‘అప్పర్ భద్ర’తో సీమకు పెను విపత్తు
కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుతో రాయలసీమకు ముప్పు ముంచుకొస్తోంది. తుంగ నుంచి మొదటి దశలో 17.4 టీఎంసీలను భద్ర జలాశయానికి, రెండో దశలో భద్ర జలాశయం నుంచి మొత్తం 29.50 టీఎంసీల నీటిని 5.56 లక్షల ఎకరాల ఆయకట్టుకు తరలిస్తారు.
29.9 టీఎంసీలను ఎత్తిపోయనున్న కర్ణాటక
ప్రాజెక్టుకు బడ్జెట్లో రూ.5,300 కోట్లు ఇచ్చిన కేంద్రం
దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ను పట్టించుకోని తీరు
రాయలసీమ ప్రాజెక్టులకు ఇక కన్నీరే
ఈనాడు, అమరావతి - న్యూస్టుడే, అనంతపురం(శ్రీనివాస్నగర్): కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుతో రాయలసీమకు ముప్పు ముంచుకొస్తోంది. తుంగ నుంచి మొదటి దశలో 17.4 టీఎంసీలను భద్ర జలాశయానికి, రెండో దశలో భద్ర జలాశయం నుంచి మొత్తం 29.50 టీఎంసీల నీటిని 5.56 లక్షల ఎకరాల ఆయకట్టుకు తరలిస్తారు. 2020 నుంచి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.5.300 కోట్లను కేటాయించింది. ఇప్పటికే తుంగభద్ర జలాశయానికి సరిపడా నీరు రాక రాయలసీమ జిల్లాలు కష్టాలు ఎదుర్కొంటున్నాయి. తాజా ప్రాజెక్టుతో మూడు ఉమ్మడి జిల్లాల్లోని 7.94 లక్షల ఎకరాలపై తీవ్ర ప్రభావం పడనుంది. అప్పర్ భద్రను వ్యతిరేకిస్తూ మన రాష్ట్రం త్వరలోనే సుప్రీంకోర్టులో ఒరిజినల్ సూట్ దాఖలు చేయడానికి కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం...
తుంగభద్ర జలాశయం పరిధిలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. కృష్ణా ట్రైబ్యునల్ కేటాయించిన మేరకు అనేక సందర్భాల్లో నీళ్లు ఇవ్వలేకపోతున్నారు. అందుబాటులో ఉన్న నీటిని ఆయా నిష్పత్తి ప్రకారం పంచినా ఆ స్థాయిలోనైనా రాష్ట్రానికి నీళ్లు ఒకట్రెండు సందర్భాల్లో మాత్రమే వచ్చాయి. తుంగభద్రపై ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లోని దాదాపు 7.94 లక్షల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. ఎగువ (హెచ్ఎల్సీ), దిగువ (ఎల్ఎల్సీ), కేసీ కాలువల ద్వారా నీటిని వదులుతారు. అయితే... జలాశయం నుంచి రాయలసీమ జిల్లాల్లోని పూర్తి ఆయకట్టుకు నీళ్లు వచ్చిన సందర్భాలు లేవు. ఎప్పుడైనా వరద అధికంగా వచ్చి స్పిల్వే మీదుగా నీటిని దిగువకు నదిలోకి వదిలేస్తున్నా... జలాశయంలో సాగుకు సరిపోయే స్థాయిలో మాత్రం నీరు ఉండటం లేదు. ఈ పరిస్థితుల్లో అప్పర్ భద్ర నుంచి 29.50 టీఎంసీలను మళ్లిస్తే తుంగభద్ర ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంలో పడటం ఖాయంగా కనిపిస్తోంది.
* హెచ్ఎల్సీ కింద ఉమ్మడి అనంతపురం, కడప జిల్లాల్లోని 3,78,124 ఎకరాల ఆయకట్టుకు 32.50 టీఎంసీల నీటిని ఇవ్వాలి.
* ఎల్ఎల్సీ కింది ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 1,51,134 ఎకరాలకు 24 టీఎంసీలను ఇవ్వాలి.
* కేసీ కాలువ కింద ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాల్లోని 2,65,628 ఎకరాలకు 10 టీఎంసీలు వదలాలి.
అభ్యంతరాలున్నా దక్కిన అనుమతులు
తుంగ, విజయనగరం బ్రాంచి కాలువల ఆధునికీకరణ ద్వారా 11.5 టీఎంసీలు, కృష్ణా మొదటి ట్రైబ్యునల్ కేటాయించిన 734 టీఎంసీల్లో తాము వాడుకోని 10 టీఎంసీలు, పోలవరం ద్వారా వచ్చే గోదావరి జలాల్లో 2.4 టీఎంసీలు, కే-8, కే-9 బేసిన్లలో చిన్న నీటి వనరుల వినియోగంలో ఆరు టీఎంసీలు కలిపి మొత్తంగా... 29.5 టీఎంసీలను అప్పర్ భద్ర ద్వారా వినియోగిస్తామని కర్ణాటక అంటోంది. ఈ లెక్కల్లో అసమంజసమైన వివరాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ వాదిస్తున్నా... కేంద్ర జలసంఘం అనుమతులు ఇచ్చేసింది. ఈతీరుపై ఏపీ సుప్రీంకోర్టును ఆశ్రయించబోతోంది.
శ్రీశైలం ప్రాజెక్టుపై ప్రభావం
కృష్ణా నదికి తుంగభద్ర ఉప నది. వరదల కాలంలో తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తితే జలాలు నేరుగా శ్రీశైలం జలాశయంలోకి వస్తాయి. శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్పై ఆధారపడి రాయలసీమ జిల్లాల్లో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు, ఎస్ఆర్బీసీ, తెలుగు గంగ వంటి వాటిపై అప్పర్గంగ ప్రభావం పడుతుంది. శ్రీశైలం జలాశయానికి ఆశించిన మేర వరద రాకుంటే సీమ ప్రాజెక్టులన్నీ ఒట్టిపోతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్