ఇళ్లలో ‘సౌర వెలుగులకు’ డిస్కంలు అడ్డు
ఇళ్లపై సౌర విద్యుత్ ప్రాజెక్టులను సామాన్య ప్రజలకు చేరువ చేయాలని కేంద్రం భావిస్తుంటే.. రాష్ట్ర డిస్కంలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి.
జాతీయ పోర్టల్లో నమోదుకు అవకాశం కల్పించని రెండు డిస్కంలు
పథకం కింద అందని కేంద్రం రాయితీ
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇచ్చింది కేవలం 6.8 మెగావాట్లే!
ఈనాడు, అమరావతి: ఇళ్లపై సౌర విద్యుత్ ప్రాజెక్టులను సామాన్య ప్రజలకు చేరువ చేయాలని కేంద్రం భావిస్తుంటే.. రాష్ట్ర డిస్కంలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే ఇళ్లపై సౌర విద్యుత్ ఫలకలు ఏర్పాటు చేసుకున్న వారికి నెట్ మీటర్లు ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నాయి. ఈ పథకం అమలు చేస్తే.. భవిష్యత్తులో డిస్కంల నుంచి తీసుకునే విద్యుత్ తగ్గిపోతుందని అధికారులు పేర్కొంటున్నారు. అందువల్లే కేంద్రం ప్రకటించిన ఇళ్ల కప్పుపై సౌర విద్యుత్(ఆర్టీఎస్) పథకానికి డిస్కంలు అవకాశం కల్పించడం లేదు. మంజూరుకు ఎలాంటి పరిమితి లేకున్నా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్) 1.4 మెగావాట్లు, దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) 5.4 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు మాత్రమే అనుమతులు ఇచ్చాయి. డిస్కంల నిర్వాకంతో ఇళ్లపై ఏర్పాటు చేసే వాటికి కిలోవాట్కు రూ.14,588 వంతున.. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు(ఆర్డబ్ల్యూఏ), గ్రూప్ హౌసింగ్ సొసైటీ (జీహెచ్ఎస్)లకు మెగావాట్కు రూ.7,294 వంతున కేంద్రం ఇచ్చే రాయితీని కోల్పోవాల్సి వస్తోంది. దేశ వ్యాప్తంగా ఆర్టీఎస్, పీఎం కుసుమ్ కింద(రైతులకు కిలోవాట్ సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఇచ్చే పథకం) 40 వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. పథకం అమలుకు నేరుగా దరఖాస్తు చేసుకునేలా జాతీయ స్థాయి పోర్టల్ను కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. విద్యుత్ వినియోగదారుల వివరాలను డిస్కంలు ఆ పోర్టల్కు అనుసంధానించాలి.
రెండు డిస్కంల సమాచారమే లేదు
ఇళ్లపై గృహ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతులు ఇస్తూ వెళ్తే.. భవిష్యత్తులో విద్యుత్ కొనేవారే ఉండరన్న అభిప్రాయాన్ని డిస్కంలకు చెందిన ముఖ్య అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అందువల్లే డిస్కంలు ఉద్దేశపూర్వకంగా నెట్ మీటర్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో సుమారు 50 పాఠశాలల్లో ఈ ప్రాజెక్టులను ఒక ఏజెన్సీ ఏర్పాటు చేస్తే.. వాటికి నెట్ మీటర్లు ఇవ్వకుండా డిస్కం ఇబ్బందిపెడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రాల డిస్కంల నుంచి ఆశించిన సహకారం లేదన్న కారణంగా జాతీయ స్థాయిలో పోర్టల్ను httpa://solarrooftop.gov.in/ కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో వచ్చిన దరఖాస్తులను డిస్కంలకు కేంద్రం పంపుతుంది. ఈపీడీసీఎల్ మినహా.. మిగిలిన రెండు డిస్కంలు విద్యుత్ వినియోగదారుల వివరాలను పోర్టల్కు ఇప్పటికీ అనుసంధానించలేదు. దీనివల్ల వాటి పరిధిలోని వారు కేంద్రం ఇచ్చే రాయితీలు కోల్పోవాల్సి వస్తోంది.
పీపీఏ విద్యుత్ ఏం చేయాలి?
ఇప్పటికే వ్యవసాయ విద్యుత్ కోసం సెకి నుంచి 7 వేల మెగావాట్లను ప్రభుత్వం తీసుకుంటోంది. దీనివల్ల రైతుల కోసం ఇప్పటికే కొన్న విద్యుత్ను డిస్కంలు సర్దుబాటు చేయాల్సి వస్తోంది. వాణిజ్య సంస్థలు, పరిశ్రమల నుంచి వసూలు చేసే టారిఫ్ ఎక్కువగా ఉందన్న ఉద్దేశంతో కొన్ని సంస్థలు ఇప్పటికే ఓపెన్ యాక్సెస్ విధానంలో బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొంటున్నాయి. దీనివల్ల వాటి నుంచి వచ్చే క్రాస్ సబ్సిడీ కూడా నష్టపోవాల్సి వస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్టీఎస్ పథకం కింద నెట్ మీటర్లు ఇస్తూ వెళ్తే డిస్కంలు దివాలా తీసే పరిస్థితి ఏర్పడుతుందని అధికారి పేర్కొనడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది. -
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. -
వైకాపా సైన్యం బరితెగింపు
ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. -
వేతనాల చెల్లింపులపై నేడు ‘చివరి గ్రీవెన్స్ డే’
వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి ‘గ్రీవెన్స్ డే’(వినతుల స్వీకరణ)లో పరిష్కరించుకోవాలని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ సూచించారు. -
జగన్పై పోస్టులో అభ్యంతరకర భాగాన్ని తొలగించండి
వైకాపా అధ్యక్షుడు జగన్పై తెదేపా ఎక్స్ ఖాతాలో ఉంచిన పోస్టులో అభ్యంతరకరమైన ఓ భాగాన్ని తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం లేఖ రాసింది. -
కక్షిదారులకు వెంటనే న్యాయం అందించాలి
న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. -
ఓఎంఆర్ షీట్లో గల్లంతైన విద్యార్థిని పేరు
విద్యాశాఖ అధికారుల తీరుతో పదో తరగతి విద్యార్థిని అరగంటపాటు తల్లడిల్లాల్సి వచ్చింది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వర్షిణి తనకు కేటాయించిన బైపాస్లోని రత్నం పరీక్షా కేంద్రం వద్దకు అరగంట ముందుగానే చేరుకుంది. -
కోడ్ కూసే ముందు.. అయినవారికే నిధులు
ఇప్పటికే పలు దఫాలు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ పరిధిలో రహదారుల పనులు చేసిన గుత్తేదార్లకు మాత్రమే చెల్లింపులు చేశారంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. -
కాసులివ్వని కపట ప్రేమ!
పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు.. రైతులకు మాత్రం సున్నా వడ్డీ లేదు. పెట్టుబడి సాయమూ లేదు. -
గ్రహణం వీడితేనే గట్టెక్కేది!
చుట్టూ నీళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ నిర్మాణాలు టిడ్కో ఇళ్లు. ఒంగోలు నగరం సమీపంలోని చింతల వద్ద తెదేపా హయాంలో నిర్మించారు. -
ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు
ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది. -
ఉత్తుత్తి సంక్షేమం
‘గడప గడపకు సంక్షేమం’ పేరుతో వైకాపా ప్రభుత్వం పేదలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. -
కోడ్ ఉల్లంఘన విచారణలో జాప్యం: కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వాలంటీర్ల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదేం సామాజిక న్యాయం జగన్?
వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం నేతి బీర చందంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాను కలిపి వైకాపా టికెట్ల కేటాయింపు పరిశీలిస్తే.. జగన్ మార్క్ న్యాయం ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
సీపీఎస్ ఉద్యోగుల డబ్బులు రూ.2,800 కోట్లు హాంఫట్
జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. -
ఆగని సలహాదారు నియామకాల జోరు
ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకంపై హైకోర్టు అభ్యంతరం చెప్పినా జగన్ ప్రభుత్వ తీరు మారడంలేదు.
తాజా వార్తలు (Latest News)
-
Social Look: కృతి సనన్ ‘క్రూ’ సంగతులు.. వేడుకలో మృణాల్, కియారా మెరుపులు
-
Israel Hamas Conflict: యుద్ధ తంత్రంగా ఆకలి మంటలు: ఐరాస ఆందోళన
-
Meta: ఎన్నికల్లో ఏఐ నకిలీ సమాచార కట్టడి.. మెటా ప్రత్యేక చర్యలు
-
YSRCP: ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. వైకాపా ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు
-
Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్’ సరికొత్త రికార్డు.. ఆ విషయంలో తొలి మలయాళ సినిమా
-
Suryakumar Yadav: ఐపీఎల్ మ్యాచ్లకు సూర్య దూరమేనా? ఇన్స్టా పోస్ట్ వైరల్