Pawan Kalyan: అసలు పెళ్లే చేసుకోవాలనుకోలేదు
‘అసలు నేను పెళ్లే చేసుకోవాలనుకోలేదు. బ్రహ్మచారిగా ఉంటూ.. యోగమార్గాన్ని అనుసరించాలనుకున్నా. కానీ ఇన్నిసార్లు పెళ్లి జరిగింది నాకేనా అనిపిస్తుంది. నేనేదీ ప్లాన్ చేయలేదు. నేను ముగ్గుర్ని ఒకేసారి పెళ్లి చేసుకోలేదు.
యోగమార్గం అనుసరించాలని అనుకున్నా
అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణతో జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్
ఈనాడు, అమరావతి: ‘అసలు నేను పెళ్లే చేసుకోవాలనుకోలేదు. బ్రహ్మచారిగా ఉంటూ.. యోగమార్గాన్ని అనుసరించాలనుకున్నా. కానీ ఇన్నిసార్లు పెళ్లి జరిగింది నాకేనా అనిపిస్తుంది. నేనేదీ ప్లాన్ చేయలేదు. నేను ముగ్గుర్ని ఒకేసారి పెళ్లి చేసుకోలేదు. ముగ్గురితో ఒకేసారి ఉండట్లేదు. నాకు ఒకరితో కుదరలేదు. ఇంకొకరిని చేసుకోవాల్సి వచ్చింది. వారితోనూ కుదరలేదు. మరొకరిని పెళ్లి చేసుకున్నా. విడాకులిచ్చే ఈ పెళ్లిళ్లు చేసుకున్నా. అదీ ఏదో వ్యామోహంతో చేసుకోలేదు.. జరిగాయంతే. నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నన్ను విమర్శించటానికి అదో ఆయుధమైపోయింది’ అని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ అన్నారు. ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న అన్స్టాపబుల్ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న పవన్కల్యాణ్ వివిధ అంశాలపై మాట్లాడారు. ‘ఈ మూడు పెళ్లిళ్ల గొడవేంటి భయ్యా’ అని బాలకృష్ణ ప్రశ్నించగా దానికి ఆయన వివరంగా సమాధానమిచ్చారు. ‘నేను సంప్రదాయాల్ని గౌరవిస్తా. ఇంట్లోవాళ్లు చూశారని తొలిసారి పెళ్లి చేసుకున్నా. ప్రతి రిలేషన్షిప్లో కొన్ని కుదరవు కాబట్టి విడిపోయాం. రెండోసారి చేసుకున్నప్పుడు భిన్నాభిప్రాయాల వల్ల విడిపోయాం. మూడు పెళ్లిళ్లంటూ నన్ను విమర్శించే నాయకుల వ్యక్తిగత జీవితాల గురించి నాకు తెలుసు. కాకపోతే నాలోని సంస్కారం వాటి గురించి మాట్లాడనివ్వదు. నేను ఎవరినైనా విమర్శించాలంటే వారింట్లో ఆడపడుచులు బాధపడతారని ఆలోచిస్తా. అలాంటి సంస్కారం, విజ్ఞత అవతలి వారికి లేక నాపై మాట్లాడతారు. వాటిని నేను ఆపలేను. ఈ విషయంలో నాకు ఎలాంటి అపరాధభావం (గిల్టీ) లేదు. నేను ఎక్కువ మందికి తెలియడంతో నా జీవితంలో ఏం జరిగినా ఎక్కువ మందికి తెలుస్తుంది’ అని వివరించారు. పవన్కల్యాణ్ వ్యాఖ్యలకు స్పందిస్తూ ఇకపై మూడు పెళ్లిళ్లు అంటూ ఆయన్ను విమర్శించేవారు ‘ఊరకుక్కలతో సమానం’ అని బాలకృష్ణ అన్నారు. పవన్ చెప్పిన ఇతర విషయాలు ఇలా ఉన్నాయి..
రాజకీయాల్లో నాకు గురువులు ఎవరూ లేరు
రాజకీయాల్లో నాకు గురువులు ఎవరూ లేరు. నాలో నేను లోతుగా చర్చించుకుంటా. రామ్మనోహర్ లోహియా, అంబేడ్కర్, ఫులే, తరిమెల నాగిరెడ్డి పుస్తకాలు బాగా చదివాను. ఏదైనా సందేహం తీర్చుకోవాలంటే ఆ పుస్తకాలపైనే ఆధారపడతా. త్రివిక్రమ్ శ్రీనివాస్ను స్నేహితుడి కన్నా గురువుగానే భావిస్తా. ‘గురు భాయ్’ అంటా. ఆయనతో సినిమాల కన్నా పుస్తకాలు, పురాణాలు, కవిత్వంపైనే చర్చ ఎక్కువ ఉంటుంది.
రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదు
నేను రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదు. సాటి మనిషికి ఏదైనా చేయాలని స్వచ్ఛందసంస్థ ప్రారంభించాలనే ఆలోచన ఉండేది. చిన్నతనంలో నేను సైలెంట్. ఎవరి జోలికీ వెళ్లేవాడిని కాను. నటనపై ఎప్పుడూ ఆసక్తి లేదు. పదిమంది ఉంటే కారులోంచి బయటకు కూడా వచ్చేవాణ్ని కాదు. రచయిత లేదా డైరెక్టర్ అవ్వాలనుకున్నా. కంప్యూటర్ గ్రాఫిక్సు వైపు వెళ్లాలనీ అనుకున్నా. మా వదిన, అత్తయ్యల ప్రోద్బలంతోనే నటనలోకి వచ్చాను. ఖుషీ తర్వాత నాలుగైదు సినిమాలు చేసి మానేయాలనుకున్నా. నాలుగైదు సినిమాలకు దర్శకత్వం వహించాలనుకున్నా.
ఇదే ఆఖరి సినిమా అని చెప్పేశా
* సుస్వాగతం సినిమా షూటింగ్లో బస్సుపై డ్యాన్స్ వేయాలని చెప్పారు. నాకు సిగ్గుగా అనిపించింది. అంతమంది మధ్య ఎలా డ్యాన్సు వేయాలా అని మధనపడ్డా. ఇదే అఖరి సినిమా అని మా వదినకు ఫోన్ చేసి చెప్పేశా. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఇదంతా నేనేనా.. నాకే జరుగుతోందా? అనిపిస్తుంది.
* బాలకృష్ణ ముక్కుసూటి వ్యక్తి, లోపల ఒకటి, బయట ఒకటి మాట్లాడరు. మంచో చెడో ముఖం మీదే అనేస్తారు. ఆయన ప్రేమ పంచినా, గొడవ పెట్టుకున్నా అలాగే ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ సభలో జనాలేరి?.. తంటాలు పడి తరలించినా వెళ్లిపోయారు
తలా రూ.500 నోటు. మగవారికి మద్యం సీసా. బిర్యానీ పొట్లం. ఊరూరా జనాన్ని తరలించేందుకు 1,200 బస్సులు. -
మండుతున్న ఆంధ్రప్రదేశ్.. నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ద్రోణి ప్రభావంతో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కొంతవరకు తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా.. మళ్లీ భానుడి ప్రతాపం మొదలైంది. -
త్రిమూర్తులే దగ్గరుండి గుండ్లు గీయించారు: శిరోముండనం బాధితుల ఆక్రందన
ఎన్నికల్లో రిగ్గింగ్ జరగకుండా అడ్డుకున్నామని పగబట్టి తమకు శిరోముండనం చేయించారని బాధితులు కోటి చినరాజు, కనికెళ్ల గణపతి, చల్లపూడి పట్టాభిరామయ్య వాపోయారు. -
‘మట్టి మనవాళ్లు తరలిస్తే సక్రమమే..!’.. జనం ప్రశ్నించక ముందే జాగ్రత్తపడిన ముత్తంశెట్టి
ఎన్నికల ప్రచారానికి విశాఖ జిల్లా పద్మనాభం వచ్చిన వైకాపా భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలకు మంగళవారం రాత్రి విచిత్ర పరిస్థితి ఎదురైంది. -
డ్వాక్రా సంఘాలను ప్రభావితం చేసే కార్యక్రమాలు వద్దు
స్వయం సహాయక (డ్వాక్రా) సంఘాల సభ్యులను ప్రభావితం చేసేలా ఎటువంటి కార్యక్రమాలూ నిర్వహించరాదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. -
చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ 7కి వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు మే 7వ తేదీకి వాయిదా వేసింది. -
శిరోముండనం చేయించి.. కనుబొమలు తీయించి
ఎన్నికల్లో రిగ్గింగ్పై ప్రశ్నించడమే ఆ దళిత యువకుల పాలిట శాపమైంది. మమ్మల్నే ప్రశ్నించే అంతటివారా? అంటూ అరాచక నేతలు ఆగ్రహించారు.. పంచాయితీకి పిలిపించారు. -
సివిల్స్లో ర్యాంకు సాధించిన మాజీ కానిస్టేబుల్
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ యువకుడు పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. -
బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై వేటు
జగన్ ప్రభుత్వం గత అయిదేళ్లుగా మద్యం ద్వారా కొనసాగిస్తున్న దోపిడీ పర్వాన్ని ముందుండి నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) ఎండీ డి.వాసుదేవరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
