రాజధాని నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే
రాష్ట్రంలో రాజధాని ఎక్కడుండాలో నిర్ణయించుకొనే అధికారం రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని, అందులో కేంద్రం, న్యాయవ్యవస్థలు చొరబడటానికి వీల్లేదని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
అందులో కేంద్రం, న్యాయవ్యవస్థ చొరబడలేవు
ప్రత్యేకహోదా హామీని అమలు చేయాల్సిందే
విశాఖ మెట్రోకు కేంద్రం నిధులు ఇవ్వట్లేదు
రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి
ఈనాడు, దిల్లీ: రాష్ట్రంలో రాజధాని ఎక్కడుండాలో నిర్ణయించుకొనే అధికారం రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని, అందులో కేంద్రం, న్యాయవ్యవస్థలు చొరబడటానికి వీల్లేదని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆయన మంగళవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రెండు, మూడు రాజధానుల ప్రధాన ఉద్దేశం పాలనా వికేంద్రీకరణే. అధికారం ఒకేచోట కేంద్రీకృతం కాకుండా అన్ని ప్రాంతాలూ మిగతావాటితో సమానంగా అభివృద్ధి చెందాలి. అయితే న్యాయవ్యవస్థ ఓవర్రీచ్ వల్ల దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభివృద్ధి వికేంద్రీకరణ ఫలాలు దక్కకుండా పోయాయి. రాజధాని విషయం ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఆర్టికల్ 154 రెడ్ విత్ 163 ప్రకారం రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. రాజధానిని నిర్ణయించే అంశం పూర్తిగా కార్యనిర్వాహక పరిధిలోనిది కాబట్టి ఇది రాష్ట్ర పరిధిలోని అంశమే. రాజధానిగా ఏ నగరం ఉండాలన్నది రాష్ట్రప్రభుత్వం నిర్ణయించొచ్చు. అసమానతలను తొలగించాలని ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ 38 నిర్దేశిస్తోంది. అందుకే మా ప్రభుత్వం ఒకవైపు న్యాయరాజధాని, మరోవైపు కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. 2020 ఫిబ్రవరి 4న హోంమంత్రి లోక్సభకు ఇచ్చిన ఓ సమాధానంలోనూ రాష్ట్ర భూభాగంలో రాజధానిని ఎంచుకొనే అధికారం రాష్ట్రాలకే ఉంటుందని చెప్పారు. అలాగే కేంద్రప్రభుత్వం న్యాయ, కార్యనిర్వాహక రాజధానుల అర్హతలను గుర్తించింది. ఉత్తర్ప్రదేశ్ రాజధాని లఖ్నవూ అయితే, హైకోర్టు అలహాబాద్లో ఉంది. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పుర్ అయితే హైకోర్టు బిలాస్పుర్లో ఉంది. ఆంధ్రప్రదేశ్పైనే ఎందుకు వివక్ష చూపుతున్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఏపీకి అన్యాయం చేశారు
కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అమృతకాలాన్ని తనకే పరిమితం చేసుకోకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలకూ చెందేలా చూడాలని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం భాజపా, కాంగ్రెస్ల సంయుక్త వైఫల్యం. ఈ రెండుపార్టీలూ అన్యాయంగా విభజన చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని అన్యాయం చేశాయి. అందుకే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్కు 1%, భాజపాకు 0.5% ఓట్లు వచ్చాయి. ఏపీలో అధికారంలో ఉన్న మేం దాన్ని మరిచిపోకుండా నిరంతరం గుర్తుచేస్తున్నాం. దాన్ని పక్కనపెట్టడానికి మేం అనుమతించం. అది ముగిసిన చరిత్ర అని భాజపా చెబుతోంది గానీ, అది చరిత్రలో కలిసిపోవడానికి మేం అంగీకరించం’’ అన్నారు.
ఏపీపై సవతి తల్లి ప్రేమ: మెట్రోరైలుకు నిధులందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏపీపై సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తోందని విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘‘విశాఖ మెట్రోకు నిధులివ్వట్లేదు. విభజన చట్టం 13వ షెడ్యూలులోని 12వ పాయింట్ కింద విశాఖ మెట్రోతో పాటు, విజయవాడ-గుంటూరు-తెనాలి గురించీ చెప్పారు. ప్రభుత్వం అన్నది నిరంతరం సాగే వ్యవస్థ కాబట్టి గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చట్టంలోని అంశాలను ప్రస్తుత భాజపా ప్రభుత్వం తిరస్కరించలేదు’’ అన్నారు.
న్యాయవ్యవస్థపై మీ వ్యాఖ్యలను సమర్థించుకొనే డాక్యుమెంట్ను సభ ముందు ఉంచండి: రాజ్యసభ ఛైర్మన్
విజయసాయిరెడ్డి తన ప్రసంగంలో జ్యుడిషియల్ ఓవర్రీచ్ వ్యాఖ్యలు చేసినప్పుడు ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ జోక్యం చేసుకుంటూ జ్యుడిషియల్ ఓవర్రీచ్ గురించి మాట్లాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తాను చాలా జాగ్రత్తగానే మాట్లాడుతున్నానని విజయసాయిరెడ్డి అన్నప్పుడు... అలాగైతే దాన్ని ధ్రువీకరించాలన్నారు. ‘మీరు ఎలాంటి జ్యుడిషియల్ ఓవర్ రీచ్గురించి ప్రస్తావిస్తున్నారు’ అని ప్రశ్నించారు. ‘న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు మూడూ కలిసికట్టుగా వ్యవహరించాలన్నది నా దృఢ అభిప్రాయం. న్యాయవ్యవస్థ పరిధిని మించి వ్యవహరించిందని అనడం అంటే ఒక రకంగా కళంకం ఆపాదించడమే. అందువల్ల దానికి ఆధారాలు చూపండి’ అని అడిగారు. ఏ కారణంతో, న్యాయవ్యవస్థ ఇచ్చిన ఏ తీర్పు ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేశారో చెప్పాలని నిర్దేశించారు. అందుకు విజయసాయిరెడ్డి స్పందిస్తూ ప్రస్తుతం ఆ విషయం కోర్టులో ఉందని (సబ్జ్యుడిస్), ఆ విషయం దగ్గరకు వస్తానన్నారు. అయితే రాజ్యసభ ఛైర్మన్ దాంతో సంతృప్తిచెందకుండా సరైన డాక్యుమెంటును సభముందు ఉంచి నిరూపించాలని నిర్దేశించారు. అప్పుడు విజయసాయిరెడ్డి స్పందిస్తూ తాను ఆ విషయం దగ్గరకే వస్తున్నానని, అందులో నాలుగు అంశాలున్నాయని, వాటన్నింటినీ వివరిస్తానని పేర్కొన్నారు. అయితే ఛైర్మన్ ధన్ఖడ్ మాత్రం డాక్యుమెంటు ఎక్కడని ఆయన్ను మళ్లీ ప్రశ్నించారు. ‘మీరు మాట్లాడేటప్పుడు.. న్యాయవ్యవస్థ పరిధి దాటడమే సమస్యకు కారణమని చెప్పారు. అందుకే జ్యుడిషియల్ ఓవర్రీచ్ వల్ల ఫలానాది జరిగిందని మీ వాదనలను ధ్రువీకరించే అధీకృత డాక్యుమెంటును సభముందు ఉంచాలి’ అని నిర్దేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?