విద్యుత్ ఎక్స్ఛేంజీల్లో ఒక్క యూనిట్నూ కొనం!
వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2023-24) బహిరంగ మార్కెట్లో ఒక్క యూనిట్ విద్యుత్ కొనాల్సిన అవసరమే విద్యుత్ సంస్థలకు లేదంట? ఏటా కనీసం 3-4 వేల మిలియన్ యూనిట్ల (ఎంయూ)ను కొంటున్న డిస్కంలకు ఇదెలా సాధ్యమైందని విద్యుత్రంగ నిపుణులు విస్తుపోతున్నారు.
2023-24 సంవత్సరానికి డిస్కంల వింత లెక్క
ఆదాయ లోటు తగ్గించి చూపిన డిస్కంలు
ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీ తగ్గే అవకాశం
రూ.7,702 కోట్ల భారాన్ని ప్రజలు మోయాల్సిందేనా?
ఈనాడు, అమరావతి: వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2023-24) బహిరంగ మార్కెట్లో ఒక్క యూనిట్ విద్యుత్ కొనాల్సిన అవసరమే విద్యుత్ సంస్థలకు లేదంట? ఏటా కనీసం 3-4 వేల మిలియన్ యూనిట్ల (ఎంయూ)ను కొంటున్న డిస్కంలకు ఇదెలా సాధ్యమైందని విద్యుత్రంగ నిపుణులు విస్తుపోతున్నారు. 2023-24 వార్షిక ఆదాయ అవసరాల నివేదికలో (ఏఆర్ఆర్) బహిరంగ మార్కెట్ విద్యుత్ కొనుగోళ్ల ప్రస్తావనే లేకుండా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి (ఏపీఈఆర్సీ) డిస్కంలు ప్రతిపాదనలను సమర్పించాయి. దీనివల్ల ప్రభుత్వం నుంచి రాయితీగా వచ్చే మొత్తాన్ని డిస్కంలు కోల్పోవాల్సి వస్తోంది. ఫలితంగా ఆ భారం వినియోగదారులపై పడే అవకాశముంది. డిస్కంలు ఇప్పటికే రూ.56 వేల కోట్ల అప్పుల్లో మునిగాయి. బహిరంగ మార్కెట్ కొనుగోలు లెక్కలు చూపని కారణంగా మరో రూ.5 వేల కోట్ల అప్పులు పెరిగే అవకాశం ఉంది. దీనిపై ఏపీఈఆర్సీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
ఒక్క యూనిట్ కొనకుండా ఎలా సాధ్యం?
రాష్ట్రంలో ఇప్పటికే విద్యుత్ డిమాండ్ 216 ఎంయూలకు చేరింది. మున్ముందు 260 ఎంయూలకు చేరే అవకాశం ఉందని అంచనా. ఇందులో జెన్కో నుంచి 90 ఎంయూలు, కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా 50 ఎంయూలు వస్తుంది. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి రోజుకు 20 ఎంయూలు వస్తుందని అంచనా. ఇప్పుడే రోజుకు 40 ఎంయూల విద్యుత్ను బహిరంగ మార్కెట్ నుంచి కొంటున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.3,148.87 కోట్లతో 3,407.24 ఎంయూలను విద్యుత్ ఎక్స్ఛేంజీల నుంచి కొనాల్సి ఉంటుందని అంచనా. ఈ ఏడాది పెరిగే విద్యుత్ డిమాండ్ అంచనాల ప్రకారం... 2023-24లో బహిరంగ మార్కెట్ నుంచి సుమారు 5 వేల ఎంయూలను కొనాల్సి వస్తుంది. యూనిట్కు సగటున రూ.9 వంతున లెక్కించినా.. రూ.4-5 వేల కోట్లను డిస్కంలు ఖర్చు చేయాల్సి వస్తుంది.
* పునరుత్పాదక విద్యుత్ ఎక్కువగా ఉండటంతో గ్రిడ్ను సమన్వయం చేయడానికి ఇబ్బంది ఏర్పడుతుందని... పీక్ డిమాండ్ సమయంలో పునరుత్పాదక విద్యుత్తో ఉపయోగం లేదని ఏఆర్ఆర్లో ఇవే డిస్కంలు స్పష్టంచేశాయి. అలాంటప్పుడు పీక్ డిమాండ్ సర్దుబాటు కోసం బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని పొంతన లేని లెక్కలు ఎలా చూపాయి?
ప్రభుత్వంపై భారాన్ని తగ్గించడానికేనా?
2023-24లో నికర ఆదాయ లోటును డిస్కంలు రూ.12,792.70 కోట్లుగా అంచనా వేస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనేందుకు ఉపయోగించే రూ.5 వేల కోట్లు కూడా కలిపితే అది రూ.17,792 కోట్లకు చేరుతుంది. దీనికి అనుగుణంగానే ప్రభుత్వం భరించే రాయితీ కూడా పెరిగే అవకాశం ఉండేది. ప్రభుత్వంపై రాయితీ భారం తగ్గించేలా డిస్కంలు వ్యవహరించాయన్న అనుమానాన్ని విద్యుత్రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ప్రభుత్వం భరించే రాయితీపై స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ 2022-23లో మాదిరే రూ.10,090 కోట్లు ఇస్తుందని భావించినా... మిగిలిన రూ.7,702 కోట్లు ఛార్జీల రూపేణా ప్రజలపై పడే అవకాశముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!