సీట్లు వదలరు.. ఆసుపత్రులను సందర్శించరు!
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో పర్యవేక్షణ గాడి తప్పుతోంది. వివిధ పథకాల అమలును పర్యవేక్షించాల్సిన అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లట్లేదు.
పర్యవేక్షణ అధికారుల తీరిదీ
ఈనాడు, అమరావతి: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో పర్యవేక్షణ గాడి తప్పుతోంది. వివిధ పథకాల అమలును పర్యవేక్షించాల్సిన అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లట్లేదు. జిల్లాల్లో ఉండే అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులూ ఇలాగే వ్యవహరిస్తున్నారు. పర్యవేక్షణ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లి, ఆసుపత్రులను సందర్శించి, అక్కడున్న పరిస్థితులపై నివేదికలు తయారుచేసి, అవసరమైన చర్యలు తీసుకోవాలి. కానీ వారు పట్టించుకోవట్లేదు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఏటా సుమారు రూ.2వేల కోట్లు వరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్నాయి. వీటితో 25 పథకాలు రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్నాయి. అమరావతిలో ఉండే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలోని సీనియర్ అధికారులకు కొన్ని పథకాల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. డయాలసిస్, బాలల ఆరోగ్యం, టీబీ, క్షయ, దీర్ఘకాలిక వ్యాధుల నివారణ చర్యలు, ఉప ఆరోగ్యకేంద్రాలు, ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్యకేంద్రాలు, మాతా శిశు ఆరోగ్యం, రక్తహీనత, శిశు సంరక్షణ కేంద్రాలు, పోషకాహార కేంద్రాలు, మానసిక సమస్యల పరిష్కారం వాటి చర్యలు సీనియర్ అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. ఇటీవల జరుగుతున్న సమీక్ష సమావేశాల్లో కొందరు అధికారులను పథకం అమలు గురించి ఉన్నతాధికారులు ప్రశ్నిస్తుంటే, అసలు క్షేత్రస్థాయికి వెళ్లట్లేదని తెలిసింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల్లో చాలామంది పీహెచ్సీలను పరిశీలించట్లేదన్న విషయం రాష్ట్ర ప్రధాన కార్యాలయం దృష్టికొచ్చింది. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు నిర్వహించే సమీక్షా సమావేశాలకే వీరు పరిమితమవుతున్నారు. జిల్లా, సామాజిక, ప్రాంతీయ ఆసుపత్రుల్లో రక్త పరీక్షలు, ఇతర రోగ నిర్ధారణ పరీక్షలు ఎలా జరుగుతున్నాయి? ఫలితాల్లో నాణ్యత ఉందా.. లేదా అన్న దానిపైనా నిశిత పరిశీలన లేదు. కిందిస్థాయి సిబ్బందికి సకాలంలో శిక్షణ ఇవ్వడం, వారి పనితీరు మదింపులోనూ కొందరు అధికారులు వెనుకబడుతున్నారు. బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లలో కొందరికి పెద్ద వయసు కావడం, వ్యక్తిగత సమస్యలు, పరిపాలనాపరమైన అంశాలపై విషయ పరిజ్ఞానం లేకపోవడంతో సమస్యలు ఇబ్బడిముబ్బడిగా ఉంటున్నాయి. బోధ]నాసుపత్రులకు ఏయే కేసులు ఎక్కువగా ఏయే ప్రాంతాల నుంచి.. ఎందుకు వస్తున్నాయన్న కారణాలపై విశ్లేషించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్య విద్యార్థులు అందుబాటులో ఉంటున్నా... ఈ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేవుడా.. నువ్వే దిక్కు!
వైకాపా నేతలు అధికారగర్వంతో రెచ్చిపోతున్నారు. అర్చకులు, పురోహితులపై రౌడీల్లా దాడులకు తెగబడుతూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. -
శివయ్య సాక్షిగా.. రాజీ నాటకం
‘నా భర్తను అంతు చూస్తానని హెచ్చరించారట.. ఈ వయసులో ఆయన్ను కొట్టారు. ఏమైనా అయితే ఎవరు సమాధానం చెబుతారు’.. కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులపై మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావు దాడి చేయడంపై దేవాదాయశాఖ అధికారులు మంగళవారం విచారణ చేపట్టినప్పుడు బాధిత అర్చకుడి భార్య చేసిన వ్యాఖ్యలివి. -
ఇద్దరు ఎస్పీలపై వేటు ఖాయం!
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే రాష్ట్రంలో రాజకీయ హత్యలు, హింస చెలరేగడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. -
న్యాయవాదులు సామాజిక ఇంజినీర్లు
‘నేను చదువుకునే రోజుల్లో మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లల కోసం వైద్య విద్య, ఇంజినీరింగ్ కోర్సులను తొలి ప్రాధాన్యంగా ఎంపికచేసేవారు. -
అనుమానాస్పదంగా ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలోకి కంటెయినర్
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి మంగళవారం మధ్యాహ్నం ఒక కంటెయినర్ వాహనం వచ్చి వెళ్లిన తీరు చర్చనీయాంశంగా మారింది. -
కలెక్టర్ అభ్యంతరం తెలిపినా బేఖాతర్.. లోకేశ్ నియోజకవర్గంలో ఈ మర్మమేమిటో?
రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం గల నియోజకవర్గాల్లో ప్రస్తుతం మంగళగిరి ఒకటి. ఇక్కడి నుంచి తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. -
పాడా ఓఎస్డీపై విచారణకు ఈసీ ఆదేశం
సీఎం జగన్ ఇలాకాలోని పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ (పాడా) ఓఎస్డీగా అయిదేళ్ల నుంచి పనిచేస్తున్న అనిల్కుమార్రెడ్డిపై ఎన్నికల సంఘం(ఈసీ) విచారణకు ఆదేశించింది. -
హార్సిలీహిల్స్ క్రీడాశిక్షణ కేంద్రం పనులు పునఃప్రారంభం
ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్లో క్రీడాశిక్షణ కేంద్రం పనులు పునఃప్రారంభమయ్యాయి. కొండపై ముళ్లకంపలు, పిచ్చిమొక్కలను మంగళవారం తొలగించి భూమి చదును పనులకు శ్రీకారం చుట్టారు. -
పదోన్నతుల ఎర.. టీచర్లకు వల!
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా పాఠశాల విద్యాశాఖ అధికారులు బరితెగించి ఉపాధ్యాయుల పదోన్నతులు, పోస్టుల హేతుబద్ధీకరణకు చర్యలు చేపట్టారు. -
బాపట్ల జిల్లాలో ప్రబలిన అతిసారం
బాపట్ల జిల్లాలోని తూర్పు పిన్నిబోయినవారిపాలెంలో అతిసారం ప్రబలింది. గడిచిన అయిదు రోజుల్లో సుమారు 40 మంది వాంతులు, విరేచనాలతో మంచాన పడ్డారు. -
అరాచక వైకాపాను ఓడిద్దాం
‘చంద్రబాబును అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేశారు. ఆయన్ని జైల్లో కలిసినప్పుడు తన కోసం ప్రాణాలు విడిచిన ప్రతి కుటుంబాన్నీ పరామర్శించి ధైర్యం చెప్పమన్నారు. -
అది ‘వినయ’ విధేయ రౌడీరాజ్యం!
దోచుకోవడం.. దాచుకోవడంలో వైకాపా నేతలది ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్!కొంతమంది స్వయంగా రంగంలోకి దిగితే.. మరికొందరు కుటుంబ సభ్యులను దించుతారు. -
ఇక్కడే ఎందుకో ఈ ని‘బంధనాలు’!
‘‘ఇంటింటి ఎన్నికల ప్రచారానికి కూడా అనుమతి తీసుకోవాలా? కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇచ్చిన మార్గదర్శకాల్లోనూ ఈ నిబంధన లేదు. -
ఏ కోడూ నాకు వర్తించదు.. నాపై ఎవరూ చర్యలు తీసుకోలేరు!
రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)లో అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్లో నాలుగేళ్లుగా ఉన్న పి.హేమంత్కుమార్రెడ్డి చాలాకాలంగా చిత్తూరు జిల్లా వైకాపా యువజన విభాగం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. -
సలహాదారు చంద్రశేఖర్రెడ్డి బరితెగింపు
సాక్షాత్తూ ఎన్నికల సంఘం కార్యాలయానికి కొన్ని అడుగుల దూరంలో.. ప్రభుత్వ సలహాదారు ఒకరు బరితెగించారు. ప్రతిపక్ష నేతలపై రాజకీయ విమర్శలకు సచివాలయాన్నే వేదికగా చేసుకున్నారు. -
తెలంగాణలో భేష్.. ఏపీలో తుస్!
ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య, వైద్యం అందించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం మెరుగైన వైద్యం అందని ద్రాక్షలా మారింది. -
వైకాపా సమావేశంలో గ్రామ వాలంటీరు
విశాఖపట్నం జిల్లా తగరపువలసలోని ఓ ఫంక్షన్ హాల్లో భీమిలి మండల వైకాపా శ్రేణులతో మంత్రి బొత్స సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మంగళవారం రాజకీయ సమావేశం నిర్వహించారు. -
ఆ రెండు గ్రామాలకు తాగునీటి సౌకర్యం
విద్యుత్తు కోసం లాంతర్లపై, తాగునీటి కోసం వాగుల్లోని చెలమలపై ఆధారపడి కాలం వెళ్లదీస్తున్న ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని బండారుగుంపు, రేగులగూడెం గ్రామాలకు అధికారులు మంగళవారం నీటి సౌకర్యం కల్పించారు. -
విశాఖ విమానాశ్రయంలో ఏప్రిల్ ఒకటి నుంచి నిరంతర సేవలు
ఏప్రిల్ ఒకటి నుంచి విశాఖపట్నం విమానాశ్రయంలో 24×7 ప్రాతిపదికన ‘రన్ వే’ అందుబాటులోకి వస్తుందని నేవీ వర్గాలు పేర్కొన్నాయి. -
శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ ఎన్.వి.రమణ
తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, శివమాల దంపతులు, ఇతర కుటుంబసభ్యులు మంగళవారం దర్శించుకున్నారు. -
సౌర విద్యుత్ సంస్థలకు భూములు
రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలకు గతంలో మంజూరు చేసిన సౌర విద్యుత్ ప్రాజెక్టులకు భూములు కేటాయిస్తూ ఈ నెల 15న ఉత్తర్వులివ్వగా వాటికి సంబంధించిన గెజిట్ను మంగళవారం ప్రచురించారు.
తాజా వార్తలు (Latest News)
-
2030 నాటికి విమాన సర్వీసులు డబుల్..
-
ఉప్పల్లో సిక్సర్ల మోత.. ముంబయిని ఓడించి బోణీ కొట్టిన హైదరాబాద్
-
ఆరోగ్యకరమైన జీవితానికి మూడు సూత్రాలు.. డాక్టర్ ఫార్ములా షేర్ చేసిన హర్ష గోయెంకా
-
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
-
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
-
కాంగ్రెస్ ఎనిమిదో జాబితా.. తెలంగాణలో మరో నాలుగు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన