K Viswanath: తరలిపోయిన తపస్వి
ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ (92) అంత్యక్రియలు శుక్రవారం ముగిశాయి. సినీ, రాజకీయ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు, అభిమానుల అశ్రునయనాల నడుమ పంజగుట్ట హిందూ శ్మశానవాటికలో ఆయన కుమారులు నాగేంద్రనాథ్, రవీంద్రనాథ్ చేతుల మీదుగా ఆరాధ్య సంప్రదాయ ప్రకారం విశ్వనాథ్ భౌతిక కాయాన్ని ఖననం చేశారు.
విశ్వనాథ్కు కన్నీటి వీడ్కోలు
సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి
బహుముఖ ప్రజ్ఞాశాలి: ప్రధాని సంతాపం
ఈనాడు, హైదరాబాద్-న్యూస్టుడే, ఫిలింనగర్, బంజారాహిల్స్: ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ (92) అంత్యక్రియలు శుక్రవారం ముగిశాయి. సినీ, రాజకీయ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు, అభిమానుల అశ్రునయనాల నడుమ పంజగుట్ట హిందూ శ్మశానవాటికలో ఆయన కుమారులు నాగేంద్రనాథ్, రవీంద్రనాథ్ చేతుల మీదుగా ఆరాధ్య సంప్రదాయ ప్రకారం విశ్వనాథ్ భౌతిక కాయాన్ని ఖననం చేశారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆయన అంత్యక్రియలు పూర్తిచేశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వనాథ్ చికిత్స పొందుతూ గురువారం రాత్రి అపోలో ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. మరణవార్తను తెలుసుకొని శుక్రవారం తెల్లవారుజాము నుంచే అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఫిలింనగర్లోని ఆయన స్వగృహానికి చేరుకొని నివాళులు అర్పించారు. చిత్ర రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. తెలుగు సినిమాను ఖండాంతరాలకు తీసుకెళ్లిన ఖ్యాతి విశ్వనాథ్కే దక్కుతుందని, దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా వెండితెరపై తనదైన ముద్ర వేశారని గుర్తుచేసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఫిలింనగర్లోని ఆయన నివాసం నుంచి పంజగుట్ట శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగింది. ఆయన్ని చివరిసారిగా చూసేందుకు అభిమానులు, ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వం తరఫున విశ్వనాథ్ అంత్యక్రియలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. అంతిమయాత్రలో ఎంపీ సంతోష్కుమార్, తెలంగాణ రాష్ట్ర అధికార భాషాసంఘం అధ్యక్షురాలు శ్రీదేవి, సినీనటులు తులసి, ఏడిద శ్రీరాం, ఏడిద రాజా, అనంత్ తదితరులు విచ్చేశారు. ఏపీ సీఎం జగన్ తరఫున విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు అంతిమయాత్రకు హాజరైన ఆ రాష్ట్ర మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు.
ప్రముఖుల నివాళి
ఫిలింనగర్లోని విశ్వనాథ్ నివాస ప్రాంగణంలో ఆయన భౌతికకాయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీ ప్రముఖులు చిరంజీవి, పవన్కల్యాణ్, నాగబాబు, వెంకటేశ్, కె.రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, గుణశేఖర్, అల్లు అరవింద్, డి.సురేశ్బాబు, ఆదిశేషగిరిరావు, బ్రహ్మానందం, అలీ, వందేమాతరం శ్రీనివాస్, కోట శ్రీనివాసరావు, అశోక్కుమార్, రాజమౌళి, కీరవాణి, ఎల్బీ శ్రీరామ్, బ్రహ్మాజీ, మణిశర్మ, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి, ఆర్.నారాయణమూర్తి, జీవిత రాజశేఖర్, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఫిలింనగర్ సొసైటీ కార్యదర్శి కాజ సూర్యనారాయణ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
పలువురి సంతాపం
శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, నిరంజన్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, ఎంపీ కె.లక్ష్మణ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు తదితరులు సంతాపం తెలిపారు.
