో సంఘం వారు సంక్రాంతికి డీఏ ఇస్తారని, ఏప్రిల్ నుంచి చెల్లిస్తారని చెప్పారు.
సూర్యనారాయణ, అధ్యక్షుడు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం
ప్రభుత్వం రూ.1300కోట్లు వాడేసుకుంది
కాంట్రిబ్యూటరీ పింఛను పథకం(సీపీఎస్) ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన 10%, ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాను గతేడాది మార్చి నుంచి చెల్లించడం లేదు. ఇది రూ.1300 కోట్ల వరకు ఉంటుంది. జమ చేయకపోవడంతో మార్కెట్లో పెట్టుబడి లేక.. ఉద్యోగులు పింఛను నష్టపోతారు. ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్ రద్దుచేస్తామని ప్రతిపక్ష నేతగా జగన్ చెప్పారు. ఇప్పుడు జీపీఎస్ అంటున్నారు.
ఎల్.యుగేందర్, సలహాదారు, ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం
జీతాలు పెంచితే సంక్షేమం జరగదని చెబుతోంది
ఉద్యోగులకు జీతాలు పెంచితే సంక్షేమానికి ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రజలకు, ఉద్యోగులకు మధ్య వైషమ్యాలు సృష్టిస్తోంది. ఉద్యోగ సంఘాలన్నీ ఒకే తాటిపైకి రావాలి.
శ్రీనివాస్ కుమార్, అధ్యక్షుడు, గ్రూపు-1 ఉద్యోగుల సంఘం
ప్రశ్నించడమే తప్పుగా ఉంది
ఈ ప్రభుత్వంలో ప్రశ్నించడం కూడా పాలకులకు తప్పుగా ఉందని ఎన్ఎంఆర్ ఐకాస అధ్యక్షుడు సురేష్ అన్నారు. ధరలు పెరుగుతుంటే డీఏ ఇవ్వాలని అడగడం తప్పా అని డైరెక్టు రిక్రూట్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు నరసింహారావు ప్రశ్నించారు. ప్రభుత్వం ఉద్యోగులను ప్రజలకు దూరం చేయాలని చూస్తోందని నవ్యాంధ్ర టీచర్స్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు పేర్కొన్నారు.
తీర్మానాలు..
* ఉద్యోగుల బకాయిలు, పింఛన్లు, గ్రాట్యుటీ, ఇతర ఆర్థిక ప్రయోజనాలను చెల్లించాలి. జీపీఎఫ్ ఖాతాల నుంచి తీసేసుకున్న మొత్తాలను ఎప్పుడు జమచేస్తారో కాలవ్యవధిని ప్రభుత్వం నిర్ణయించాలి.
* వేతనాలు, పింఛన్లు, ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులకు వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే చట్టం చేయాలి.
* సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వ వాటా 10% నుంచి 14%కు పెంచి, 2019 ఏప్రిల్ నుంచి వడ్డీ సహా జమచేయాలి. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్ ఆలస్యంగా ఖరారు చేసినందున 9 నెలలకు పూర్తివేతనం చెల్లించాలి.
* 11వ పీఆర్సీలో రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ఎప్పటిలోగా చెల్లిస్తారో ప్రభుత్వం తెలియజేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)