వైభవంగా పెద్దగట్టు జాతర ప్రారంభం
సూర్యాపేట పురపాలిక పరిధిలోని దురాజ్పల్లిలో ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే పెద్దగట్టు శ్రీలింగమంతుల స్వామి జాతర ఆదివారం అర్ధరాత్రి వైభవంగా ప్రారంభమైంది.
చివ్వెంల, సూర్యాపేట నేరవిభాగం, న్యూస్టుడే: సూర్యాపేట పురపాలిక పరిధిలోని దురాజ్పల్లిలో ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే పెద్దగట్టు శ్రీలింగమంతుల స్వామి జాతర ఆదివారం అర్ధరాత్రి వైభవంగా ప్రారంభమైంది. జాతరను ప్రారంభించేందుకు తీసుకొచ్చే దేవర (అందనపు చౌడమ్మ)పెట్టెకు సూర్యాపేట మండలం కేసారంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి హాజరై భేరీలు మోగించి.. పూజలు చేసి దేవరపెట్టెను పెద్దగట్టుకు తరలించే శోభాయాత్రను ప్రారంభించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో హక్కుదార్లు, పూజారులు, భక్తులు పెద్దగట్టుకు అందనపు చౌడమ్మ పెట్టెను చేర్చారు. దేవరపెట్టెను తాకి కళ్లకు అద్దుకునేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు పోటీపడ్డారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం పెట్టెను ఆవరణలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరకు శ్రీకారం చుట్టారు. జాతర సందర్భంగా వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని సూర్యాపేట పట్టణంలో జాతీయ రహదారిపై వాహనాలను ఆదివారం రాత్రి దారి మళ్లించారు. ఈ ఏర్పాట్లను ఎస్పీ రాజేంద్రప్రసాద్ పరిశీలించారు. ట్రాఫిక్ సమస్యలు ఎదురు కాకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్