Taraka Ratna: తారకరత్నకు అశ్రునివాళి
మృత్యువుతో 23 రోజులు పోరాడి.. బెంగళూరు నారాయణ హృదయాలయలో శనివారం మరణించిన సినీనటుడు నందమూరి తారకరత్న(40) కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.
విషాదంలో కుటుంబసభ్యులు, అభిమానులు
నివాళులర్పించిన పలువురు ప్రముఖులు
శంకర్పల్లి, న్యూస్టుడే: మృత్యువుతో 23 రోజులు పోరాడి.. బెంగళూరు నారాయణ హృదయాలయలో శనివారం మరణించిన సినీనటుడు నందమూరి తారకరత్న(40) కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన కొంతకాలంగా నివాసం ఉంటున్న రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల గ్రామంలోని ‘గౌతమీ కంట్రీసైడ్’ విల్లాకు ఆదివారం ఉదయం 8గంటల ప్రాంతంలో పార్థివదేహాన్ని తీసుకొచ్చారు. భౌతికకాయాన్ని చూసేందుకు ఉదయం నుంచే రాజకీయ, సినీ ప్రముఖులు, బంధువులు, అభిమానులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. ఉదయం కుటుంబసభ్యులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్ వచ్చి తారకరత్న కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డి సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ దంపతులు, సినీనటులు చిరంజీవి, బాలకృష్ణ, మురళీమోహన్, వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తారకరత్న భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు: చంద్రబాబు
‘తారకరత్న మరణం దురదృష్టకరం. ఆయన ఆసుపత్రి నుంచి కోలుకుని తిరిగి వస్తారని ఆశించాం. భగవంతుడు కరుణించలేదు. ఒకేరోజు తొమ్మిది సినిమాలు ప్రారంభించిన ఘనత తారకరత్న సొంతం. రాజకీయాలపై ఆసక్తితో.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని నాతో చెప్పారు. ఎన్నికల సమయంలో మాట్లాడదామని చెప్పాను. ఇంతలోనే మృతి చెందడం మా కుటుంబానికి తీరని లోటు. వారి పిల్లలను చూస్తే బాధ కలుగుతోంది. ఆయన ఆశయాల కోసం మేమంతా కలిసి పనిచేస్తాం. తారకరత్న భార్యకు భగవంతుడు ధైర్యం చేకూర్చాలి.’
మాట్లాడుకున్న చంద్రబాబు, విజయసాయిరెడ్డి
తారకరత్నకు నివాళులు అర్పించేందుకు తెదేపా అధినేత చంద్రబాబు వెళ్లినప్పుడు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అక్కడే ఉన్నారు. తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి.. విజయసాయిరెడ్డికి సమీప బంధువు. అక్కడ చంద్రబాబు, విజయసాయిరెడ్డి కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఆవేదనతో ఉన్న బాలకృష్ణను విజయసాయిరెడ్డి ఓదార్చారు. ఆయన పక్కనే కూర్చుని మాట్లాడారు. అనంతరం జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్తోనూ విజయసాయిరెడ్డి మాట్లాడారు.
ప్రముఖుల నివాళులు..
తెలంగాణ తెదేపా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి, భారాస ఎమ్మెల్యేలు యాదయ్య, అరికెపూడి గాంధీ, మాజీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, కేఎస్ రత్నం తదితరులు తారకరత్న పార్థివదేహానికి నివాళులు ఆర్పించారు.
తారకరత్న మరణం బాధాకరం: మోదీ
‘నందమూరి తారకరత్న అకాల మరణం తీవ్రంగా బాధించింది. సినీ, వినోద ప్రపంచంపై ఆయన తనదైన ముద్ర వేశారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్ చేశారు.
నేటి సాయంత్రం అంత్యక్రియలు
సోమవారం ఉదయం 9.03 గంటలకు శంకర్పల్లిలోని నివాసం నుంచి ఫిలిం ఛాంబర్కు తారకరత్న పార్థివదేహాన్ని తరలిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. 10 గంటల నుంచి అభిమానుల సందర్శనార్థం అక్కడ ఉంచుతామన్నారు. 3 గంటల తర్వాత హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. తారకరత్న మృతితో ఆయన భార్య అలేఖ్యారెడ్డి తీవ్ర ఒత్తిడికి గురై, నీరసించారు. వారి ముగ్గురు పిల్లల బాగోగులు తానే చూస్తానని బాలకృష్ణ తెలిపారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.