ఎట్టకేలకు స్మార్ట్ కార్డులకు టెండర్లు
రాష్ట్ర రవాణా శాఖ జారీ చేసే డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రాలకు అవసరమైన స్మార్ట్ కార్డులకు ఎట్టకేలకు టెండర్లు పిలిచారు.
నెలకు 3 లక్షలు సరఫరా, ప్రింటింగ్, డెలివరీకి ప్రతిపాదన
ఈనాడు-అమరావతి: రాష్ట్ర రవాణా శాఖ జారీ చేసే డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రాలకు అవసరమైన స్మార్ట్ కార్డులకు ఎట్టకేలకు టెండర్లు పిలిచారు. ఏడాదిన్నరగా వీటి జారీ నిలిచిపోయింది. దాదాపు 30 లక్షల వరకు కార్డులు పంపిణీ చేయాల్సి ఉందని రవాణాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లను ఆహ్వానించింది. ప్రతినెలా సగటున లక్షన్నర డ్రైవింగ్ లైసెన్సులు, మరో లక్షన్నర ఆర్సీలు జారీ అవుతున్నట్లు 2021-22లో లెక్క తేల్చారు. నెలకు 3 లక్షల చొప్పున ఏడాదికి 36 లక్షల కార్డులు సరఫరా చేయాల్సి ఉంటుంది. వీటి సంఖ్య ఏటా 15 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని టెండర్లను పిలిచారు. మార్చి 3 వరకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంది. 10న సాంకేతిక బిడ్లు తెరవనున్నారు. 23న ధరల బిడ్లు తెరిచి, అదే రోజు రివర్స్ టెండరింగ్ నిర్వహించనున్నారు. ఎంపికైన గుత్తేదారు అయిదేళ్ల పాటు స్మార్టు కార్డుల సరఫరా, రాష్ట్రస్థాయిలో కేంద్రీకృత కార్యాలయంలో ప్రింటింగ్, కార్డుదారులకు వాటిని అందజేసే బాధ్యతలు చూడాల్సి ఉంటుంది.
క్యూర్ కోడ్తో కార్డులు: గుత్తేదారు క్యూఆర్ కోడ్తో కూడిన ప్రాక్సిమిటీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ కార్డును (పీఐసీసీ) సరఫరా చేయనున్నారు. ఒక్కో డీఎల్, ఆర్సీ కార్డుల కోసం ప్రభుత్వం రూ.200 చొప్పున వసూలు చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)