తీసుకునే విద్యుత్ తక్కువ.. చెల్లించే స్థిర ఛార్జీలు ఎక్కువ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో (2022-23) పోలిస్తే.. వచ్చే ఏడాది (2023-24)లో డిస్కంలు విద్యుదుత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన స్థిర ఛార్జీలు 41.32 శాతం పెరగనున్నాయి.
ఇదీ డిస్కంల తీరు
వచ్చే ఏడాది 41.32 శాతం పెరగనున్న భారం
ఈనాడు, అమరావతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో (2022-23) పోలిస్తే.. వచ్చే ఏడాది (2023-24)లో డిస్కంలు విద్యుదుత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన స్థిర ఛార్జీలు 41.32 శాతం పెరగనున్నాయి. ఈ భారం రూ.3,280 కోట్లుగా డిస్కంలు తేల్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.7,938.37 కోట్లు స్థిర ఛార్జీలుగా చెల్లించాలని లెక్కిస్తే.. ఆ మొత్తం వచ్చే ఏడాది రూ.11,218.48 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నాయి. కొత్తగా రెండు జెన్కో థర్మల్ ప్లాంట్లు అందుబాటులోకి రావడమే స్థిర ఛార్జీలు భారీగా పెరగడానికి కారణమని డిస్కంలు చెబుతున్నాయి. కానీ ఆ మేరకు జెన్కో నుంచి తీసుకునే విద్యుత్లో పెరుగుదల లేదు. జెన్కో నుంచి 2022-23లో 18,462.19 ఎంయూల విద్యుత్ వస్తుందని లెక్కిస్తే.. వచ్చే ఏడాది 18,880.60 ఎంయూలుగా డిస్కంలు అంచనా వేస్తున్నాయి. అంటే జెన్కో నుంచి అదనంగా వచ్చే 418.41 ఎంయూల విద్యుత్కు.. స్థిర ఛార్జీలుగా రూ.1,691.87 కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. 2022-23లో రూ.2,347.87 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని డిస్కంలు పేర్కొన్నాయి. రాష్ట్ర డిమాండ్కు మించి ఉన్న మిగులు విద్యుత్ కారణంగా థర్మల్ యూనిట్లను డిస్కంలు బ్యాక్డౌన్ (పూర్తి సామర్థ్యంలో ఉత్పత్తి చేయకుండా తగ్గించడం) చేయాల్సి వస్తోంది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదం కోసం డిస్కంలు ప్రతిపాదన దాఖలు చేశాయి.
సీజీఎస్ల విద్యుత్ తగ్గినా.. స్థిర ఛార్జీలు పెరగడమేంటి?
కేంద్ర విద్యుదుత్పత్తి సంస్థల (సీజీఎస్) నుంచి ప్రస్తుత సంవత్సరంలో 13,797.62 ఎంయూల విద్యుత్ను డిస్కంలు తీసుకుంటే.. వచ్చే ఏడాది వాటి నుంచి 12,843.06 ఎంయూలు తీసుకునేలా ప్రతిపాదించాయి. వాటి నుంచి తీసుకునే దానిలో 954 ఎంయూలు తగ్గించినా.. చెల్లించాల్సిన స్థిర ఛార్జీలు మాత్రం రూ.4.87 కోట్లు పెరిగాయి.
డిస్కంలు ప్రస్తావించని ‘సెకి’ విద్యుత్ లెక్కలు
కృష్ణపట్నం, వీటీపీఎస్లో (ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యం) రెండు యూనిట్లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తిలోకి వస్తాయని.. వాటితో పాటు సెంబ్కార్ప్ నుంచి వచ్చే 625 మెగావాట్లతో కలిపి 12,496 ఎంయూల మిగులు ఉందని డిస్కంలు పేర్కొంటున్నాయి. ఇంత మిగులు ఉన్నా.. సెకి నుంచి ఏటా 17 వేల ఎంయూల సౌర విద్యుత్ 2024 సెప్టెంబరు నుంచి దశల వారీగా మూడేళ్లలో వస్తుంది. వచ్చే ఏడాది సెకి నుంచి 4,500 ఎంయూల (7 నెలలకు) విద్యుత్ వస్తుందని అంచనా. దీంతో కలిపి రాష్ట్రంలో మిగులు విద్యుత్ సుమారు 17 వేల ఎంయూలకు చేరుతుంది. వాటి నుంచి వచ్చే విద్యుత్ గ్రిడ్కు తీసుకున్నా.. లేకున్నా పీపీఏ ఒప్పందం ప్రకారం డిస్కంలు చెల్లించాలి. ఈ భారం కూడా విద్యుత్ వినియోగదారులపైనే పడనుంది.
కేంద్రం నిర్దేశించిన ఆర్పీపీవో కంటే ఎక్కువే
రాష్ట్రంలో వినియోగించే దానిలో 21.5 శాతం పునరుత్పాదక విద్యుత్ ఉండాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించింది. రాష్ట్ర విద్యుత్ డిమాండ్లో పునరుత్పాదక విద్యుత్ వాటా 25 శాతంగా ఉంది. ఇప్పటికే కేంద్రం నిర్దేశించిన పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు బాధ్యత (రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్-ఆర్పీపీవో) మొత్తానికి మించి వినియోగిస్తున్నా.. మళ్లీ సెకి నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను డిస్కంలు తీసుకోనున్నాయి. ఇది కూడా కలిపితే పునరుత్పాదక విద్యుత్ వాటా 30 శాతానికి చేరుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వనరుల నుంచి వచ్చే విద్యుత్ను సర్దుబాటు చేయడానికి సుమారు 2,500 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని బ్యాక్డౌన్ చేయాల్సి వస్తోందని అధికారులు పేర్కొన్నారు. దీనివల్ల సెకి నుంచి తీసుకునే విద్యుత్కు చెల్లించే మొత్తంతో పాటు.. స్థిర ఛార్జీల భారం కూడా వినియోగదారులపై పడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు. -
సునీత, బీటెక్ రవిల వ్యాజ్యాల విచారణ నుంచి...
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
929 మంది వాలంటీర్లను తొలగించాం
ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్)ని ఉల్లంఘించినందున 929 మంది వాలంటీర్లను తొలగించామని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ హైకోర్టుకు నివేదించారు. -
సంక్షిప్త వార్తలు
సీఎం జగన్పై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ను పోలీసు కస్టడీకి ఇస్తూ విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులిచ్చింది. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే!
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’