వేదవతి ఘోషిస్తోంది!
అక్కడ సాగు నీటికి భరోసా ఇచ్చే నీటి వనరులు తక్కువ. రెండు చిన్న నదులున్నా వర్షాలే దిక్కు. కొన్ని చెరువులున్నా వాటిలో నీళ్లు చేరడమూ అంతంత మాత్రమే.
మూడున్నరేళ్లుగా నిలిచిన ఎత్తిపోతల పనులు
రూ.1942 కోట్లకు కేవలం రూ.100 కోట్లే ఖర్చు
ప్రాజెక్టు డిజైన్లకు అనుమతి తెచ్చుకోలేని దుస్థితి
కర్నూలు పశ్చిమ ప్రాంతాల నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి
అక్కడ సాగు నీటికి భరోసా ఇచ్చే నీటి వనరులు తక్కువ. రెండు చిన్న నదులున్నా వర్షాలే దిక్కు. కొన్ని చెరువులున్నా వాటిలో నీళ్లు చేరడమూ అంతంత మాత్రమే. బోర్లు తవ్వుకున్నా ప్రయోజనం ఉండటం లేదు. చేసేందుకు పనులూ ఉండవు. ఫలితంగా వలసలు నిత్యకృత్యం. మధ్య వయసు వ్యక్తులతోపాటు యువకులూ గుంటూరు, బెంగళూరు, హైదరాబాద్లకు పొట్టచేత పట్టుకుని వెళుతున్నారు. ఈ కరవు నేలకు తాగు, సాగు నీటిని అందించేందుకు తెదేపా హయాంలో చేపట్టిన వేదవతి ఎత్తిపోతల పథకం పనులు ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక మూలనపడ్డాయి. ఆయా కరవు పీడిత ప్రాంతాల్లో ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి పర్యటించగా దారుణ పరిస్థితులు కనిపించాయి. తాగు, సాగునీటికి అల్లాడుతున్న కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలకు వేదవతి ఎత్తిపోతల పథకం వరదాయిని. ఈ ప్రాంతం మీదుగానే హంద్రీ, హగరి నదులు ప్రవహిస్తున్నా సరిగా ఉపయోగ పడటం లేదు. దాంతో ఆలూరు, హాలహర్వి, హొలగుండ, చిప్పగిరి, ఆదోని, కౌతాలం మండలాల్లోని 80వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీటిని, 253 గ్రామాలు, రెండు మున్సిపాలిటీల్లోని 10 లక్షల మంది జనాభాకు తాగు నీటిని అందించే లక్ష్యంతో 2019 జనవరిలో అప్పటి తెదేపా ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. రూ.1,942.80 కోట్లతో అంచనా వ్యయంతో పాలనామోదం ఇచ్చింది. టెండర్లు పిలిచి పనులను అప్పగించింది. ప్రభుత్వం మారాక మూడున్నరేళ్లలో వేదవతి పనులు మందగించాయి. అక్కడక్కడా చిన్నచిన్న పనులు చేయడం తప్ప పనులు ముందుకు సాగింది లేదు. చేసిన పనులకూ ఇంతవరకు బిల్లులు చెల్లించింది లేదు. ఈ ప్రాజెక్టు డ్రాయింగు, డిజైన్లు కేంద్ర ఆకృతుల సంస్థ వద్ద పెండింగులో ఉన్నాయని అధికారులు చెబుతుండటం గమనార్హం.
ఇదీ ఎత్తిపోతల స్వరూపం
హాలహర్వి మండలం అమృతాపురం వద్ద వేదవతి నదిలో నుంచి వరద రోజుల్లో 8.292 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలనేది ప్రణాళిక. హాలహర్విలో 2.029 టీఎంసీలు, మొలగవల్లిలో 1.027 టీఎంసీల సామర్థ్యంతో రెండు రిజర్వాయర్లను నిర్మిస్తారు. హాలహర్వి పంపుహౌస్ ద్వారా 4.15 టీఎంసీల నీటిని గ్రావిటీ కాలువ నుంచి మొలగవల్లి పంప్హౌస్కు తరలిస్తారు. మరోవైపు హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి దీనికి అనుబంధంగా ఒక టీఎంసీ నీటిని తీసుకునేందుకు వీలుగా మరో పంపుహౌస్, పైపులైను నిర్మించనున్నారు.
