Global Investors Summit: ఏపీకి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు
మీరు మాకు చాలా చాలా ముఖ్యమైనవారు. మా రాష్ట్రానికి ఉన్న బలాలు, మేం కల్పించే విభిన్న అవకాశాలు, ఇక్కడున్న మంచి మౌలిక వసతులు, స్నేహపూరిత పోటీ వాతావరణం, కొత్త ఆవిష్కరణల విషయంలో మేం తీసుకుంటున్న చర్యల్ని మీకు వివరించడం, మీ భాగస్వామ్యంతో దీర్ఘకాలిక, సుస్థిరాభివృద్ధి సాధించడం ఈ సదస్సు ముఖ్యోద్దేశం.
రిలయన్స్, అదానీ, ఆదిత్య బిర్లా తదితర కంపెనీలతో 340 ఒప్పందాలు
విశాఖలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో సీఎం ప్రకటన
రాష్ట్రంలో పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం ఉందని వ్యాఖ్య
ఏ సమస్య వచ్చినా ఫోన్కాల్ దూరంలో ఉంటామని జగన్ భరోసా
త్వరలో విశాఖే కార్యనిర్వాహక రాజధాని.. తాను కూడా అక్కడికే మకాం మారుస్తున్నట్లు వెల్లడి
విశాఖపట్నం నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి
మీరు మాకు చాలా చాలా ముఖ్యమైనవారు. మా రాష్ట్రానికి ఉన్న బలాలు, మేం కల్పించే విభిన్న అవకాశాలు, ఇక్కడున్న మంచి మౌలిక వసతులు, స్నేహపూరిత పోటీ వాతావరణం, కొత్త ఆవిష్కరణల విషయంలో మేం తీసుకుంటున్న చర్యల్ని మీకు వివరించడం, మీ భాగస్వామ్యంతో దీర్ఘకాలిక, సుస్థిరాభివృద్ధి సాధించడం ఈ సదస్సు ముఖ్యోద్దేశం.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్లో పెట్టుబడిదారులతో సీఎం జగన్
పెట్టుబడిదారుల సదస్సులో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 340 ఒప్పందాలు చేసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ప్రకటించారు. 20 రంగాల్లో పెట్టుబడులతో 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులపాటు విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్) శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ సహా దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలు పలువురు హాజరయ్యారు. వేదికపై ఉన్న పారిశ్రామిక ప్రముఖులంతా మాట్లాడాక.. చివర్లో ముఖ్యమంత్రి ప్రసంగించారు. సదస్సు మొదటి రోజు రూ.11.85 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 92 ఎంఓయూలు, రెండో రోజు రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 248 ఒప్పందాలు చేసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. రిలయన్స్, అదానీ, ఆదిత్య బిర్లా, రెన్యూ పవర్, అరబిందో, డైకిన్, ఎన్టీపీసీ ఐఓసీఎల్, జిందాల్ గ్రూప్, మోండలీస్, శ్రీ సిమెంట్స్ వంటి సంస్థలు రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు, ఇప్పటికే ఉన్న పరిశ్రమల్ని విస్తరించేందుకు ముందుకు రావడం శుభపరిణామమని సీఎం అన్నారు. ‘పరిశ్రమల స్థాపనకు, వ్యాపార ప్రతిపాదనలతో వచ్చేవారికి అనువైన వాతావరణం కల్పించేందుకు మేం కృతనిశ్చయంతో ఉన్నాం. మీకు ఎప్పుడు, ఎలాంటి సహకారం అవసరమైనా ఒక్క ఫోన్కాల్ దూరంలోనే ఉంటాం’ అని హామీ ఇచ్చారు.
విశాఖ అన్ని విధాలా అనుకూలం
‘విశాఖపట్నం పలు ప్రభుత్వ రంగ, ప్రైవేటు పరిశ్రమలు, పోర్టు ఆధారిత మౌలిక సదుపాయాలు, మెడ్టెక్ జోన్లకు నిలయం. ఈ నగరం ఇప్పటికే బలమైన ఆర్థిక కేంద్రంగా ఆవిర్భవించింది. ఇది కేవలం పారిశ్రామిక రంగంలో వేగంగా ఎదుగుతున్న నగరమే కాదు.. పర్యాటక కేంద్రాలకు, ప్రకృతి రమణీయతకు ఆలవాలం. అలాంటి నగరంలో ఈ సదస్సు నిర్వహించడం సంతోషంగా ఉంది’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంలో మన దేశం నిర్వహిస్తున్న జీ-20 సదస్సుకు సంబంధించిన వర్కింగ్ కమిటీ సమావేశాలకూ విశాఖ నగరం ఆతిథ్యమిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
భారత్ ఎదుగుదలలో ఏపీది కీలక భూమిక
‘భారత్ అభివృద్ధి ప్రయాణంలో ఏపీది కీలక పాత్ర. విస్తారమైన ఖనిజ సంపద, అపారమైన సహజవనరులు, 974 కి.మీ.ల తీర ప్రాంతం వంటి సహజ, ప్రకృతిసిద్ధ సానుకూలతలు ఆంధ్రప్రదేశ్ సొంతం. రాష్ట్రంలో ఇప్పటికే ఆరు ఓడరేవులు, ఆరు విమానాశ్రయాలున్నాయి. కొత్తగా మరో నాలుగు ఓడరేవులు రాబోతున్నాయి. దేశంలో అభివృద్ధి చేస్తున్న 11 పారిశ్రామిక కారిడార్లలో మూడు ఏపీలోనే ఉన్నాయి. వీటికితోడు అనేక ప్రముఖ విద్యాసంస్థలు, పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన విస్తృతమైన భూమి, నైపుణ్యం గల యువత, పారిశ్రామిక, వాణిజ్య వృద్ధికి సానుకూల వాతావరణం ఇక్కడున్నాయి. చురుకైన, సానుకూల ప్రభుత్వం ఉంది’ అని పేర్కొన్నారు. 2021-22లో జీఎస్డీపీలో ఏపీ 11.43 శాతం వృద్ధి సాధించిందని, అది దేశంలోనే అత్యధికమని ఆయన తెలిపారు. ‘గత మూడేళ్లలో ఎగుమతులు వృద్ధి చెందాయి. 9.3 శాతం వృద్ధి నమోదైంది. సుస్థిరాభివృద్ధి కోసం మేం చేస్తున్న ప్రయత్నాలను నీతి ఆయోగ్ కూడా గుర్తించింది. సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాల్లో మెరుగైన పనితీరుకు సంబంధించి 2020-21 సంవత్సరానికి ఎస్డీజీ ఇండియా ఇండెక్స్ ర్యాంకింగ్లో రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. క్షేత్రస్థాయి నుంచి పరిపాలనను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక విప్లవాత్మక సంస్కరణలు తెచ్చింది’ అని జగన్ వివరించారు.
ఆ నాలుగే ప్రాధాన్యాంశాలు
పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి పర్యావరణ అనుకూల విధానాలు (గ్రీనిఫికేషన్), పారిశ్రామిక- రవాణా మౌలిక వసతులు, డిజిటైజేషన్, వ్యాపార- నైపుణ్యాభివృద్ధి అనే నాలుగు అంశాలకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ‘రాష్ట్రంలో 82 గిగావాట్ల సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తికి అవకాశాలున్నాయి. సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ.. ఈ మూడు రకాలు సమ్మిళితంగా అభివృద్ధి చేసేందుకు పుష్కలమైన అవకాశాలున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. 34 గిగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజి ప్రాజెక్టులకు ఇక్కడ అవకాశం ఉంది’ అని తెలిపారు. పారిశ్రామిక, రవాణా మౌలిక వసతులకు సంబంధించి దేశానికి తూర్పు తీరంలో ఏపీ ఒక ముఖద్వారం వంటిదన్నారు. సముద్ర రవాణాకు సంబంధించి రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేసేందుకు రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు, కాకినాడల్లో కొత్త ఓడరేవులు నిర్మిస్తున్నామన్నారు. సరకు రవాణాలో సమయం, ఖర్చు ఆదా చేసేందుకు రాష్ట్రంలోని వ్యూహాత్మక ప్రాంతాల్లో 5 మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కుల్నీ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఫార్మాస్యూటికల్, టెక్స్టైల్, ఆహారశుద్ధి, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాలకు ప్రత్యేక క్లస్టర్లూ ఉన్నాయని గుర్తు చేశారు.
మెడ్టెక్ కంపెనీలకు ఏపీ పుట్టిల్లు
మెడ్టెక్ కంపెనీలకు ఏపీ పుట్టినిల్లని, విశాఖ మెడ్టెక్ జోన్లో అనేక కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని జగన్ చెప్పారు. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల కోసం ప్రభుత్వం సింగిల్ పోర్టల్ ద్వారా సేవలందిస్తోందన్నారు. 23 విభాగాలకు సంబంధించిన 90 రకాల సేవలు దీనిలో లభిస్తాయని వివరించారు. 21 రోజుల్లోనే అనుమతులిస్తున్నామన్నారు. సులభతర వాణిజ్యంలో ఏపీ మొదటి స్థానంలో నిలవడం ఇక్కడ పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందనడానికి నిదర్శనమన్నారు. పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల్ని సిద్ధం చేసేందుకు 26 చోట్ల నైపుణ్యాభివృద్ధి కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
విశాఖే కార్యనిర్వాహక రాజధాని
ఆంధ్రప్రదేశ్కు త్వరలోనే విశాఖ కార్యనిర్వాహక రాజధాని కాబోతోందని పెట్టుబడిదారుల సదస్సులో ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ఈ సదస్సుకు సన్నాహకంగా కొన్ని రోజుల క్రితం దిల్లీలో నిర్వహించిన పారిశ్రామికవేత్తల సమావేశంలో విశాఖే ఏపీ తదుపరి రాజధాని అని సీఎం జగన్ ప్రకటించారు. శుక్రవారం పెట్టుబడిదారుల సదస్సులో తన ప్రసంగాన్ని ముగిస్తూ అదే విషయాన్ని మరోమారు ప్రకటించారు. ‘అందమైన విశాఖలో అద్భుతమైన సమయాన్ని గడపండి. విశాఖ త్వరలోనే ఏపీకి కార్యనిర్వాహక రాజధాని కాబోతోంది. నేను కూడా త్వరలోనే విశాఖకు మకాం మారుస్తున్నాను’ అని జగన్ పేర్కొన్నారు.
తొలి రోజు ప్రధాన ఒప్పందాలు
విశాఖపట్నంలో జరుగుతున్న పెట్టుబడిదారుల సదస్సులో మొదటి రోజు ప్రధాన వేదికపై ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో... రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన పలు ఒప్పందాలు జరిగాయి. వాటిలో ఎక్కువ శాతం పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టులు, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు సంబంధించినవి. ఆయా సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ముఖ్యమంత్రి సమక్షంలో ఎంఓయూ పత్రాలు మార్చుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
సరిహద్దు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగానికి వెసులుబాటు
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుండగా.. ఆ రోజును వేతనంతో కూడిన సెలవుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
గుత్తేదార్ల దయ.. గనులశాఖ ప్రాప్తం
టెండరు దక్కించుకున్న గుత్తేదారు ఒకటో తేదీన ఆ నెల సొమ్ము అడ్వాన్స్గా జమ చేయాలనేది నిబంధన. కానీ అత్యధిక జిల్లాల్లో గుత్తేదారులు ఆ డబ్బు చెల్లించడం లేదు. -
‘పర్యాటకం...’ పక్కా నాటకం!
జగన్ ప్రభుత్వంలో పర్యాటక రంగం అభివృద్ధికి అప్పులివ్వడానికి బ్యాంకులే కాదు... పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలూ ముందుకు రాలేదు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం