డిమాండుకు తగినట్లు మద్యం సరఫరా అవుతోందా?
దశలవారీగా మద్యనిషేధం అమలు చేస్తామని, మద్యంపై వచ్చే ఆదాయాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వెళ్తామని పలు సందర్భాల్లో చెప్పిన సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం.. ఇప్పుడు మందుబాబులతో మరింత ఎక్కువగా తాగించటమెలా?
ఎన్ని రోజులకోసారి స్టాకు వస్తోంది?
ఏ రకం మద్యం ఎక్కువగా తాగుతున్నారు?
మద్యం అమ్మకాలు పెంచుకోవటమే లక్ష్యంగా ప్రభుత్వం సర్వే
ఈనాడు, అమరావతి: దశలవారీగా మద్యనిషేధం అమలు చేస్తామని, మద్యంపై వచ్చే ఆదాయాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వెళ్తామని పలు సందర్భాల్లో చెప్పిన సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం.. ఇప్పుడు మందుబాబులతో మరింత ఎక్కువగా తాగించటమెలా? తద్వారా ఆదాయం ఇంకా పెంచుకోవటమెలా.. అనేదానిపై దృష్టిసారించింది. అమ్మకాలు ఏ సమయంలో ఎక్కువగా జరుగుతున్నాయి? మందుబాబులు ఎలాంటి మద్యం తాగటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు? ఏ వయసువారు ఎక్కువగా కొంటున్నారు? డిమాండుకు తగ్గట్లుగా మద్యం సరఫరా అవుతోందా.. లేదా? వంటి అంశాలపై ఈ సర్వే చేయిస్తోంది. లోటుపాట్లు ఎక్కడున్నాయో చూసుకుని వాటికి అనుగుణంగా మార్కెటింగ్ వ్యూహాలు రూపొందించుకోవటం, అమ్మకాలు పెంచుకోవటమే ఈ సర్వే లక్ష్యంగా కనిపిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మద్యం దుకాణాల సూపర్వైజర్లకు ఓ ప్రశ్నావళిని పంపించింది. ఆన్లైన్లో సమాధానాలివ్వాలని ఆదేశించింది. ఇటీవల బ్రూవరీస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ఈ ప్రశ్నావళికి సమాధానాలు పంపించాలని సూపర్వైజర్లను ఆదేశించారు. జిల్లా పేరు, మద్యం డిపో, నియోజకవర్గం, మద్యం దుకాణం లైసెన్సు సంఖ్య తదితర వివరాలను పొందుపరిచి.. ఈ సర్వేకు సూపర్వైజర్లు సమాధానాలు ఇస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!