గృహ సారథుల నియామకాలు త్వరగా పూర్తవ్వాలి
‘ప్రతీ వాలంటీరు క్లస్టర్ పరిధిలో ఇద్దరు చొప్పున జగనన్న గృహసారథుల నియామకాలు అతి త్వరలో పూర్తవ్వాలి. వారంతా క్షేత్రస్థాయిలోకి వెళ్లాలి’ అని వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలకు సీఎం జగన్ స్పష్టంచేశారు.
‘గడప గడపకు’ కార్యక్రమంలో ఎమ్మెల్యేలపై పర్యవేక్షణ పెరగాలి
వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలతో భేటీలో సీఎం జగన్
ఈనాడు, అమరావతి: ‘ప్రతీ వాలంటీరు క్లస్టర్ పరిధిలో ఇద్దరు చొప్పున జగనన్న గృహసారథుల నియామకాలు అతి త్వరలో పూర్తవ్వాలి. వారంతా క్షేత్రస్థాయిలోకి వెళ్లాలి’ అని వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలకు సీఎం జగన్ స్పష్టంచేశారు. ఈమేరకు ఆయన గురువారం క్యాంపు కార్యాలయంలో వారితో సమావేశమయ్యారు. అప్పగించిన పనులను సకాలంలో, సరైన పద్ధతిలో చేయలేదని, సచివాలయ పార్టీ సమన్వయకర్తలను ఇంకా పూర్తిస్థాయిలో నియమించలేదని సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇప్పటివరకు చేసిన నియామకాలకు సంబంధించిన వివరాలను వైకాపా రాజకీయ వ్యూహ సంస్థ ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు రిషిరాజ్ ఒక ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నియోజకవర్గాల వారీగా నివేదికలను ఆయా ప్రాంతీయ సమన్వయకర్తలకు అందజేశారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఇంటింటికీ ఎలా తిరుగుతున్నారు... అసలు తిరుగుతున్నారా లేదా అనే విషయాన్ని ప్రాంతీయ సమన్వయకర్తలు కచ్చితంగా పర్యవేక్షించాలని సూచించినట్లు సమాచారం. పార్టీ నేతల మధ్య విభేదాల పరిష్కారంలో చొరవ చూపాలని, తద్వారా పార్టీ కార్యక్రమాలు చెప్పినట్లుగా నిర్వహించేలా చూడాలని సీఎం చెప్పారంటున్నారు. ప్రాంతీయ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్న వారిలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, తితిదే ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఎంపీలు పీవీ మిథున్రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, బీద మస్తాన్రావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల సమన్వయకర్త మర్రి రాజశేఖర్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?