* గ్రావిటీ కాలువ ద్వారా 22 వేల ఎకరాలకు, హాలహర్వి జలాశయం నుంచి 78.940 కిలోమీటర్ల మేర కాలువ నిర్మించి 40వేల ఎకరాలకు, మొలగవల్లి జలాశయం కుడి, ఎడమ కాలువల ద్వారా మరో 18వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలి.
ఎక్కడి పనులు అక్కడే...
ప్రాజెక్టు పనుల్లో మూడున్నరేళ్లుగా పురోగతి లేదు. రూ.1,942 కోట్ల విలువైన పనులకు రూ.100 కోట్ల పనులే చేశారు. పైగా ప్రభుత్వం రూ.17 కోట్ల బిల్లులనే చెల్లించిందని, ఇంకా రూ.84 కోట్లు విడుదల చేయాల్సి ఉందని సమాచారం. మొత్తంగా 4,781 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా ఇంతవరకు 52 ఎకరాలకు సంబంధించిన అవార్డు పాస్ చేశారు. మరో 600 ఎకరాల భూసేకరణకు ప్రయత్నాలు వివిధ దశల్లో ఉన్నాóు. గ్రావిటీ కాలువ కోసం కేవలం 53వేల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలే జరిగాయి. దాదాపు 8 కి.మీ. పొడవున 3,200 ఎంఎం, 2,000 ఎంఎం డయా ఎంఎస్ పైపులు వేసినట్లు పేర్కొన్నారు. కానీ... క్షేత్ర స్థాయికి వెళ్లి చూస్తే అవి కొన్నిచోట్ల తుప్పు పట్టి కనిపించాయి.
భూమికి భూమి ఇవ్వాలని బిలేహాలులో ఆందోళన
హాలహర్వి జలాశయం కోసం బిలేహాలు గ్రామ సమీపంలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువుకు అదనంగా మరికొంత భూమిని తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. దీనిపై స్పష్టత లేకపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. జలాశయం కోసం తమ పొలాలు, భూములు తీసుకుంటే భూమికి బదులు భూమి ఇవ్వాలని అక్కడి రైతులు డిమాండు చేస్తున్నారు.
సాగుభూములున్నా నీరేదీ
- ప్రవీణ్కుమార్, మొలగవల్లి
వేదవతి పనులు జరగడం లేదు. కర్ణాటక సరిహద్దులో ఉన్న మా ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు ఎంతో అవసరం. ఇక్కడి నల్లరేగడి, ఎర్ర నేలలు సాగుకు అనుకూలమైనవైనా నీటి వసతి లేదు. పనులు, సరైన ఉద్యోగాలు లేక ప్రజలు వలస వెళుతున్నారు. 8 టీఎంసీలను ఉపయోగించుకునేలా ఈ ప్రాజెక్టు నిర్మించేందుకు నిధులు మంజూరు చేశారు. కర్నూలు పశ్చిమ ప్రాంతానికి ఈ ప్రాజెక్టు వస్తేనే ఉపయోగం.
వర్షాలే పడవు
- రామాంజనేయులు, హాలహర్వి
మమ్మల్ని ప్రకృతి కరుణించడం లేదు. వర్షాలు అసలే పడవు. అప్పుడప్పుడూ అతి వృష్టివల్ల నష్టపోతున్నాం. పంటలను కోల్పోతున్నాం. వేదవతి ప్రాజెక్టు నిర్మిస్తేనే మాకు నీళ్లు. నాలుగేళ్లుగా పెద్దగా పనులేమీ చేయలేదు. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం