Diabetes: వేళ్లు... కాళ్లకు ముప్పు!
మీకు మధుమేహం ఉందా... కాళ్లపై చిన్న పుండు పడినా... గాయమైనా... ఇనుప మేకులు గుచ్చుకున్నా తస్మాత్ జాగ్రత్త. ఎలాంటి అశ్రద్ధా లేకుండా వెంటనే నిపుణులైన వైద్యుల్ని సంప్రదించి చికిత్స పొందండి.
మీ మధుమేహం నియంత్రణలో ఉందా?
తరచూ పరీక్షలు చేయించుకుంటున్నారా...
రాష్ట్రంలో పెరుగుతున్న ఇన్ఫెక్షన్లు
పాదాలు, కాళ్లను తొలగించాల్సిన పరిస్థితి
అప్రమత్తత అవసరమంటున్న వైద్యులు
ఈనాడు - అమరావతి
మీకు మధుమేహం ఉందా... కాళ్లపై చిన్న పుండు పడినా... గాయమైనా... ఇనుప మేకులు గుచ్చుకున్నా తస్మాత్ జాగ్రత్త. ఎలాంటి అశ్రద్ధా లేకుండా వెంటనే నిపుణులైన వైద్యుల్ని సంప్రదించి చికిత్స పొందండి. లేదంటే ఇన్ఫెక్షన్ సోకి కాలి వేళ్లు, పాదాలు, కాళ్లను తొలగించాల్సి రావచ్చు. రాష్ట్రంలో ఇటీవల ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. మధుమేహం శరీరంపై తీవ్ర ప్రభావం చూపి కొందరు వికలాంగులవుతున్నారు. దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. బాధితుల్లో నిరుపేదలు, కూలీలే ఎక్కువ. గ్రామీణ స్థాయిలో వైద్య సేవలు అంతంత మాత్రంగా ఉండటం, మందుల వాడకం గురించి ఆరోగ్య సిబ్బంది అప్రమత్తం చేయకపోవడం, బాధితులూ పట్టించుకోక పోవడం, దురలవాట్లు... వంటి కారణాలు వారిని జీవచ్ఛవాలుగా మారుస్తున్నాయి. మధుమేహం తీవ్రత పెరిగి... విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలోని ప్రధాన బోధనాసుపత్రుల్లో నెలకు సగటున 15 నుంచి 20 మంది మోకాలి కింద వరకూ కాళ్లను కోల్పోతున్నారు. మరో 20 మందికి పాదం లేదా కాలి వేళ్లను తొలగించాల్సి వస్తోంది. అనంతపురం జీజీహెచ్లో వైద్యులు నెలకు 15 మంది మధుమేహ బాధితులకు శస్త్రచికిత్సల ద్వారా ఇన్ఫెక్షన్లను తొలగిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రధాన బోధనాసుపత్రులకు ఓపీలో వచ్చే వారిలో కనీసం 10% నుంచి 15% మంది మధుమేహ నియంత్రణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఆరోగ్యం దెబ్బతిన్న వారే ఉంటున్నారు. ప్రైవేట్, ఇతర ఆసుపత్రుల్లోనూ ఇలాంటి కేసులు అధికంగా ఉన్నాయి. 50 ఏళ్లు పైబడిన వారిలో సమస్యలు ఎక్కువగా బయటపడుతున్నాయి.
