కాజీపేటలో వ్యాగన్ల తయారీ కర్మాగారం
తెలుగు రాష్ట్రాలకు 2023-24 రైల్వే బడ్జెట్లో రూ.12,824 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఇందులో తెలంగాణకు రూ.4,418 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు రూ.8,406 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు.
తెలుగురాష్ట్రాలకు రూ.12,824 కోట్లు కేటాయించాం
రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్
ఈనాడు, దిల్లీ: తెలుగు రాష్ట్రాలకు 2023-24 రైల్వే బడ్జెట్లో రూ.12,824 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఇందులో తెలంగాణకు రూ.4,418 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు రూ.8,406 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. ఆయన శుక్రవారం దిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ‘‘2009-14 మధ్య ఉమ్మడి రాష్ట్రానికి కేవలం రూ.886 కోట్లు మాత్రమే కేటాయించారు. భూసేకరణ, ఇతర అంశాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా సహకారం లభిస్తోంది కాబట్టి అక్కడ ఎక్కువ కేటాయింపులు జరిపాం. ఏపీలో 72, తెలంగాణలో 39 రైల్వే స్టేషన్లను ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా సహకరించాలి. విశాఖపట్నం జోనల్ కార్యాలయ భవనం డిజైన్ను త్వరలో ఖరారుచేసి నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. కాజీపేటకు వ్యాగన్ ఓవర్హాలింగ్, రిపేర్ ఫ్యాక్టరీ ఇచ్చాం. తర్వాత అక్కడ వ్యాగన్ తయారీని జతచేస్తాం. విభజన చట్టంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై అధ్యయనం చేస్తామని చెప్పారు. అయితే దేశంలో ఇప్పటికే చాలా కోచ్ఫ్యాక్టరీలు ఉన్నాయి. ప్రస్తుతం వ్యాగన్లకున్న అత్యధిక డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలని ఆ అధ్యయనంలో తేలినందున దానిపై నిర్ణయం తీసుకున్నాం.
* హైదరాబాద్లో ఎంఎంటీఎస్ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించడంలేదు. సబ్కా సాత్ సబ్కా వికాస్ ప్రధానమంత్రి నినాదం కాబట్టి ఆయన రాజకీయాలను పక్కనపెట్టి దేశాభివృద్ధికోసం ఆలోచిస్తుంటారు. ఎంఎంటీఎస్కు రెండోదశకు ఈ ఏడాది రూ.600 కోట్లు కేటాయించాం. వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్లో భాగంగా స్థానిక ఉత్పత్తులను రైల్వేస్టేషన్లలో ప్రదర్శించి విక్రయించే కార్యక్రమం విజయవంతమైంది. ప్రస్తుతం 750 స్టాళ్లు ఉన్నాయి. వీటిని వెయ్యికిపైగా పెంచుతాం.
* వందే భారత్ రైలు విజయవంతమైన నేపథ్యంలో ఈ ఏడాది వందే మెట్రో రైళ్లను తీసుకొస్తాం. వైజాగ్-సికింద్రాబాద్ వందేభారత్ రైల్లో ఆక్యుపెన్సీ రేటు 120% దాకా ఉంది. ఇటీవల నేను దావోస్ పర్యటనకు వెళ్లినప్పుడు జ్యురిక్ నుంచి దావోస్కు రైల్లో వెళ్లాను. యూరప్లోని రైళ్లతో పోలిస్తే వందేభారత్ రైలు అన్ని కొలమానాల్లోనూ మెరుగ్గా ఉంది. ఈఏడాది వందే మెట్రో కాన్సెప్ట్ ఖరారుచేసి ఒక నమూనా రైలును రూపొందించి పరీక్షిస్తాం. తర్వాతి ఏడాది దాన్ని తదుపరి దశకు తీసుకొస్తాం. ప్రధానమంత్రి 2017లో వందేభారత్ రైలు ఉద్దేశాన్ని చెబితే 2019లో తొలి రైలు రూపొందించి లక్షల కిలోమీటర్ల పాటు పరీక్షించాం. 2021 నుంచి ప్రధాన ఉత్పత్తి ప్రారంభమైంది. అదే తరహాలో వందే మెట్రో రైలును అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు హైడ్రోజన్ రైలు రూపొందించే కసరత్తు జరుగుతోంది.’’ అని అశ్వినీవైష్ణవ్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు -
అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలొద్దు
స్కిల్ కేసులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
ఉక్కపోత, వడగాలులు తీవ్రతరం
రాష్ట్రంలో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. -
దస్తగిరి వినతిపై వివరాల సమర్పణకు సమయం ఇవ్వండి
ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను పలువురు హంతకుడిగా చిత్రీకరిస్తున్నారని, వాటిని ప్రసారం చేస్తున్న టీవీ ఛానళ్లను నియంత్రించాలని కోరుతూ అప్రూవర్ దస్తగిరి దాఖలుచేసిన వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఆర్థికసంఘం నిధులపై దిగొచ్చిన ప్రభుత్వం
కేంద్రం నెల రోజుల క్రితం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను తన దగ్గరే పెట్టుకున్న జగన్ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. -
పోస్టల్ బ్యాలెట్ సమర్పణలో గందరగోళం
ప్రభుత్వ ఉద్యోగులు జగన్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నందున వారు పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకోకుండా దూరం చేసేందుకు వైకాపాకు కొమ్ముకాసే కొందరు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
సీపీఎస్ రద్దుపై మాట దాటేసిన బొత్స
భోగాపురం ఎయిర్ పోర్టును మరో ఏడాదిలో ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. -
సుజనాచౌదరి రుణ పరిష్కార ప్రక్రియకు అనుమతి
భాజపా నేత సుజనాచౌదరిపై రుణ పరిష్కార ప్రక్రియకు అనుమతిస్తూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ-హైదరాబాద్) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
సీఎస్, డీజీపీలపై.. ఈసీ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
సీఎం తెచ్చిన నరకయాతన
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు