Tenali: సీఎం సభకు జనసమీకరణ తిప్పలు

గుంటూరు జిల్లా తెనాలిలో మంగళవారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సభ కోసం జన సమీకరణకు ఇటు నాయకులు, అటు అధికారులు నానా తిప్పలు పడుతున్నారు.

Published : 28 Feb 2023 07:53 IST

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే:  గుంటూరు జిల్లా తెనాలిలో మంగళవారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సభ కోసం జన సమీకరణకు ఇటు నాయకులు, అటు అధికారులు నానా తిప్పలు పడుతున్నారు. పరిసర ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడానికి బడి బస్సులు తీసుకోవడంతో.. మంగళవారం మీ పిల్లలను మీరే తీసుకురావాలని పాఠశాలల పర్యవేక్షకులు పిల్లల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.

డ్వాక్రా సంఘాల వారు సభాస్థలి వద్ద కచ్చితంగా గ్రూప్‌ ఫొటో దిగాలని సంబంధిత విభాగాల వారు ఇప్పటికే పట్టణ, గ్రామాల సభ్యులకు స్పష్టం చేస్తున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనంతో పాటు ఆయా ప్రాంతాల నుంచి నేరుగా యార్డుకు తీసుకెళ్లటం, తిరిగి వారి ప్రాంతాలకు తీసుకువచ్చే బాధ్యత మాదే అంటూ ప్రచారం చేశారు. కాగా మంగళవారం ఉదయం సభ వద్దకు వెళ్లడానికి సోమవారం సాయంత్రమే ఆర్టీసీ బస్సులను ఆయా ప్రాంతాలకు తరలించటంతో, ఇరుకు వీధుల్లో బస్సులు నిండిపోయి రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు