ఏపీలో ఫోరెన్సిక్ ల్యాబ్ల నిర్మాణంలో పురోగతి కరవు
ఆంధ్రప్రదేశ్లో ఫోరెన్సిక్ ల్యాబ్ల నిర్మాణం, స్థాయి పెంపునకు కేంద్రం నిధులు కేటాయిస్తున్నా రాష్ట్రం నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్
ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ఫోరెన్సిక్ ల్యాబ్ల నిర్మాణం, స్థాయి పెంపునకు కేంద్రం నిధులు కేటాయిస్తున్నా రాష్ట్రం నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదు. వీటి ఏర్పాటుపై కేంద్రానికి సరైన సమాచారమూ అందడం లేదు అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. అమరావతితోపాటు ఇతర ప్రాంతాల్లో ఫోరెన్సిక్ ల్యాబ్ల నిర్మాణం, పురోగతిపై ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ‘రాష్ట్రంలో ఫోరెన్సిక్ ల్యాబ్ల ఏర్పాటుకు 2017-18, 2018-19లలో రూ.42.35 కోట్లు కేటాయించారు. 2021-21లో రూ.28.75 కోట్లు, 2022-23లో రూ.37.40 కోట్లు, 2023-24లో రూ.43.50 కోట్లు ఇచ్చారు. 2020 నవంబరు నుంచి రూ.14.36 కోట్లకు సంబంధించిన వినియోగ ధ్రువపత్రాలను ఆంధ్రప్రదేశ్ సమర్పించనందున ఈ ఏడాది నిధులు విడుదల చేయడం లేదు’ అని వివరించారు.
* 2021లో వచ్చిన వర్షాలు, వరదలు, తుపాన్లతో వచ్చిన నష్టాల ఉపశమనానికి ఆంధ్రప్రదేశ్కు రూ.351.43 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. అమలాపురం, తిరుపతి, విశాఖపట్నం, హిందూపురం ఎంపీలు చింతా అనురాధ, మద్దెల గురుమూర్తి, ఎం.వి.వి.సత్యనారాయణ, గోరంట్ల మాధవ్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2021-22 సంవత్సరానికి రాష్ట్ర విపత్తు ఉపశమన నిధికి కేంద్రం వాటాగా రూ.895.20 కోట్లు ఇచ్చామన్నారు.
ఏపీలో 2,246 డొల్ల కంపెనీల మూత
ఆంధ్రప్రదేశ్లో గత మూడేళ్లలో 2,246 డొల్ల కంపెనీలను మూసేసినట్లు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి రావ్ ఇందర్జిత్ సింగ్ మంగళవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణలోనూ ఇలాంటి 8,148 కంపెనీలను రద్దు చేశామన్నారు.
సమగ్ర ఉద్యానాభివృద్ధి మిషన్ కింద శీతల గిడ్డంగులకు నిధులు
సమగ్ర ఉద్యానాభివృద్ధి మిషన్ కింద 2014-15 నుంచి 2022-23 వరకు తెలంగాణలో 51 శీతల గిడ్డంగులకు రూ.64.86 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 49 శీతల గిడ్డంగులకు రూ.65.70 కోట్ల ఆర్థిక సహాయం అందజేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు.
* 2019, 2020, 2021 సంవత్సరాల్లో వరుసగా ఏపీలో 628, 564, 481 మంది, తెలంగాణలో 491, 466, 352 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఈ మూడేళ్లలో దేశవ్యాప్తంగా 16,854 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
* ఖేలో ఇండియా సెంటర్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ నుంచి 47 ప్రతిపాదనలు రాగా 26కు, తెలంగాణ నుంచి 42 ప్రతిపాదనలు రాగా 19కు ఆమోదం తెలిపి ప్రకటన చేసినట్లు కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్ తెలిపారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఖేలో ఇండియా కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్లో 15, తెలంగాణలో 17 మంది క్రీడాకారులను కోచ్లు/మెంటార్లుగా నియమించినట్లు వెల్లడించారు.
* పశు వైద్య అంబులెన్సులకు ఆంధ్రప్రదేశ్లో 340 వాహనాలకు రూ.54.50 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల తెలిపారు. విశాఖపట్నం ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.
* తిరుపతి ఐఐటీలోని ఇంక్యుబేషన్ కేంద్రానికి రూ.238 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆహారశుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు. -
పంచాయతీలపై రూ.23.08 కోట్ల వీల్ చైర్ల భారం!
పాడైన తాగునీటి మోటార్లు రిపేరు చేయించడానికి నిధుల్లేక బేల చూపులు చూస్తున్న గ్రామ పంచాయతీలపై మరో పిడుగు పడింది. -
విద్యాదీవెన అందక.. విద్యార్థుల విలవిల
మీరు ఇంజినీరింగ్ చదువుతారో.. ఇంకేం ఉన్నత చదువులు చదువుతారో చదవండి. ఆ చదువులకు అయ్యే ఫీజులను మీ మేనమామే చెల్లిస్తాడు’ గత ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా జగన్ చెప్పిన మాటలివి. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్ర సచివాలయంలో పదోన్నతుల్లో రిజర్వేషన్ల వివాదంపై ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఐఏఎస్ అధికారుల కమిటీ సమావేశం నిర్వహించడంపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని