Kurnool: మంత్రి చెప్పినా.. బిందెలు నిండలా.. గొంతులు తడవలా!
రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఇచ్చిన మాట... నీటిమీద రాతలా మారిందని, తమ తాగునీటి సమస్య పరిష్కారం కాలేదని కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామ మహిళలు వాపోతున్నారు.
గుమ్మనూరు జయరాం హామీ నెరవేరలేదని మహిళల ఆవేదన
న్యూస్టుడే, ఆస్పరి: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఇచ్చిన మాట... నీటిమీద రాతలా మారిందని, తమ తాగునీటి సమస్య పరిష్కారం కాలేదని కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామ మహిళలు వాపోతున్నారు. గ్రామంలో సుమారు 7,500 జనాభా ఉంది. పంచాయతీకి పుప్పాలదొడ్డి, చెన్నంపల్లి మజరా గ్రామాలున్నాయి. ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా గత ఏడాది జులైలో మంత్రి జయరాం ఇక్కడికి వెళ్లారు. తాగునీటి సమస్య ఉందంటూ మహిళలు ఖాళీ బిందెలతో మంత్రి ఎదుట నిరసన తెలిపారు. కొద్ది రోజుల్లోనే నీరు సరఫరా అయ్యేలా చూస్తామని జయరాం హామీ ఇచ్చారు. ఆ హామీ నేటికీ నెరవేరలేదని స్థానిక మహిళలు వాపోయారు. కైరుప్పల గ్రామ పరిధిలోని బీసీ కాలనీలో నీటిసమస్య తీవ్రమై... స్థానికులు మురుగు కాలువ దాటి ఎస్సీ కాలనీకి వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ట్యాంకు దగ్గర గంటల తరబడి వేచి ఉండక తప్పడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
అంకెలు పెంచి.. ఆశలు తుంచారు!
ముందుచూపు మందగించిన జగన్ ఏలుబడిలో పోలవరం పనులు అటకెక్కాయి! పోనీ నిర్వాసితులకు పరిహారమైనా.. అందిందా అంటే ఊహూ.. అదీ లేదు!! ముంపును కళ్లారా చూశానన్నారు... ముప్పు నుంచి అమాయకులను రక్షించాల్సిందేనన్నారు... ఇస్తున్న ప్యాకేజీని పెంచాలన్నారు... ఇచ్చిన పరిహారం సరిపోదన్నారు... బాధితులే తొలి లబ్ధిదారులు కావాలన్నారు. -
‘సిద్ధం’ సభకు బస్సులు.. ప్రయాణికులకు కష్టాలు!
వైయస్ఆర్ జిల్లాలో సీఎం జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ సభ నిర్వహించారు. ఈ సభకు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 400కుపైగా బస్సులు మళ్లించారు. -
సాగునీరందక దెబ్బతింటున్న వరి
అప్పులు చేసి.. బంగారం తాకట్టు పెట్టి వరి సాగుకు పెట్టుబడి పెడితే సకాలంలో నీరందక పైరు దెబ్బతింటోందని, రుణం తీర్చే దారిలేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోందని కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి.మల్లవరం ఆయకట్టు గ్రాంటు పరిధిలోని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. -
పొట్లను మించిన సొరకాయ!
ఎన్టీఆర్ జిల్లా నందిగామ రైతుపేట డౌన్లో నివసిస్తున్న ఉపాధ్యాయుడు కుమారస్వామి ఇంటి ఆవరణలో ఓ సొర పాదు 5 అడుగుల కాయ కాసింది. -
మంచం పట్టిన సేవానాయక్ తండా
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సేవానాయక్ తండాలో గన్యా జ్వరం విజృంభణతో స్థానికులు విలవిల్లాడుతున్నారు. 170 కుటుంబాలు ఉన్న ఈ తండాలో సుమారు 400 మంది నివసిస్తున్నారు. -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
విద్యుత్పై అదనపు లోడ్ ఛార్జీల భారం
ఆదాయ మార్గాలను అన్వేషించి ప్రజలను పీల్చి పిప్పిచేయడం జగన్ ప్రభుత్వానికి రివాజుగా మారింది. వడ్డీ వ్యాపారుల మాదిరి విద్యుత్ వినియోగదారులపై ఛార్జీల భారాన్ని మోపుతోంది. -
కార్టూన్
తాజా వార్తలు (Latest News)
-
నగదుంటేనే రైడ్ రైట్
-
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు
-
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