వేకువనే పోలీసు పంజా
పోలీసుల దాష్టీకం మరోసారి బయటపడింది. సీఎం జగన్పై రాయి విసిరిన కేసులో బాలలను వారు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. -
‘శివ అన్నపురెడ్డి’ పేరిట ఉన్న ఫేస్బుక్ ఖాతా మాయం
న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై అసభ్య దూషణల కేసులో నిందితుడైన మణి అన్నపురెడ్డి.. తన రూపం, పేరు మార్చేసుకుని ‘శివ అన్నపురెడ్డి’ పేరిట ఇన్నాళ్లూ కొనసాగిస్తున్న ఫేస్బుక్ ఖాతాను తొలగించేశారు. -
శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుకు శిక్ష
దళిత యువకులకు అమానవీయంగా శిరోముండనం చేసి, మీసాలు, కనుబొమలు తీసేయించిన ఘటనలో వైకాపా ఎమ్మెల్సీ, మండపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు దోషి అని విశాఖపట్నం కోర్టు తేల్చింది. -
జులై శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల రేపు
భక్తుల సౌకర్యార్థం జులై నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే ఈనెల 18న నుంచి ఆన్లైన్లో విడుదల చేయనుంది. -
వైకాపా పోస్టులను తొలగించండి
వైకాపా పెట్టిన కొన్ని పోస్టులను తొలగించాలని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. -
జగన్ హయాంలో పెరిగిన శిరోముండనం ఘటనలు
జగన్ హయాంలో గతంలో ఎన్నడూ లేనన్ని శిరోముండనం ఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి. -
ఏపీఈఏపీ సెట్కు 3,54,235 దరఖాస్తులు
ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ (ఏపీఈఏపీ)సెట్కు అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు సోమవారంతో ముగియగా.. మొత్తం 3,54,235 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సెట్ ఛైర్మన్ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
వెబ్సైట్లో పాలిసెట్ హాల్టికెట్లు
ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్-2024కు హాల్టికెట్లు బుధవారం ఉదయం 10 గంటల నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి తెలిపారు. -
కొయ్.. రాజా.. కొయ్!
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి జగన్తోపాటు ఆయన అధికారుల బృందం వివిధ దేశాల్లో కాళ్లరిగేలా తిరిగిందట. -
క్షేత్రస్థాయికి ఎన్నికల నిఘా
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా సాగేలా చూసేందుకు పనిచేస్తున్న సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) సంస్థను క్షేత్రస్థాయికి విస్తరించాలని నిర్ణయించారు. -
వివేకా హత్య కేసులో అవినాష్రెడ్డి తప్పించుకోలేరు
వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డి నిందితుడని, ఇందుకు శాస్త్రీయమైన ఆధారాలున్నాయని వివేకా కుమార్తె సునీత స్పష్టం చేశారు. -
చర్మకారులకు ఏమిటీ ఖర్మ?
ఏ ప్రభుత్వానికైనా యువతకు ఉపాధి కల్పించడం అత్యంత కీలకమైన అంశం. కానీ ఐదేళ్లు పాలన వెలగబెట్టిన జగన్ దీన్ని పూర్తిగా పక్కన పెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
అవును.. ‘ఎక్స్’ను నిలిపివేశాం: పాక్
-
జీవం పోయకముందే.. వేలాది ‘ప్రాణాలు’ గాల్లో!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నామినేషన్ల స్వీకరణకు వేళాయే.. సన్నద్ధమవుతున్న రాజకీయ పార్టీలు
-
అనంత్నాగ్ నుంచి ఆజాద్ పోటీ చేయట్లేదు: డీపీఏపీ ప్రకటన
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!