నర్సులంటే నాకెంతో గౌరవం

రాత్రింబవళ్లు రోగులకు సేవలందించి వారి ప్రాణాలు నిలిపే నర్సులంటే తనకెంతో గౌరవమని తెదేపా ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు.

Updated : 07 Feb 2023 09:21 IST

నా మాటలను వక్రీకరించారు: బాలకృష్ణ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాత్రింబవళ్లు రోగులకు సేవలందించి వారి ప్రాణాలు నిలిపే నర్సులంటే తనకెంతో గౌరవమని తెదేపా ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. కొందరు కావాలనే తన మాటలను వక్రీకరించారని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘నర్సులను కించపరిచానంటూ నాపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. బసవతారకం కేన్సర్‌ ఆసుపత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కరోనా వేళ ప్రపంచవ్యాప్తంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి, నిద్రాహారాలు మాని సేవచేశారు. అలాంటి వారిని మెచ్చుకొని తీరాలి. నా మాటలు నర్సుల మనోభావాలను దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని