కీలక ప్రాజెక్టులకు కేటాయింపులు అరకొర
రాష్ట్రంలో కీలకమైన రైల్వేప్రాజెక్టులకు కేంద్రం మరోసారి మొండిచెయ్యి చూపింది. సుదీర్ఘకాలంగా నిర్మాణంలో ఉన్నవాటికి అరకొర కేటాయింపులు చేయడంతో అవి ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు కనిపించడంలేదు. అనేక కొత్త లైన్లను ప్రకటించి, గతంలోనే బడ్జెట్లలో చూపించినా.. వాటికి నామమాత్రంగా రూ.వెయ్యి, రూ.లక్ష, రూ.10 లక్షల చొప్పున విదిల్చింది.
అమరావతి మీదగా కొత్తలైన్కు కేవలం రూ.10 లక్షలు
విశాఖ జోన్, రాయగడ డివిజన్కు కలిపి రూ.10 కోట్లు
రెండోలైన్, మూడో లైన్ పనులకే ఆశాజనకం
రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు రూ.9,406 కోట్ల కేటాయింపు
ఈనాడు-అమరావతి, విశాఖపట్నం: రాష్ట్రంలో కీలకమైన రైల్వేప్రాజెక్టులకు కేంద్రం మరోసారి మొండిచెయ్యి చూపింది. సుదీర్ఘకాలంగా నిర్మాణంలో ఉన్నవాటికి అరకొర కేటాయింపులు చేయడంతో అవి ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు కనిపించడంలేదు. అనేక కొత్త లైన్లను ప్రకటించి, గతంలోనే బడ్జెట్లలో చూపించినా.. వాటికి నామమాత్రంగా రూ.వెయ్యి, రూ.లక్ష, రూ.10 లక్షల చొప్పున విదిల్చింది. రాజధాని అమరావతి మీదుగా విజయవాడ-గుంటూరుకు అనుసంధానం చేసే కొత్తలైన్కు రూ.10 లక్షలే కేటాయించారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యే దక్షిణకోస్తా కొత్తజోన్తోపాటు, రాయగడ డివిజన్కు కలిపి రూ.10 కోట్లే ఇచ్చారు. పలు రెండోలైన్, మూడోలైన్ పనులకు దండిగానే కేటాయించారు. 2023-24 కేంద్ర బడ్జెట్లో రైల్వేశాఖ ప్రాజెక్టుల వారీగా నిధుల కేటాయింపు వివరాలు తెలిపే పింక్బుక్ను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. దక్షిణమధ్య రైల్వేజోన్లోని విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లలో కలిపి రూ.8,406 కోట్లు, తూర్పుకోస్తా రైల్వే పరిధిలోని వాల్తేరు డివిజన్లో రూ.వెయ్యి కోట్లు కలిపి మొత్తంగా రూ.9,406 కోట్లు కేటాయించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు సాధించడంలో రాష్ట్రప్రభుత్వం, వైకాపా ఎంపీలు విఫలం కావడంతో.. మరోసారి బడ్జెట్లో అరకొర నిధులే మంజూరయ్యాయి. రాష్ట్రప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మించే కొత్త ప్రాజెక్టులకు మూడేళ్లుగా నిధులివ్వకపోవడంతో అవి ముందుకు సాగట్లేదు. ఈసారి రైల్వేశాఖ అందులో రెండింటికే కొంత నిధులిచ్చింది. పలు కొత్తలైన్లకు మంజూరుచేసిన నిధులు చూస్తే.. అవి పూర్తయ్యేందుకు దశాబ్దాలు పట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
రాష్ట్ర వాటాలేక కేంద్రమూ నిర్లక్ష్యం
విభజన హామీలో భాగంగా విశాఖపట్నం కేంద్రంగా దక్షిణకోస్తా జోన్, రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి నాలుగేళ్లయింది. వీటికి అవసరమైన భవనాల నిర్మాణం, వసతుల కల్పనలకు రూ.170 కోట్లు ఖర్చవుతుందని ప్రతిపాదించి, రూ.10 కోట్లే కేటాయించారు. ఇటీవల ప్రధాన కార్యాలయం, సిబ్బంది క్వార్టర్ల నిర్మాణానికి స్థల పరిశీలన చేసి, లేఅవుట్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వచ్చే ఏడాది రూ.10 కోట్లతో ఎంతమేరకు పనులు జరుగుతాయనేది ప్రశ్నార్థకం కానుంది.
