టెండర్లకు స్పందన కరవు
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలోని ఆసుపత్రుల్లో రోగులకు భోజనం (డైట్) అందించేందుకు పిలుస్తున్న టెండర్లకు స్పందన కనిపించడం లేదు. ఒకటి, రెండు సార్లు పిలవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి.
ఆసుపత్రుల్లో ‘డైట్’ సరఫరాకు ముందుకురాని గుత్తేదారులు
ఈనాడు-అమరావతి: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలోని ఆసుపత్రుల్లో రోగులకు భోజనం (డైట్) అందించేందుకు పిలుస్తున్న టెండర్లకు స్పందన కనిపించడం లేదు. ఒకటి, రెండు సార్లు పిలవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా, ప్రాంతీయ, సామాజిక, మాతా, శిశు, తదితరాల కింద కలిపి మొత్తం 246 ఆసుపత్రులు నడుస్తున్నాయి. వీటిలో కొన్ని చోట్ల స్పందన లేదు. ఇంకొన్నిచోట్ల ఒక దరఖాస్తు మాత్రమే రావడంతో మరోసారి పిలుస్తున్నారు. ఇటీవల ఒక్కో రోగి డైట్ ఛార్జీలను రూ.40 నుంచి రూ.80కి పెంచారు. దీనికనుగుణంగా టెండర్లను ఆహ్వానించారు. అయినా గుత్తేదారులు ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఆయా ఆసుపత్రుల్లో పడకల సంఖ్య 30 నుంచి 50 మధ్యన ఉండడంతో గిట్టుబాటు కాదన్న భావనతో టెండర్లు వేయడం లేదు. సకాలంలో బిల్లుల చెల్లింపులు జరగవన్న ఆందోళన కూడా ఉంది.
జిల్లాల్లో ఇదీ పరిస్థితి
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు, పెద్దపూడిల్లో ఒక్కటీ రాలేదు. జగ్గంపేట, పిఠాపురం ఆసుపత్రులకు ఒక్కొక్క దరఖాస్తు మాత్రమే వచ్చింది. మరోసారి టెండర్లు పిలిచారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం, విసన్నపేటల్లో ఒక్కరూ వేయలేదు. నందిగామ ఆసుపత్రికి ఒకటే రావడంతో రద్దు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 15 ఆసుపత్రుల్లో, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా అమలాపురం, రాజోలు, ఇతర మరికొన్ని సీహెచ్సీల్లో తొలివిడత స్పందన కనిపించలేదు. తూర్పుగోదావరి, తిరుపతి, నెల్లూరు, ఇతర జిల్లాలో గుత్తేదారుల ఎంపిక చివరి దశలో ఉందని చెబుతున్నారు. కొన్నిచోట్ల ఒకే సంస్థ ద్వారా నాలుగైదు ఆసుపత్రులకు దరఖాస్తులు వస్తున్నాయి. అయితే... ఈ నెలాఖరు నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని, మార్చి ఒకటి నుంచి కొత్త డైట్ ఛార్జీల ప్రకారం రోగులకు ఆహార సరఫరా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
బోధనాసుపత్రుల్లో పోటాపోటీ
బోధనాసుపత్రుల్లోని టెండర్లకు గుత్తేదారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉంది. దక్కించుకునేందుకు ఎవరికీ వారు గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వీటిల్లో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటున్నందున నిత్యం వందల సంఖ్యలో ఇన్పేషెంట్లు ఉంటున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ జీజీహెచ్లో టెండర్ దక్కించుకోవడానికి పెద్దఎత్తున లాబీయింగ్ జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!