రక్త ప్రసరణ తగ్గి... స్పర్శ కోల్పోయి
మధుమేహం వచ్చాక మొదటి పదేళ్లపాటు పైకి పెద్దగా ఎలాంటి దుష్ప్రభావాలూ కనిపించవు. దీంతో కొందరు అశ్రద్ధ వహిస్తుంటారు. మందులు వాడుతున్నాం కదా అని మరికొందరు వైద్యుల దగ్గరకు వెళ్లడం మానేస్తుంటారు. మధుమేహాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా... గుండె, కళ్లు, మూత్రపిండాలపై ప్రభావం పడుతుంది. శరీరంలో గ్లూకోజు ఎక్కువగా ఉంటే కాళ్లు, చేతులకు రక్త సరఫరా సరిగా ఉండదు. ఫలితంగా స్పర్శను కోల్పోతాయి. పాదాల్లో నాడులు దెబ్బతింటాయి. సూదులు పొడిచినట్లు, మండినట్లు అనిపించడం, నొప్పి పుట్టడం వంటి సమస్యలూ తలెత్తుతాయి. నొప్పి తీవ్రతను గుర్తించలేకున్నా... పుండ్లు మానకుండా వేధిస్తున్నా వైద్యుల్ని సంప్రదించాలి.
అన్నిచోట్లా అదే రీతిగా...
విజయవాడ జీజీహెచ్లో మధుమేహ సంబంధిత అనారోగ్యాలతో బాధపడేవారికి 60 పడకలు కేటాయించారు. 40 మంది దాకా ప్రస్తుతం చికిత్సపొందుతున్నారు. విజయవాడే కాకుండా గుంటూరు, కాకినాడ, విశాఖ కేజీహెచ్, కర్నూలు జీజీహెచ్, ఇతర బోధనాసుపత్రులకు వచ్చేవారిలో వ్యవసాయ కూలీలు, ఇతరత్రా పనులు చేసుకునే వారే ఎక్కువ. ‘నెలకు కనీసం 10 మంది కాళ్లు కానీ పాదాలు, వేళ్లను కానీ తొలగించాల్సి వస్తోంది. పుండు పడినప్పుడు నొప్పిలేదని, వెంటనే మానిపోతుందిలే అనుకుని... స్థానికంగానే వైద్యాన్ని పొందుతూ కొందరు యథావిధిగా కూలి పనులు చేసుకుంటున్నారు. పుండ్లు పెద్దవై... ఇతర సమస్యలతో... శరీరం సహకరించని పరిస్థితుల్లో బోధనాసుపత్రులకు వస్తున్నారు. ఫలితంగా వారి పాదాలు, కాళ్లు, వేళ్లను తొలగించాల్సి వస్తోంది’ అని కర్నూలు జీజీహెచ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లికార్జున చెప్పారు. కాకినాడ జీజీహెచ్లోనూ మధుమేహ బాధితుల్లో నెలకు 5% మందికి కాళ్లు, వేళ్లు తొలగించాల్సిన పరిస్థితి తలెత్తుతోందని జనరల్ సర్జరీ ఫ్రొఫెసర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ‘మధుమేహంతో బాధపడుతున్న వారు ఆహార నియమాలు పాటించడం తప్పనిసరి. వ్యాయామాలు చేస్తూ సమస్యను నియంత్రణలో ఉంచుకోవాలి. లేకపోతే అవయవాలు దెబ్బతింటాయి’ అని విజయవాడ ప్రభుత్వ బోధనాసుపత్రి జనరల్ సర్జరీ విభాగం మాజీ హెచ్వోడీ ప్రొఫెసర్ శివశంకర్ చెప్పారు.
తగ్గినట్లే తగ్గి...
నూకరాజు వయసు 51 ఏళ్లు. విజయవాడ శివారు ప్రాంతంలో ఉంటారు. చెప్పుల దుకాణంలో పనిచేస్తున్నారు. 15 ఏళ్లుగా మధుమేహం ఉంది. పదేళ్ల కిందట నూకరాజు గుండెకు రెండు స్టంట్లు వేశారు. ఎనిమిది నెలల కిందట ఎండలో నడిచినప్పుడు కుడి కాలికి బొబ్బ వచ్చింది. ప్రాథమిక వైద్యంతో మొదట్లో తగ్గినట్లే... తగ్గింది. కొద్దిరోజులకే పుండు పెద్దదైంది. 4 నెలల కిందట వైద్యులు శస్త్రచికిత్స ద్వారా కుడి కాలును మెకాలి కింది వరకూ తొలగించారు. ఇటీవల ఎలుక కొరికి రెండో కాలి పాదానికి గాయమైంది. ఇప్పుడు ఆ కాలినీ తొలగించాలని వైద్యులు చెబుతున్నారు. గతంలో నూకరాజు పొగతాగేవారు. తర్వాత ఆ అలవాటు మానేసినా... ఇప్పటికీ ఆ ప్రభావం శరీరంలోని అవయవాలపై కనిపిస్తోంది. ప్రస్తుతం విజయవాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న నూకరాజు దగ్గర ఆయన భార్య జయనాగదుర్గ సహాయకురాలిగా ఉన్నారు. ‘అనారోగ్యంతో ఆయన మంచానపడ్డారు. తోడుగా ఆసుపత్రిలో ఉండాల్సి రావడంతో పనులు చేసుకోవడానికి వీల్లేకుండా ఉంది. ఇద్దరం ఇలా ఉండేసరికి ఇల్లు గడవడం కష్టమవుతోందయ్యా’ అని ఆమె వాపోయారు. జీజీహెచ్లో మరో ఇద్దరు బాధితుల కుటుంబాల పరిస్థితీ ఇలాగే ఉంది.
పాదంలోకి మేకు దిగి..: ఏలూరు జిల్లాకు చెందిన రైతు(45) కూలి పనికి పొలం వెళ్లినప్పుడు కుడికాలు పాదంలో ఇనుప మేకు దిగింది. దానిని తీసేయించి స్థానికంగా వైద్యం చేయించుకున్నారు. కొంతకాలం తర్వాత మేకు దిగిన భాగంలో పుండు పెద్దదైంది. అయినా నిపుణులైన వైద్యులను సంప్రదించకుండా ఆలస్యం చేశారు. చివరికి పాదానికి ఇన్ఫెక్షన్ సోకింది. ప్రస్తుతం విజయవాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఆ రైతు కిడ్నీలు కూడా దెబ్బతిన్నాయి. డయాలసిస్ చేయించుకుంటున్నారు.
చివరి ప్రయత్నంగానే...
- ప్రొఫెసర్ కె.అప్పారావు, హెచ్ఓడీ, విజయవాడ ప్రభుత్వ బోధనాసుపత్రి
కూలి పనులకు వెళ్తే తప్ప జీవనం సాగని వారు వైద్యానికి దూరంగా ఉంటున్నారు. కొందరు ఆర్థిక ఇబ్బందుల వల్ల మందులను మధ్యలో మానేస్తున్నారు. దీనివల్ల మధుమేహం తీవ్రత పెరిగి ప్రభావం చూపుతోంది. చివరి ప్రయత్నంగానే కాలి వేళ్లు, పాదాలు, కాళ్లు తొలగిస్తున్నాం. మధుమేహ బాధితులు రక్తంలో గ్లూకోజ్ను పరీక్షించి చూసుకోవడం దైనందిన చర్యగా భావించాలి.
అవగాహన పెంచుకోవాలి
- డాక్టర్ దుర్గాప్రసాద్, జనరల్ ఫిజిషియన్, విజయవాడ ప్రభుత్వ బోధనాసుపత్రి
ఓపీకి వచ్చే వారిలో కొందరికి మధుమేహ లక్షణాలపై అవగాహన ఉండటం లేదు. మూడు నెలలకోసారైనా వైద్యుల్ని సంప్రదించాలి. కిడ్నీలు, నాడులు దెబ్బతింటున్న సంకేతాలున్నాయా... గుండె జబ్బు సూచనలు కనిపిస్తున్నాయా... పరీక్షించుకోవాలి. రక్తంలో గ్లూకోజు స్థాయులు పరగడుపున 125 ఎంజీ/డీఎల్, భోజనం తర్వాత 200 ఎంజీ/డీఎల్ కన్నా ఎక్కువుంటే అప్రమత్తం కావాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!