కొత్తలైన్లు పూర్తయ్యేదెప్పుడు?
అనేక కొత్తలైన్ల నిర్మాణప్రాజెక్టులకు నిధుల కేటాయింపు చూస్తే.. అవి ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు లేవు.
* కడప-బెంగళూరు మధ్య 255 కి.మీ. (రాష్ట్రంలో 218 కి.మీ.) నిర్మించాల్సిన కొత్తలైనుకు బడ్జెట్లో రూ.10 లక్షలే కేటాయించారు. 2008-09లో మంజూరైన ఈ ప్రాజెక్టు విలువ రూ.2,849 కోట్లుకాగా, అయిదేళ్ల కిందట 21 కి.మీ. నిర్మాణం జరిగింది. తర్వాత నుంచి రాష్ట్రప్రభుత్వం వాటా 50% ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయాయి. ఈలెక్కన ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు మరో 20-30 ఏళ్లు పట్టనుంది.
* నడికుడి-శ్రీకాళహస్తి కొత్తలైన్ 309 కి.మీ. మేర నిర్మించాలి. దీని అంచనావిలువ రూ.2,289 కోట్లు. రెండేళ్లుగా 50% రాష్ట్రవాటా ఇవ్వకపోయినా రైల్వేశాఖ కొంతమేర పనులు చేసింది. ఈసారి బడ్జెట్లో దీనికి రూ.202 కోట్లు కేటాయించారు.
* 2000-01లో మంజూరైన కోటిపల్లి-నరసాపురం (57.21 కి.మీ.) కొత్తలైన్ పనులు తూతూమంత్రంగా సాగుతున్నాయి. రూ.2,120 కోట్లు వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుకు రాష్ట్రవాటా 25% ఇవ్వలేదు. రైల్వేశాఖ గత బడ్జెట్లో రూ.21.40 కోట్లు, ఈసారి రూ.100 కోట్లు మంజూరుచేసింది. ఇది పూర్తయ్యేందుకు 10-20 ఏళ్లు పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ లైన్లు పట్టాలెక్కేది ఎప్పుడు?
గతంలో మంజూరైన కొత్తలైన్లకు రైల్వేశాఖ మొక్కుబడిగా బడ్జెట్లో నిధులు విదిల్చింది.
* మాచర్ల-నల్గొండ (92 కి.మీ.) లైన్కు రూ.వెయ్యి, కాకినాడ-పిఠాపురం (21.51 కి.మీ.) లైన్కు రూ.లక్ష, గూడూరు-దుగరాజపట్నం (41.55 కి.మీ.) లైన్కు రూ.10 లక్షలు, కొండపల్లి-కొత్తగూడెం (125 కి.మీ.) లైన్కు రూ.10 లక్షలు, కంభం-ప్రొద్దుటూరు (142 కి.మీ.) లైన్కు రూ.కోటి, భద్రాచలం-కొవ్వూరు (151 కి.మీ.) లైన్కు రూ.20 కోట్లు కేటాయించారు.
* సర్వేదశలో ఉన్న దువ్వాడ-విజయవాడ లైన్కు రూ.10 లక్షలే ఇచ్చారు.
రెండు, మూడో లైన్లకు అధిక నిధులు
మనరాష్ట్ర పరిధిలో ఉన్న పలు రెండో, మూడోలైన్లకు నిధులు అధికంగానే కేటాయించారు. గుంటూరు-గుంతకల్లు (401 కి.మీ.) రెండోలైన్కు రూ.980 కోట్లు, విజయవాడ-గూడూరు (287 కి.మీ.) మూడోలైన్కు రూ.800 కోట్లు, కాజీపేట-విజయవాడ (219 కి.మీ.) మూడోలైన్కు రూ.337.51 కోట్లు మంజూరుచేశారు.
* విజయవాడ-గుడివాడ, మచిలీపట్నం-భీమవరం, నరసాపురం-నిడదవోలు మధ్య విద్యుదీకరణతో కూడిన రెండోలైన్కు రూ.100 కోట్లు కేటాయించారు.
* గుంటూరు-బీబీనగర్ మధ్య 248 కి.మీ.మేర నిర్మించనున్న రెండోలైన్కు రూ.60 కోట్లే కేటాయించారు. ఈ ప్రాజెక్టు 2019-20లో రూ.2,480 కోట్లతోమంజూరైంది.