ఆయన కీర్తి అజరామరం
తెలంగాణ సీఎం
దర్శకుడు విశ్వనాథ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు తీవ్ర సంతాపం తెలిపారు. అతి సామాన్యమైన కథలను కూడా తన అద్భుత ప్రతిభతో వెండితెర దృశ్య కావ్యాలుగా మలిచిన అరుదైన దర్శకుడు విశ్వనాథ్ అని, ఆయన కీర్తి అజరామరమని కొనియాడారు. గతంలో విశ్వనాథ్ ఆరోగ్యం బాగోలేనప్పుడు వారి ఇంటికి వెళ్లి పరామర్శించిన సమయంలో సినిమాలు, సంగీతం, సాహిత్యంపై తమ మధ్య జరిగిన చర్చను సీఎం గుర్తు చేసుకున్నారు. భారతీయ సామాజిక, సంస్కృతీ సంప్రదాయ విలువలకు తన సినిమాలో పెద్దపీట వేశారని ప్రస్తుతించారు. వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి
ప్రధాని మోదీ
ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్ ద్వారా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సినీ రంగంలో విశ్వనాథ్ దిగ్గజం వంటివారని, తనను తాను సృజనాత్మక, బహుముఖీన దర్శకుడిగా ఆవిష్కరించుకున్నారని ప్రస్తుతించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రధాని సానుభూతి తెలిపారు.
తెలుగు సినిమాకు తీరనిలోటు
తెలంగాణ గవర్నర్
విశ్వనాథ్ మరణం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సంతాపం వ్యక్తం చేశారు. అద్భుత ప్రతిభతో దిగ్గజ దర్శకుడిగా, స్క్రీన్ప్లే రచయితగా, నటుడిగా సినీ పరిశ్రమకు విశేష సేవలు అందించారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు.
అవార్డులు ఆయన ప్రతిభకు దర్పణాలు
రాహుల్
దర్శక దిగ్గజం విశ్వనాథ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ విచారం వ్యక్తం చేశారు. అయిదు జాతీయ అవార్డులు, దాదాసాహెబ్ ఫాల్కే, పద్మశ్రీ పురస్కారాలు ఆయన ప్రతిభావ్యుత్పత్తులకు దర్పణాలని కొనియాడారు. విశ్వనాథ్ కుటుంబసభ్యులకు, అభిమానులకు తన సంతాపం తెలిపారు.
తీవ్రంగా కలచివేసింది
తెదేపా అధినేత చంద్రబాబు
‘కె.విశ్వనాథ్ మరణ వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎన్నో అపురూపు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’
తెలుగు సినిమాకు తీరని లోటు
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
ఈనాడు, అమరావతి: కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతి తెలుగుచలనచిత్ర రంగానికి తీరని లోటు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
కళలకు నిలువుటద్దం
ఏపీ సీఎం జగన్
తెలుగువారి గుండెల్లో కళాతపస్వి కె.విశ్వనాథ్ చిరస్థాయిగా నిలిచిపోతారు. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు ఆయన నిలువుటద్దం. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీ రంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చిపెట్టాయి.
ఆయన జ్ఞాని
పవన్ కల్యాణ్
సినిమా స్థాయిని, తెలుగు దర్శకుల సృజనను ఉన్నత శిఖరాన ఉంచిన దర్శక స్రష్ట కె.విశ్వనాథ్ శివైక్యం చెందారని తెలిసి తీవ్ర ఆవేదన చెందా. ఆయన్ను ఎప్పుడు కలిసినా జ్ఞాని కళ్లముందున్నట్టే అనిపించేది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు. -
సునీత, బీటెక్ రవిల వ్యాజ్యాల విచారణ నుంచి...
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
929 మంది వాలంటీర్లను తొలగించాం
ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్)ని ఉల్లంఘించినందున 929 మంది వాలంటీర్లను తొలగించామని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ హైకోర్టుకు నివేదించారు. -
సంక్షిప్త వార్తలు
సీఎం జగన్పై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ను పోలీసు కస్టడీకి ఇస్తూ విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులిచ్చింది. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే!
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’