సంక్షిప్త వార్తలు(11)
జగనన్న విద్యాదీవెన పథకం కింద 2022 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్ల నగదును సీఎం జగన్ ఆదివారం బటన్ నొక్కి జమ చేయనున్నారు.
నేడు జగనన్న విద్యాదీవెన సాయం విడుదల
ఈనాడు డిజిటల్, అమరావతి: జగనన్న విద్యాదీవెన పథకం కింద 2022 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్ల నగదును సీఎం జగన్ ఆదివారం బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే కార్యక్రమంలో ఈ నగదును జమచేస్తారు. ఈ పథకం కింద బోధన రుసుముల్ని క్రమం తప్పకుండా చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఏ త్రైమాసికానికి సంబంధించిన ఫీజును ఆ త్రైమాసికం అవ్వగానే చెల్లిస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకు జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన కింద మొత్తం రూ.13,311 కోట్లు అందించినట్లు పేర్కొంది.
‘బడ్జెట్లో వ్యవసాయ రంగానికి మొండి చెయ్యి’
విజయవాడ(అలంకార్కూడలి), న్యూస్టుడే: రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి మొండి చెయ్యి చూపారని, కౌలు రైతుల గురించి స్పష్టమైన ప్రకటన చేయకపోవడం దారుణమని ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు పేర్కొన్నారు. శనివారం ఆయన విజయవాడలో విలేకర్లతో మాట్లాడారు. కౌలు రైతుల చట్ట సవరణ కోసం శాసన సభలో అన్ని పక్షాల నాయకులకూ వినతిపత్రాలు సమర్పిస్తామని వెల్లడించారు. రైతు భరోసా బడ్జెట్ రూ.7,220 కోట్లలో కౌలు రైతుల వాటా ఎంత? బ్యాంకులిచ్చే పంట రుణాల్లో వాటా ఎంత? అనేది స్పష్టం చేసి ఉంటే బాగుండేదని వివరించారు.
వివాదాలున్నప్పటికీ ఏఎస్వోలుగా సచివాలయంలో పోస్టింగ్
ఈనాడు, అమరావతి: దేవాదాయశాఖ కమిషనరేట్లో పనిచేస్తున్న ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లపై వివాదాలు ఉన్నప్పటికీ.. వారిని రాష్ట్ర సచివాలయంలో సహాయ సెక్షన్ అధికారులు (ఏఎస్వో)గా నియమిస్తూ ఆదేశాలు రావడం చర్చనీయాంశమైంది. సచివాలయంలోని మొత్తం ఏఎస్వోల్లో 12.5 శాతం పోస్టుల్లో పనిచేయడానికి వివిధ శాఖల ప్రధాన కార్యాలయాల (హెచ్వోడీ)ల్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లకు వెసులుబాటు ఉంటుంది. ఇందులో భాగంగా దేవాదాయశాఖ కమిషనరేట్కు చెందిన ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఒకరు అందరికంటే సీనియర్. నిబంధనల ప్రకారం అతనికి సచివాలయంలో ఏఎస్వోగా అవకాశం దక్కాలి. ఆయన్ను కాదని మిగిలిన ఇద్దరికి అవకాశం కల్పించారు. ఆ ఇద్దరిలో ఒకరు గతంలో పోస్టులు లేకపోయినా సీనియర్ అసిస్టెంట్గా పదోన్నతి పొందారు. మరొకరు కారుణ్య నియామకంపై ఉద్యోగం పొందగా దానిపై విచారణ జరుగుతోంది.
ప్రకాశంలో చుక్కల భూముల రైతులకు ఉపశమనం
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: ప్రకాశం జిల్లాలో చుక్కల భూములకు గత ఎనిమిదేళ్లుగా రిజిస్ట్రేషన్లు కాక అధికారుల చుట్టూ తిరుగుతున్న రైతులకు ఉపశమనం కలగనుంది. వీరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు అధికారాలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2016లో అప్పటి ప్రభుత్వం బాధిత రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలిచ్చింది. అయితే పూర్తిస్థాయిలో స్పష్టత లేదంటూ కొందరు అధికారులు పెద్ద సంఖ్యలో అర్జీలు పెండింగ్లో పెట్టారు. తాజా ఆదేశాలతో ఈ జిల్లాలోని 17,522 మంది రైతులకు చెందిన సుమారు 37 వేల ఎకరాలకు సంబంధించి సమస్య తొలగనుంది. ఈ మేరకు రెవెన్యూ కార్యాలయాలతో పాటు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో గెజిట్ ఇవ్వనున్నారు.
ఈఏపీసెట్ ర్యాంకుల ద్వారానే బీఎస్సీ నర్సింగ్ సీట్ల భర్తీ
ఈనాడు, అమరావతి: ఈఏపీసెట్ ర్యాంకుల ద్వారానే 2023-24 సంవత్సరంలో బీఎస్సీ నర్సింగ్ సీట్లను భర్తీ చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ప్రవేశ పరీక్ష ద్వారానే ప్రవేశాలు నిర్వహించాలన్న భారత నర్సింగ్ కౌన్సిల్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వెల్లడించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ కోర్సులో ప్రవేశాలు పొందాలనుకున్న వారు ఈఏపీసెట్కు హాజరు కావాలని, ఇందులో వచ్చిన ర్యాంకుల ఆధారంగా డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్ నిర్వహిస్తుందని తెలిపింది.
2.70 లక్షల మంది పిల్లలు పాఠశాలల నుంచి డ్రాపౌట్
ఈనాడు డిజిటల్, అమరావతి: గత, ప్రస్తుత విద్యా సంవత్సరాలను పరిశీలిస్తే దాదాపు 2.70 లక్షల మంది చిన్నారులు ప్రభుత్వ పాఠశాలల నుంచి డ్రాపౌట్ అయ్యారని పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క డీఎస్సీ ప్రకటించలేదని తెలిపారు.
విద్యకు పెద్ద పీట: సామినేని
రాష్ట్రంలో సీఎం జగన్ విద్యకు పెద్ద పీట వేస్తున్నారని, చదువుల్లో విప్లవం తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పేర్కొన్నారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్లో ఆయనతో పాటు ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, జగన్మోహన్రావు శనివారం విలేకరులతో మాట్లాడారు. సీఎం ప్రభుత్వ పాఠశాలల్ని ప్రైవేటుకు దీటుగా మారుస్తున్నారు.
ఉన్నత విద్యా మండలి క్విజ్ ఫలితాల విడుదల
ఈనాడు, అమరావతి: ఉన్నత విద్యామండలి నిర్వహించిన క్విజ్ ఛాంపియన్షిప్ పోటీల్లో శ్రీ విద్యానికేతన్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన శివజయనాథ్రెడ్డి, చక్రధర్లు ప్రథమ, ట్రిపుల్ఐటీ నూజివీడుకు చెందిన శ్రావణ్ సాయి కుమార్, నీలేష్లు ద్వితీయ, డాక్టర్ సీఎస్ఎన్ ఫార్మసీ కళాశాలకు చెందిన రాములు, ఇమాన్యుల్లు తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. వీరికి వరసగా రూ.లక్ష, రూ.75వేలు, రూ.50వేల నగదు బహుమతితో పాటు సర్టిఫికెట్లను ప్రదానం చేయనున్నారు.
గేట్లో ఆర్జీయూకేటీ విద్యార్థులకు ర్యాంకులు
రాజీవ్ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయ విద్యార్థులు గేట్ ర్యాంకులు సాధించినట్లు ఉపకులపతి విజయకుమార్ తెలిపారు. కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో సత్యశేఖర్కు ఎనిమిదో ర్యాంకు, ఏడుగురికి 50లోపు, ముగ్గురికి 10లోపు ర్యాంకులు లభించాయని వెల్లడించారు.
ఫ్యాక్టరీల రిజిస్ట్రేషన్కు ప్రత్యేక డ్రైవ్
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కర్మాగారాల చట్టం కింద నమోదు కాకుండా కొనసాగుతున్న ఫ్యాక్టరీల నమోదుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కర్మాగారాల డైరెక్టర్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. డిపార్టుమెంట్ ప్లాన్ అనుమతి పొంది, రిజిస్టర్ కాని పరిశ్రమలను చట్టం పరిధిలోకి తెచ్చేందుకు ఏప్రిల్ నుంచి ఆరు నెలల పాటు ప్రతి నెలా మూడో వారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు.
2.70 లక్షల మంది పిల్లలు పాఠశాలల నుంచి డ్రాపౌట్
ఈనాడు డిజిటల్, అమరావతి: గత, ప్రస్తుత విద్యా సంవత్సరాలను పరిశీలిస్తే దాదాపు 2.70 లక్షల మంది చిన్నారులు ప్రభుత్వ పాఠశాలల నుంచి డ్రాపౌట్ అయ్యారని పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క డీఎస్సీ ప్రకటించలేదని తెలిపారు.
విద్యకు పెద్ద పీట: సామినేని
రాష్ట్రంలో సీఎం జగన్ విద్యకు పెద్ద పీట వేస్తున్నారని, చదువుల్లో విప్లవం తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పేర్కొన్నారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్లో ఆయనతో పాటు ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, జగన్మోహన్రావు శనివారం విలేకరులతో మాట్లాడారు. సీఎం ప్రభుత్వ పాఠశాలల్ని ప్రైవేటుకు దీటుగా మారుస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?