మహనీయుల్ని గౌరవించేది ఇలాగేనా?
మచిలీపట్నం కేంద్రంగా 1923లో ఆంధ్రాబ్యాంకును స్థాపించిన, అంతకుముందు ఆంధ్రా జాతీయ కళాశాలను నెలకొల్పడంలో కీలకపాత్ర నిర్వహించిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్యను తలుచుకుంటే ఆంధ్రులెవరికైనా గౌరవంతో ఒళ్లు పులకరిస్తుంది.
మచిలీపట్నంలో భోగరాజు స్మారక భవనం నిర్మాణానికి మోకాలడ్డు
అదేచోట వైకాపా కార్యాలయానికి విలువైన రెండెకరాలు, ఆగమేఘాలపై భూమిపూజ
స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం ఉందని విమర్శలు
ఈనాడు, అమరావతి: మచిలీపట్నం కేంద్రంగా 1923లో ఆంధ్రాబ్యాంకును స్థాపించిన, అంతకుముందు ఆంధ్రా జాతీయ కళాశాలను నెలకొల్పడంలో కీలకపాత్ర నిర్వహించిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్యను తలుచుకుంటే ఆంధ్రులెవరికైనా గౌరవంతో ఒళ్లు పులకరిస్తుంది. కానీ స్థానిక వైకాపా నాయకులకు మాత్రం... ఆయన జ్ఞాపకార్థం నిర్మించ తలపెట్టిన ఆడిటోరియం కంటే, పార్టీ కార్యాలయమే అత్యంత ప్రాధాన్యమైపోయింది. రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాల్ని పార్టీ కార్యాలయాలకు తీసుకుంటున్న వైకాపా నాయకులు.. మచిలీపట్నం నడిబొడ్డున సుమారు రూ.60-65 కోట్ల విలువచేసే రెండెకరాల స్థలాల్ని లీజు పేరుతో హస్తగతం చేసుకున్నారు. ఆగమేఘాల మీద నగరపాలక సంస్థలో తీర్మానం చేయించి, శనివారం భూమిపూజ కూడా చేసేశారు. అక్కడ పట్టాభి జ్ఞాపకార్థం నిర్మించతలపెట్టిన ఆడిటోరియానికి స్థలం కేటాయింపుపై కార్పొరేషన్లో తీర్మానం చేయకుండా మోకాలడ్డుతున్నారు. రాష్ట్రప్రభుత్వం, ముఖ్యమంత్రి చొరవ తీసుకుని స్థలం కేటాయించినా... కార్పొరేషన్లో తీర్మానం చేయకుండా అడ్డుపడుతున్నారు. దేశానికి స్వాతంత్య్రం సముపార్జించిన, తెలుగుజాతి కీర్తిపతాకాన్ని వినువీధుల్లో ఎగరవేసిన మహానుభావులంటే వైకాపా నాయకులకు ఎంత మాత్రం గౌరవం లేదనడానికి ఇదే నిదర్శనం. వైకాపా కార్యాలయానికి స్థలం కేటాయించేలా చేయడంలోనూ, పట్టాభి జ్ఞాపకార్థం తలపెట్టిన ప్రాజెక్టు ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడంలోనూ స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విచక్షణ ఉన్నవారు చేసే పనేనా?
ఆంధ్రాబ్యాంకును కేంద్రప్రభుత్వం మూడేళ్ల క్రితం యూనియన్ బ్యాంకులో విలీనం చేయడంతో... ప్రతి ఆంధ్రుడి గుండె తల్లడిల్లింది. ఆంధ్రుల అస్తిత్వాన్ని చెరిపేస్తారా అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. అప్పుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరు చిరస్థాయిగా నిలిచేలా ఆయన జ్ఞాపకార్థం మచిలీపట్నంలో రూ.40 కోట్లతో ఆడిటోరియం నిర్మించేందుకు, బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాన్ని అక్కడే ఏర్పాటుచేసేందుకు యూనియన్ బ్యాంకు ముందుకొచ్చింది. తమకు రెండు ఎకరాలు కేటాయించాలని జిల్లా కలెక్టరును బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ కోరారు. స్థానిక వైకాపా ఎంపీ బాలశౌరి చొరవ తీసుకుని... భోగరాజు జ్ఞాపకార్థం ఆడిటోరియంతో పాటు, లైబ్రరీ, మ్యూజియం, కన్వెన్షన్హాలు నిర్మాణానికి ఐదు ఎకరాలు కేటాయించాలని ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు. దానిపై జిల్లా కలెక్టర్.. సీసీఎల్ఏకు ఒక ప్రతిపాదన పంపారు. నగరం నడిబొడ్డున ఈడేపల్లిలో 5.45 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని, దానిలో 3.45 ఎకరాల్ని కేటాయించవచ్చని సిఫారసు చేశారు. చివరకు రెండు ఎకరాలే కేటాయిస్తూ 2022 ఏప్రిల్ 25న సీసీఎల్ఏ ఉత్తర్వులిచ్చారు. అదే నెలలో ఆ భూమిని యూనియన్ బ్యాంక్ సీజీఎంకి అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు. దానిపై మచిలీపట్నం నగరపాలక సంస్థ పాలకమండలి సమావేశంలో తీర్మానం చేయాల్సి ఉండగా, ఎజెండాలో ఆ అంశాన్ని చేర్చకుండా స్థానిక ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారన్న విమర్శలున్నాయి. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడి గౌరవార్థం, ప్రజలందరికీ ఉపయోగపడేలా ఆయన జ్ఞాపకచిహ్నాన్ని నిర్మించేందుకు, రూ.40కోట్లు కేటాయించేందుకు ప్రభుత్వరంగ బ్యాంకు ముందుకొస్తే స్వాగతించి, సహకరించాల్సిందిపోయి అలా అడ్డుపడటాన్ని ఏమనుకోవాలి? విచక్షణ ఉన్నవారెవరైనా చేసే పనేనా అది? కార్పొరేషన్లో ఎందుకు తీర్మానం చేయడం లేదని ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో కార్పొరేషన్ కమిషనర్ చంద్రయ్యను కొందరు నిలదీయగా, ఆయన 15 రోజులు సెలవుపెట్టి వెళ్లిపోయారు.
నగరం నడిబొడ్డున పార్టీ కార్యాలయానికి స్థలమా?
ఈడేపల్లిలో రెండెకరాల స్థలాన్ని పట్టాభి స్మారక భవనానికి ఇస్తున్నారని తెలియగానే, స్థానిక వైకాపా నేతల కన్ను దానిపై పడింది. అదే సర్వేనంబరులో రెండెకరాలు పార్టీ కార్యాలయానికి కేటాయిస్తూ ఆగమేఘాల మీద నగరపాలక సంస్థ పాలకమండలితో తీర్మానం చేయించారు. దానిలో భవన నిర్మాణ కాంట్రాక్టరుతో శనివారం భూమిపూజ చేయించేశారు. జిల్లా మంత్రి, అధికారపార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లాపరిషత్ ఛైర్మన్ సహా ఎవరికీ సమాచారం లేకుండానే ఆ కార్యక్రమం నిర్వహించడం విశేషం. వైకాపా నాయకులు హాజరైతే వివాదాస్పదం అవుతుందన్న ఉద్దేశంతోనే వారెవరూ వెళ్లలేదని సమాచారం. ఆ స్థలం నగరం నడిబొడ్డున ఉంది. దానికి పక్కనే రైతుబజారు, ఎమ్మార్వో కార్యాలయం, కొన్ని మీటర్ల దూరంలోనే జిల్లా కోర్టు, ఆ స్థలానికి ఎదురుగా జిల్లా జడ్జి నివాస భవనం ఉన్నాయి. ఇప్పుడక్కడ చదరపు గజం విలువ రూ.70వేల వరకు ఉంటుందని అంచనా. అంటే ఎకరం రూ.33 కోట్ల పైమాటే. అంత విలువైన స్థలాన్ని, అంత కీలకమైన ప్రాంతంలో పార్టీ కార్యాలయానికి నామమాత్రపు లీజుకు ఇవ్వడమేంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ కార్యాలయం అంటే నాయకులు, కార్యకర్తలు, సభలు, సమావేశాలతో నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఉన్నచోట, నిత్యం వేలమంది జనం సంచరించే ప్రాంతంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరమేంటి? జిల్లాల విభజన తర్వాత ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి జిల్లా కేంద్రాల్లో తగినంత స్థలాలు లేవు. అలాంటప్పుడు నగరం నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వస్థలాన్ని ప్రభుత్వ, ప్రజా అవసరాలకు అట్టిపెట్టకుండా ఒక రాజకీయ పార్టీ కార్యాలయానికి ఎలా ఇచ్చేస్తారు? పైగా ఆ స్థలాన్ని వైకాపా కార్యాలయానికి ఎన్నేళ్లకు, ఏ ప్రాతిపదికన లీజుకిచ్చారన్న వివరాలేవీ బయటకు రాకుండా గోప్యత పాటిస్తున్నారు. మిగతాచోట్ల మాదిరిగానే ఎకరానికి సంవత్సరానికి రూ.వెయ్యి చొప్పున, 99 ఏళ్లకు లీజుకిచ్చి ఉంటారని భావిస్తున్నారు. అసలు పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయిస్తూ సీసీఎల్ఏ ఉత్తర్వులు ఇచ్చారా.. లేదా అన్న విషయంలోనూ స్పష్టత లేదు. భోగరాజు పట్టాభి సీతారామయ్య జ్ఞాపకార్థం ఆడిటోరియం నిర్మించేందుకు తొమ్మిది నెలల క్రితమే స్థలం కేటాయించినా... ఎలాంటి కదలికా లేకపోవడంపై ఆయన అభిమాన సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. సంఘం ప్రతినిధులు, హిందూ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ ఏఆర్కే మూర్తి, వేమూరి రాధాకృష్ణారావు తదితరులు స్పందనలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ‘భోగరాజు పట్టాభి సీతారామయ్య జ్ఞాపకార్థం తలపెట్టిన ఆడిటోరియం నిర్మాణం మొదలవకుండా అడ్డుకోవడం చాలా తప్పు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకుని అడ్డంకులు తొలగేలా చూడాలి. ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా చూడాలి’ అని అభిమాన సంఘం ప్రతినిధి పి.వి.ఫణికుమార్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
సీఎం తెచ్చిన నరకయాతన
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు -
అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలొద్దు
స్కిల్ కేసులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు