రాష్ట్రం పెట్రో దెబ్బ!
బాదుడే బాదుడంటే ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలకు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. పెట్రో అమ్మకాలు తగ్గినా... ఆదాయం ఎలా పెంచుకోవాలో.. పన్నులను మోపుతూ ప్రజల నుంచి ఎంత మేర పిండుకోవాలో ఈ ప్రభుత్వం నుంచి నేర్చుకోవచ్చేమో అన్నంతగా జనాన్ని నిలువు దోపిడీ చేస్తున్నారు.
పెట్రో ఉత్పత్తులపై పన్నుల మోత
అమ్మకాలపై ఈ ఏడాది రూ.17వేల కోట్లపైనే రాబడి
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతెత్తి అరిచిన జగన్
అధికారంలోకి వచ్చాక ప్రజల నుంచి పిండుకుంటున్న వైనం
రాష్ట్ర పన్నులను తగ్గించకపోవడంతో తొలగని భారం
ఈనాడు - అమరావతి
బాదుడే బాదుడంటే ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలకు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. పెట్రో అమ్మకాలు తగ్గినా... ఆదాయం ఎలా పెంచుకోవాలో.. పన్నులను మోపుతూ ప్రజల నుంచి ఎంత మేర పిండుకోవాలో ఈ ప్రభుత్వం నుంచి నేర్చుకోవచ్చేమో అన్నంతగా జనాన్ని నిలువు దోపిడీ చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ సరకులు అమ్ముకునే చిరు వ్యాపారుల నుంచి సరకు రవాణా వాహనాల యజమానుల వరకూ అన్ని వర్గాల ప్రజల నడ్డి విరుస్తున్నారు.
ప్రభుత్వ బాదుడు భరించలేక వాహన దారులు పక్క రాష్ట్రాలకు పారిపోతున్నారు. లారీ, ట్రాక్టర్ల యజమానులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటప్పుడే ట్యాంకు నిండా ఇంధనం భర్తీ చేయించుకుంటున్నారు. కాకినాడ, అనంతపురం, కర్నూలు తదితర ప్రాంతాల వారైతే తమకు దగ్గరలోని పుదుచ్చేరి, కర్ణాటకల్లోని బంకులకు వెళ్లి పెట్రోలు కొంటున్నారు.
బాదుడులో రాష్ట్రానిదే అగ్రస్థానం
పెట్రోలు, డీజిల్ ధరల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే... ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. పుదుచ్చేరితో పోలిస్తే ప్రతి లీటరుకు పెట్రోలుపై రూ.15.71, డీజిల్పై రూ.13.28 చొప్పున తేడా ఉంది. అమరావతితో పోలిస్తే.. బెంగళూరులో లీటరు పెట్రోలు రూ.9.93, డీజిల్ రూ.12.02 తక్కువకే లభిస్తోంది.
బాదుడు భరించలేకే ఇతర రాష్ట్రాలకు!
మన రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్పై బాదుడును భరించలేకనే వాహనదారులు పక్క రాష్ట్రాలకు పోతున్నారు. అందుకే ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మినహా మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో అమ్మకాల వృద్ధి గణనీయంగా నమోదైంది. కర్ణాటకలో డీజిల్పై 71.24%, పుదుచ్చేరిలో 134.47% వృద్ధి నమోదైంది. పెట్రోలు అమ్మకాల్లోనూ పుదుచ్చేరిలో 53.54%, కేరళలో 29.82%, కర్ణాటకలో 26.33% వృద్ధి కనిపించింది. తమిళనాడులోనూ 20.95% ఉంది. రాష్ట్రంలో పెట్రోలు అమ్మకాల్లో 1.03%, డీజిల్ అమ్మకాల్లో 8.04% వృద్ధే నమోదైంది.
* పెట్రోలు, డీజిల్పై బాదుడే బాదుడంటూ.. ఎన్నికల ముందు జగన్ గొంతెత్తి అరిచారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలోనూ అప్పటి అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. పక్క రాష్ట్రానికి పోతే లీటరు ఆరేడు రూపాయలు తక్కువకు దొరుకుతోందని మరీ చెప్పారు.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలలకు పెట్రో ఉత్పత్తుల అమ్మకాలపై రాబడి రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరం (2021-22) తొలి ఆరు నెలల కంటే రూ.1,478 కోట్లు పెరిగింది. ఇదే సమయంలో కర్ణాటకలో రూ.9,413 కోట్ల నుంచి రూ.9,140 కోట్లకు తగ్గింది. పుదుచ్చేరిలోనూ పెట్రో పన్నుల రాబడి 16.67% పడిపోయింది. కేంద్రంతోపాటు దేశంలోని అధిక శాతం రాష్ట్రాలు ఇంధనంపై అమ్మకం పన్నును తగ్గించడం ద్వారా ప్రజలపై భారాన్ని తగ్గించాయి. సీఎం జగన్ పైసా తగ్గించకుండా నిలువు దోపిడీ చేయడాన్ని ఏమనాలి?
* ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో కర్ణాటకలో డీజిల్ అమ్మకాల్లో 71%, పెట్రోలు అమ్మకాల్లో 26% వృద్ధి నమోదైంది. కేరళలోనూ డీజిల్ అమ్మకాలు ఏప్రిల్-సెప్టెంబరు మధ్య 153% పెరిగాయి. రాష్ట్రంలో డీజిల్ అమ్మకాల్లో 1.03%, పెట్రోలు అమ్మకాల్లో 8.04% వృద్ధి మాత్రమే నమోదైంది. అయినా ఆ రాష్ట్రాల కంటే ఆదాయం ఎక్కువగా రావడాన్ని బాదుడే అనుకోవాలి కదా?
పెట్రో పన్ను రాబడి ఎక్కువే
* రాష్ట్రంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలలతో పోలిస్తే 2022-2023 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో పెట్రో ఉత్పత్తుల అమ్మకాలపై పన్నుల రాబడి 20.48% అధికంగా ఉంది. 6 నెలల్లోనే రాష్ట్ర ఖజానాకు రూ.8,694 కోట్లు జమయ్యాయి.
* గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల ద్వారా రూ.14,724 కోట్లు పిండుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల గణాంకాల ప్రాతిపదికన చూస్తే.. ఏడాది రాబడి రూ.17వేల కోట్లపైనే ఉంటుందని అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి