‘మరుపు’ రానివ్వని మంచి అలవాట్లు
వయసు పెరుగుతున్న కొద్దీ వ్యాధులూ ముసురుతాయి. అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, గుండె, మెదడు జబ్బుల బారినపడే అవకాశాలుంటాయి.
65 ఏళ్ల వయస్కుల్లో 2.7 శాతం మందిలో మతిమరుపు సమస్య
పెద్ద వయసులో ఒంటరితనం ప్రమాదకరం
‘ఈనాడు’తో యూకే ఫ్యామిలీ ఫిజీషియన్ డాక్టర్ రాజేశ్ మద్దిపాటి వెల్లడి
వయసు పెరుగుతున్న కొద్దీ వ్యాధులూ ముసురుతాయి. అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, గుండె, మెదడు జబ్బుల బారినపడే అవకాశాలుంటాయి. ఇవన్నీ నియంత్రణలో లేకపోతే మెదడులోని కొన్ని భాగాల్లో సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతింటాయి. మెదడుకు తగినంత రక్తం సరఫరా కాదు. ఫలితంగా ప్రాణవాయువు సరిగా అందక మెదడు కణాలు బలహీనమవుతాయి. ఆ ప్రభావం జ్ఞాపకశక్తిపై పడి మతిమరుపునకు దారితీస్తుంది. వృద్ధాప్యంలో మతిమరుపు ముప్పును తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంటుందని చెబుతున్నారు యూకేలోని ఫ్యామిలీ ఫిజీషియన్ డాక్టర్ రాజేశ్ మద్దిపాటి. ఇందుకోసం అవలంబించాల్సిన విధానాలను ‘ఈనాడు’ ముఖాముఖిలో డాక్టర్ రాజేశ్ పంచుకున్నారు.
వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి తగ్గకుండా ఉండేందుకు మార్గమేమిటి?
వయసు పెరుగుతున్న కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఏ విషయంపైనా సరైన నిర్ణయం తీసుకోలేరు. పదిమందితో కలిసి మాట్లాడలేరు. బయటకు వెళ్తే తిరిగి ఇంటికొచ్చే దారిని కూడా మరిచిపోతుంటారు. వీటన్నిటికీ ప్రధానంగా మెదడులో జరిగే మార్పులే కారణం. రకరకాల వ్యాధుల వల్ల ఇలా జరుగుతుంది. విటమిన్ బి 1, బి 12 లోపం, అదుపు లేని హైపోథైరాయిడిజం, మధుమేహం, అధిక రక్తపోటు, తలకు బలమైన గాయాలైనప్పుడు, మాదక ద్రవ్యాలకు బానిసలైనవారిలోనూ, దీర్ఘకాలంగా ఆందోళన, కుంగుబాటుతో బాధపడేవారిలోనూ మతిమరుపు రావచ్చు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, గుండె, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి జబ్బుల్లోనూ రక్తనాళాలు సంకోచించడంతో మెదడుకు రక్తం సరఫరా తగ్గుతుంది. హెచ్ఐవీ, క్షయ వంటి వ్యాధుల్లోనూ ఈ సమస్య వస్తుంది. ఈ వ్యాధుల నివారణ లేదా నియంత్రణకు జాగ్రత్తలు అవసరం.
ఆరోగ్యకరమైన అలవాట్లకు.. మతిమరుపు నిరోధానికి సంబంధమేమిటి?
కచ్చితంగా ఉంది. ఉదాహరణకు పొగ తాగడం వల్ల ఊపిరితిత్తులపై విపరీతమైన దుష్ప్రభావం పడుతుంది. గుండె, మెదడు భాగాల్లోని రక్తనాళాలు సన్నబడతాయి. పొగాకు వల్ల విడుదలయ్యే రసాయనాలు రక్తనాళాల గోడలను దెబ్బతీస్తాయి. మెదడు పనితీరుపైనా దుష్ప్రభావం చూపుతాయి. ఫలితంగా మెదడు కణాలు తగ్గిపోయి, మతిమరుపునకు దారి తీస్తుంది. మద్యపానం వల్ల కూడా మెదడు కణాలపై దుష్ప్రభావం పడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వృద్ధాప్యంలో ఎనలేని మేలు చేస్తుంది. తద్వారా రోగ నిరోధక శక్తి, గుండె, ఊపిరితిత్తుల్లో రక్త ప్రసరణ వేగం పెరుగుతాయి. వ్యాయామం చేయనివారు బరువు పెరిగి.. గుండె, మెదడు రక్తనాళాల్లో సమస్యలు ఎదుర్కొనే ప్రమాదముంది. కనీసం 30-40 నిమిషాలైనా శారీరక వ్యాయామం చేయడం యుక్తవయసు నుంచే అలవాటు చేసుకోవాలి.
ఈ సమస్యను అధిగమించడంలో కుటుంబసభ్యుల తోడ్పాటు ఎలా ఉండాలి?
మనిషి సగటు ఆయుర్దాయం 70 ఏళ్లకు చేరుకుంది. చిన్న కుటుంబాలు కావడం.. తల్లిదండ్రులను వదిలి పిల్లలు ఎక్కడో విదేశాల్లోనో, దూర ప్రాంతాల్లోనో నివసిస్తుండడంతో.. ఇప్పుడు భారత్లోనూ మతిమరుపు బాధిత వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. మతిమరుపు పెరిగితే.. వారిని సంరక్షించడం కుటుంబానికి పెద్ద సమస్యగా మారుతుంది. అందుకే కుటుంబసభ్యులు దూరంగా ఉన్నా.. అధునాతన పరిజ్ఞానం సాయంతో వివిధ మాధ్యమాల ద్వారా వారితో తరచూ మాట్లాడాలి.
ఈ అంశంపై అధ్యయనాలున్నాయా?
ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిని పాటిస్తే మలివయసులోనూ చురుగ్గా ఉండొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇదే అంశంపై చైనాలో 60 ఏళ్లు దాటిన 29 వేల మందిని పదేళ్ల పాటు అధ్యయనం చేశారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ధూమపానం సహా పొగాకు ఉత్పత్తులు, మద్యాన్ని వాడకపోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఎక్కువమందితో తరచూ కలుస్తుండడం, ఏదో ఒక పనిలో నిమగ్నమవడం.. తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. వీరికి ప్రతి మూడేళ్లకోసారి జ్ఞాపకశక్తి పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యకరమైన అలవాట్లున్న వారిలో జ్ఞాపకశక్తి అమోఘంగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. క్రమం తప్పకుండా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, మాంసం, చేపలు, గుడ్లు, గింజధాన్యాలు, పప్పు దినుసులు, పరిమితంగా నూనె, నిర్దేశిత మోతాదులో ఉప్పు అంటే ఒక వ్యక్తి ఒక్క రోజుకు ఒక్క టీ స్పూన్ ఉప్పు మాత్రమే వాడాలి.. ఈ ఆరు అంశాలను పాటిస్తే.. మతిమరుపు అవకాశాలను 90 శాతం వరకు తగ్గించుకోవచ్చు. వీటిలో 2 లేదా 3 అలవాట్లను మాత్రమే పాటిస్తే మతిమరుపు ముప్పు 30 శాతం వరకు మాత్రమే తగ్గే అవకాశం ఉంటుందని తేలింది. దీనికి సంబంధించిన పరిశోధన పత్రం తాజాగా ‘బ్రిటిష్ మెడికల్ జర్నల్’లో ప్రచురితమైంది.
విశ్రాంత జీవితంలో ఇంటికే పరిమితమవడం కూడా మతిమరుపును పెంచుతుందా?
కంప్యూటర్లో మనం వేటి గురించి ఎక్కువగా వెతికితే.. ఆయా అంశాలనే అది చూపిస్తుంటుంది. ఉన్నట్టుండి కొత్త అంశాన్ని వెతికితే దానికి కంప్యూటర్ కొంత సమయం తీసుకుంటుంది. మెదడు కూడా అలాగే పనిచేస్తుంది. వయసు పైబడిన తర్వాత ఇంటికే పరిమితమై.. ఒంటరి జీవితం గడుపుతుంటే మతిమరుపు సమస్య పెరుగుతుంది. పరిమిత సంఖ్యలో వ్యక్తులను కలుస్తుంటే.. మెదడు వారిని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. సాధ్యమైనంత ఎక్కువమందిని కలుస్తుంటే మెదడు చురుగ్గా స్పందిస్తుంది. శరీరం సహకరిస్తే బయటకు వెళ్లాలి. స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనాలి. వీలైతే ఆటలు ఆడాలి. కూర్చుని ఆడేవైనా ఫర్వాలేదు. మెదడుకు పదును పెట్టే ప్రతి ఆటనూ ఆడాలి. వారానికి రెండుసార్లయినా కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులను కలుస్తుండాలి. వీటి వల్ల మతిమరుపు ముప్పును తప్పించవచ్చు.
యూకేలో మలివయసులో మతిమరుపు సమస్యను తగ్గించడానికి ఏం చేస్తారు?
అరవైయ్యేళ్లు పైబడిన వారిలో ఏడాదికోసారి జ్ఞాపకశక్తి పరీక్షలు తప్పనిసరిగా చేస్తాం. సమస్యను ముందుగానే గుర్తించడం వల్ల తీవ్రమవకుండా ఔషధాలిస్తుంటారు. జ్ఞాపకశక్తిని పెంచడానికి వృద్ధులకు పదబంధాలను నింపడం, వాక్య నిర్మాణాలు చేయడం వంటి అభ్యాసాలు చేయిస్తుంటాం. ఇక్కడ వృద్ధులు వారాంతాల్లో సాధ్యమైనంత వరకు ఎక్కువమందిని కలుస్తుంటారు. ఆరోగ్యకరమైన అలవాట్లతో పాటు మెదడుకు మేత, శారీరక శ్రమలు కూడా తోడైతే మతిమరుపు దరిచేరదు.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