MLC Kavitha: 16న మళ్లీ రావాలి
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం 8 గంటలపాటు సుదీర్ఘంగా విచారించింది.
కవితను 8 గంటల పాటు విచారించిన ఈడీ
మద్యం కేసుతో తనకు సంబంధం లేదన్న ఎమ్మెల్సీ
ఈనాడు - దిల్లీ
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం 8 గంటలపాటు సుదీర్ఘంగా విచారించింది. ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరుకావాలని పేర్కొంది. దిల్లీలోని ఈడీ కార్యాలయమైన పరివర్తన్భవన్లో ఆమె శనివారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విచారణను ఎదుర్కొన్నారు. సాయంత్రం 4-5 గంటల మధ్య అధికారులు భోజన విరామం ఇచ్చారు. రాత్రి 8 గంటలకు విచారణ ముగిశాక ఆమె బయటికొచ్చారు. కవిత, వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్రెడ్డిలకు చెందిన బినామీ సంస్థ సౌత్గ్రూప్ ద్వారా ఆప్ నేతలకు హవాలా మార్గంలో రూ.100 కోట్ల ముడుపులు చెల్లించి దిల్లీ మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా రూపొందించుకున్నారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఇప్పటివరకు సేకరించిన సమాచారం, అరెస్టు చేసిన నిందితుల నుంచి చట్టబద్ధంగా సేకరించిన వాంగ్మూలాల ఆధారంగా ఎమ్మెల్సీ కవితను ఈడీ శనివారం ప్రశ్నించింది.
సాధారణ అంశాలే..
కవిత విచారణ సాధారణ అంశాలపైనే సాగినట్లు తెలిసింది. ఈడీ కస్టడీలో ఉన్న మిగతా నిందితులను కవిత ముందు కూర్చోబెట్టి ప్రశ్నిస్తారని వార్తలొచ్చినా అలా చేయలేదని సమాచారం. తదుపరి దశలో ఆ ప్రక్రియను అనుసరించనున్నట్లు తెలిసింది. విచారణలో.. ఆమె తనపై వచ్చిన ఆరోపణలను ఖండించినట్లు సమాచారం. దిల్లీ మద్యం విధాన రూపకల్పనతో కానీ, ముడుపుల గురించి కానీ తనకు తెలియదని పేర్కొన్నట్లు తెలిసింది. బుచ్చిబాబు, అరుణ్పిళ్లైలు వ్యక్తిగతంగా తెలిసినా, వారి వ్యవహారాలతో కానీ.. సౌత్గ్రూప్, ఇండోస్పిరిట్ సంస్థలతో కానీ తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)లోని సెక్షన్ 50 కింద ఈడీ అధికారులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు తెలిసింది. అధికారులు ఆమె ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరిగినా.. ఆ విషయం నిర్ధారణ కాలేదు. విచారణ అనంతరం బయటికొచ్చిన కవితకు అనుకూలంగా భారాస నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఆమెకు స్వాగతం పలికారు. విచారణకు ముందు, తర్వాత.. కవిత పిడికిలి బిగించి చూపుతూ.. చిరునవ్వు చిందించారు. రాత్రి ఇంటికి వచ్చాక.. పార్టీ మహిళా కార్యకర్తలు ఆమెకు దిష్టి తీసి ఇంట్లోకి స్వాగతించారు. తర్వాత మంత్రులు కేటీఆర్, హరీశ్రావులతో కలిసి కవిత హైదరాబాద్కు పయనమయ్యారు.
ఇదీ జరిగింది..
* ఎమ్మెల్సీ కవిత ఉదయం 23 తుగ్లక్ రోడ్డులోని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్, న్యాయవాదులతో మంతనాలు సాగించారు.
* ఉదయం 10.55 గంటలకు అక్కడి నుంచి ఈడీ కార్యాలయానికి కారులో బయలుదేరారు.
* కవితకు సంఘీభావం ప్రకటిస్తూ భారత్ జాగృతి, భారాస కార్యకర్తలు ఆమెకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఆమె కారు బయటకు వెళ్లకుండా మూడు నిమిషాల పాటు అడ్డుకున్నారు. పోలీసులు వారిని పక్కకు తొలగించారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి, భాజపాలకు వ్యతిరేకంగా, భారాస, కేసీఆర్, కవితలకు అనుకూలంగా నినాదాలు చేశారు. కవిత కారు 10.58 గంటలకు అక్కడి నుంచి బయలుదేరింది.
* ఉదయం 11.03 గంటలకు ఆమె ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. వెంట ఆమె భర్త అనిల్, న్యాయవాది వచ్చారు. వారిని ఈడీ సిబ్బంది లోపలికి అనుతించకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు.
* మల్కాజిగిరి, అందోలు ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, చంటి క్రాంతికిరణ్, తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో భారాస ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు రోజంతా ఈడీ కార్యాలయం ఎదుట ఉన్నారు. కేంద్రం, దర్యాప్తు సంస్థల తీరుపై వారు విమర్శలు ఎక్కుపెట్టారు.
* ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఈడీ కార్యాలయం ఎదుట పెద్ద సంఖ్యలో దిల్లీ పోలీసు బలగాలను మోహరించారు.
పిళ్లై ఇచ్చిన వాంగ్మూలాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపణ
తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు.. ఈడీ అధికారులు బలవంతంగా రెండు డాక్యుమెంట్లపై సంతకాలు చేయించినందునే దిల్లీ మద్యం కేసు నిందితుడు అరుణ్ రామచంద్ర పిళ్లై వాంగ్మూలం ఉపసంహరణకు అనుమతి కోరుతున్నారని ఆయన న్యాయవాదులు శనివారం వెల్లడించారు. ఈ మేరకు పిళ్లై.. రౌజ్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో శుక్రవారం పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. కోర్టు దీనిపై విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.