సీమెన్స్ వ్యవహారంపై లోతైన దర్యాప్తు: మంత్రి బుగ్గన
‘రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణకు కేవలం రూ.25 కోట్లతో ఈ ప్రభుత్వ హయాంలో 21 ఎక్సలెన్స్ సెంటర్లు, 192 నైపుణ్య హబ్లు ఏర్పాటు చేశాం. ఏటా 50 వేల మంది యువతకు శిక్షణ ఇస్తున్నాం.
ఈనాడు, అమరావతి: ‘రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణకు కేవలం రూ.25 కోట్లతో ఈ ప్రభుత్వ హయాంలో 21 ఎక్సలెన్స్ సెంటర్లు, 192 నైపుణ్య హబ్లు ఏర్పాటు చేశాం. ఏటా 50 వేల మంది యువతకు శిక్షణ ఇస్తున్నాం. కేవలం రూ.25 కోట్లతోనే ఈ ప్రభుత్వం ఇంత చేస్తోంటే తెదేపా ప్రభుత్వ హయాంలో నైపుణ్యాభివృద్ధి పేరుతో రూ.371 కోట్లు నామినేషన్పై సీమెన్స్ కంపెనీకి చెల్లించిన తరవాత కూడా రాష్ట్రంలో ఏ ప్రయోజనాలూ సాధించలేదు. ఆ నిధులు డొల్ల కంపెనీల పేరుతో ఆ ప్రభుత్వం బదలాయించేసింది. ఆ వ్యవహారం నిగ్గుతేల్చేందుకు మా ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేయిస్తోంది’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ఆదివారం శాసనసభలో వెల్లడించారు. ‘ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు, పెట్టుబడులు, యువతకు నైపుణ్య శిక్షణ అనే అంశంపై ఆదివారం శాసనసభలో రెండో రోజూ చర్చ కొనసాగింది. ఈ చర్చ అనంతరం ఆయన సమాధానం ఇస్తూ ఈ విషయాలు వెల్లడించారు. సీమెన్స్ విషయంలో లోపాలు ఉన్నాయని మొదట జీఎస్టీ విభాగం గుర్తించిందని, ఆ తరవాత ఈడీ దృష్టి సారించిందన్నారు. ఈ స్కాంలో ప్రజాధనం దోపిడీకి గురైనందున చిన్నవారి నుంచి పెద్ద వారి వరకు ఏ స్థాయిలో ఉన్నా..బాధ్యత వహించాల్సి ఉంటుందని, పూర్తి విచారణ జరుపుతున్నామని మంత్రి వెల్లడించారు. నిధుల విడుదలకు ఆర్థికశాఖ అభ్యంతరం చెప్పినా చెల్లింపులు జరిగాయన్నారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఈ అంశాన్ని మంత్రిమండలి సమావేశంలో టేబుల్ ఎజెండాగా తీసుకువచ్చి ఆమోదించారన్నారు. డీపీఆర్ లేకుండా ఎలా నిధులు చెల్లిస్తారని ప్రశ్నించారు. కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ సాంకేతిక కమిటీ సిఫార్సులు లేకుండానే ఎంవోయూ కుదుర్చుకున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోకి ఎంవోయూకి సంబంధం లేదన్నారు. ఆ తరవాత మంత్రి బుగ్గన సమాధానం ఇచ్చారు. ఈ ప్రభుత్వ హయాంలో 493 డిగ్రీ కళాశాలలు, 102 ఇంజినీరింగ్ కళాశాలల్లో రెగ్యులర్ చదువులతో పాటు నైపుణ్యాభివృద్ధి కోసం విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుంతల దారులు.. బూతు మాటలు!
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
జలభగ్నం
‘‘పోలవరం సహా గాలేరు-నగరి, హంద్రీనీవా, వంశధార, వెలిగొండ తదితర అన్ని ప్రాజెక్టులను జలయజ్ఞంలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత తాగు, సాగునీటి కలలను నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం. -
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ
ఓటు హక్కుపై అవగాహన పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని విశ్రాంత ఐఏఎస్ అధికారి, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ పేర్కొన్నారు. -
అయిదేళ్లు చాల్లేదా..జగన్?
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పదే పదే చెబుతున్న వైకాపా ప్రభుత్వం.. వారి పిల్లల కోసం నిర్మించిన గురుకుల పాఠశాల భవనాన్ని మాత్రం పట్టించుకోలేదు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
అయినవాళ్లకే భద్రత
ఏ ప్రభుత్వమైనా సరే ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులకు వారికున్న ముప్పు ఆధారంగా భద్రత కల్పిస్తుంది. కానీ వ్యవస్థల విధ్వంసానికి తెగబడుతున్న జగన్ ప్రభుత్వం మాత్రం ఆ భద్రతనూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్