* కొత్తవలస-కోరాపుట్ (189 కి.మీ.) రెండోలైన్కు రూ.410 కోట్లు, విజయనగరం-సంబల్పూర్ (264 కి.మీ.) రెండో లైన్కు రూ.920 కోట్లు, ధర్మవరం-పాకాల-కాట్పాడి (290 కి.మీ.) రెండోలైన్కు రూ.40 కోట్లు, గుత్తి-ధర్మవరం (90 కి.మీ.) రెండోలైన్కు రూ.90.6 కోట్లు కేటాయించారు.
నాలుగు బైపాస్లకు..
రద్దీ ఉండే పలు రైల్వేజంక్షన్లలో గూడ్సురైళ్లు స్టేషన్కు రాకుండానే బయట నుంచి వెళ్లేందుకు వీలుగా నిర్మిస్తున్న బైపాస్ లైన్లకు నిధులు కేటాయించారు. రేణిగుంట (9.60 కి.మీ.), గుత్తి (3.8 కి.మీ)తో పాటు వాడి (7.6 కి.మీ.) బైపాస్లకు కలిపి రూ.73.12 కోట్లు కేటాయించారు. విజయవాడ బైపాస్లైన్ (19.5 కి.మీ.), కాజీపేట బైపాస్లైన్ (10.65 కి.మీ)కు రూ.310 కోట్లు మంజూరుచేశారు.
వ్యాగన్ మరమ్మతుల కేంద్రానికి రూ.125 కోట్లు
* కర్నూలులోని వ్యాగన్ మరమ్మతుల కేంద్రానికి రూ.125కోట్లు కేటాయించారు. ఇది 2013-14లో మంజూరు కాగా, పదేళ్లుగా పనులు జరుగుతూనే ఉన్నాయి.
ఎన్నేళ్లవుతుందో..
కేంద్రం విడుదల చేస్తున్న నిధులను పరిశీలిస్తే జోన్ ఎప్పుడు పూర్తవుతుందోనన్న సందేహం తలెత్తుతోంది. ఇప్పటికే జోన్ ప్రకటించి నాలుగేళ్లు అవుతోంది. డీపీఆర్ తయారుచేసి రైల్వేబోర్డుకు నివేదిక సమర్పించి మూడేళ్లు అయింది. జోన్ను అమల్లోకి తీసుకురావడంలో కీలకమైన అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ లెవెల్ కమిటీ ఇంకా ఏర్పడలేదు. ఈ కమిటీ జోన్పై పూర్తిస్థాయి కసరత్తు చేస్తుంది. అలాంటిదేమీ జరగలేదని తెలుస్తోంది.
అమరావతి లైన్కు మొండిచేయి
రాజధాని ప్రాంతమైన అమరావతికి ఇటు విజయవాడ, అటు గుంటూరువైపు రైల్వేలైన్లతో అనుసంధానం చేసే ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు, అమరావతి-పెదకూరపాడు, సత్తెనపల్లి-నరసరావుపేట మధ్య 106 కి.మీ. కొత్తలైన్కు రైల్వేశాఖ మళ్లీ మొండిచేయి చూపింది. దీనికి రూ.2,679 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేయగా.. బడ్జెట్లో రూ.10 లక్షలే కేటాయించారు. రాష్ట్రప్రభుత్వం ఎంత వాటా ఇస్తుందో తెలపాలని రైల్వేశాఖ కోరుతుంటే.. రాష్ట్రప్రభుత్వం స్పందించట్లేదు. దీంతో కేంద్రం కూడా నిధులివ్వకుండా నిర్లక్ష్యం చూపింది.
దక్షిణకోస్తా జోన్కు మిగిలింది నిరాశే
విశాఖ కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వేజోన్ ఏర్పాటుకు నిధులు ఎప్పుడిస్తారనేది అర్థం కావట్లేదు. తూర్పుకోస్తా రైల్వేపరిధిలోని వాల్తేరు డివిజన్కు రూ.2,857 కోట్లను కేటాయించిన రైల్వేశాఖ... జోన్ ఏర్పాటుకు ఇచ్చే నిధులేంటో 2023-24 బడ్జెట్లో పేర్కొనలేదు. కంటితుడుపుగా రూ.పది కోట్లనే కేటాయించింది. జోన్తో పాటు కొత్త రాయగడ డివిజన్ కోసం ఆ నిధులను ఇచ్చినట్లు పింక్బుక్లో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం