ఇళ్లలో ‘సౌర వెలుగులకు’ డిస్కంలు అడ్డు
ఇళ్లపై సౌర విద్యుత్ ప్రాజెక్టులను సామాన్య ప్రజలకు చేరువ చేయాలని కేంద్రం భావిస్తుంటే.. రాష్ట్ర డిస్కంలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి.
జాతీయ పోర్టల్లో నమోదుకు అవకాశం కల్పించని రెండు డిస్కంలు
పథకం కింద అందని కేంద్రం రాయితీ
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇచ్చింది కేవలం 6.8 మెగావాట్లే!
ఈనాడు, అమరావతి: ఇళ్లపై సౌర విద్యుత్ ప్రాజెక్టులను సామాన్య ప్రజలకు చేరువ చేయాలని కేంద్రం భావిస్తుంటే.. రాష్ట్ర డిస్కంలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే ఇళ్లపై సౌర విద్యుత్ ఫలకలు ఏర్పాటు చేసుకున్న వారికి నెట్ మీటర్లు ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నాయి. ఈ పథకం అమలు చేస్తే.. భవిష్యత్తులో డిస్కంల నుంచి తీసుకునే విద్యుత్ తగ్గిపోతుందని అధికారులు పేర్కొంటున్నారు. అందువల్లే కేంద్రం ప్రకటించిన ఇళ్ల కప్పుపై సౌర విద్యుత్(ఆర్టీఎస్) పథకానికి డిస్కంలు అవకాశం కల్పించడం లేదు. మంజూరుకు ఎలాంటి పరిమితి లేకున్నా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్) 1.4 మెగావాట్లు, దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) 5.4 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు మాత్రమే అనుమతులు ఇచ్చాయి. డిస్కంల నిర్వాకంతో ఇళ్లపై ఏర్పాటు చేసే వాటికి కిలోవాట్కు రూ.14,588 వంతున.. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు(ఆర్డబ్ల్యూఏ), గ్రూప్ హౌసింగ్ సొసైటీ (జీహెచ్ఎస్)లకు మెగావాట్కు రూ.7,294 వంతున కేంద్రం ఇచ్చే రాయితీని కోల్పోవాల్సి వస్తోంది. దేశ వ్యాప్తంగా ఆర్టీఎస్, పీఎం కుసుమ్ కింద(రైతులకు కిలోవాట్ సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఇచ్చే పథకం) 40 వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. పథకం అమలుకు నేరుగా దరఖాస్తు చేసుకునేలా జాతీయ స్థాయి పోర్టల్ను కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. విద్యుత్ వినియోగదారుల వివరాలను డిస్కంలు ఆ పోర్టల్కు అనుసంధానించాలి.
రెండు డిస్కంల సమాచారమే లేదు
ఇళ్లపై గృహ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతులు ఇస్తూ వెళ్తే.. భవిష్యత్తులో విద్యుత్ కొనేవారే ఉండరన్న అభిప్రాయాన్ని డిస్కంలకు చెందిన ముఖ్య అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అందువల్లే డిస్కంలు ఉద్దేశపూర్వకంగా నెట్ మీటర్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో సుమారు 50 పాఠశాలల్లో ఈ ప్రాజెక్టులను ఒక ఏజెన్సీ ఏర్పాటు చేస్తే.. వాటికి నెట్ మీటర్లు ఇవ్వకుండా డిస్కం ఇబ్బందిపెడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రాల డిస్కంల నుంచి ఆశించిన సహకారం లేదన్న కారణంగా జాతీయ స్థాయిలో పోర్టల్ను httpa://solarrooftop.gov.in/ కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో వచ్చిన దరఖాస్తులను డిస్కంలకు కేంద్రం పంపుతుంది. ఈపీడీసీఎల్ మినహా.. మిగిలిన రెండు డిస్కంలు విద్యుత్ వినియోగదారుల వివరాలను పోర్టల్కు ఇప్పటికీ అనుసంధానించలేదు. దీనివల్ల వాటి పరిధిలోని వారు కేంద్రం ఇచ్చే రాయితీలు కోల్పోవాల్సి వస్తోంది.
పీపీఏ విద్యుత్ ఏం చేయాలి?
ఇప్పటికే వ్యవసాయ విద్యుత్ కోసం సెకి నుంచి 7 వేల మెగావాట్లను ప్రభుత్వం తీసుకుంటోంది. దీనివల్ల రైతుల కోసం ఇప్పటికే కొన్న విద్యుత్ను డిస్కంలు సర్దుబాటు చేయాల్సి వస్తోంది. వాణిజ్య సంస్థలు, పరిశ్రమల నుంచి వసూలు చేసే టారిఫ్ ఎక్కువగా ఉందన్న ఉద్దేశంతో కొన్ని సంస్థలు ఇప్పటికే ఓపెన్ యాక్సెస్ విధానంలో బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొంటున్నాయి. దీనివల్ల వాటి నుంచి వచ్చే క్రాస్ సబ్సిడీ కూడా నష్టపోవాల్సి వస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్టీఎస్ పథకం కింద నెట్ మీటర్లు ఇస్తూ వెళ్తే డిస్కంలు దివాలా తీసే పరిస్థితి ఏర్పడుతుందని అధికారి పేర్కొనడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం