రూ.3,333 కోట్ల అమృత్ నిధులతో 226 ప్రాజెక్టులు
అమృత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో రూ.3,333.76 కోట్లతో 226 ప్రాజెక్టులు చేపట్టినట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ తెలిపారు.
ఈనాడు, దిల్లీ: అమృత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో రూ.3,333.76 కోట్లతో 226 ప్రాజెక్టులు చేపట్టినట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ తెలిపారు. అందులో రూ.801.10 కోట్ల విలువైన 105 ప్రాజెక్టులు పూర్తవగా, రూ.2,532.66 కోట్ల విలువైన 121 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నట్లు వెల్లడించారు. ఆయన సోమవారం రాజ్యసభలో తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు బదులిచ్చారు. అమృత్ పథకానికి కేంద్రం తన వాటాగా రూ.1,056.62 కోట్లు అందించడానికి కట్టుబడి ఉందని, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం, పట్టణ స్థానిక సంస్థలు సమకూర్చుకోవాల్సి ఉంటుందన్నారు.
2.93 లక్షల ఎంఎస్ఎంఈలకు రూ.13 వేల కోట్ల రుణం
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీ క్రెడిట్లైన్ గ్యారెంటీ స్కీం కింద ఆంధ్రప్రదేశ్లో 2,93,884 సంస్థలకు కలిపి రూ.13,073.17 కోట్ల రుణం అందించినట్లు కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ సహాయమంత్రి భానుప్రతాప్ సింగ్ వర్మ తెలిపారు. ఆయన సోమవారం రాజ్యసభలో వైకాపా సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.
ప్రైవేటు సంస్థలకు గనుల కేటాయింపు
కేంద్రం తాజాగా సవరించిన మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్)-1957 చట్టం కింద ఆంధ్రప్రదేశ్లో నాలుగు గనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించినట్లు కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఆయన సోమవారం రాజ్యసభలో భాజపా సభ్యుడు సీఎంరమేష్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. రాష్ట్రంలోని గొర్లగుట్టలో లైమ్స్టోన్ మైన్ను శ్రీజయజ్యోతి సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు, దేవద బ్లాక్ మాంగనీస్ను మహాలక్ష్మి మినరల్స్కి, గుట్టుపల్లి ఇనుప ఖనిజం గనులను తేజా ఇన్ఫ్రాటెక్కు, వెల్దుర్తి ఐరన్వోర్ బ్లాక్ను ఆమోదా ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్కు వేలం ద్వారా అప్పగించినట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?