ఇంటి భారం ఇంతింత కాదయా!
అమ్మ.. ఇంటిపని భారంతో రోజూ ఎన్ని గంటలు శ్రమిస్తుందో తెలియదు. ఆమెకు పని ఒత్తిడి మరింత పెరగనుందని తాజా అధ్యయనంలో తేలింది.
గృహిణిపై ఆధారపడే జనాభా పెరగనుంది..
2036 నాటికి మరో 4.63 కోట్లు అదనం..
10 కోట్లు అధికం కానున్న ‘పనిచేసే జనాభా’
కేంద్ర గణాంక మంత్రిత్వశాఖ అంచనా
అమ్మ.. ఇంటిపని భారంతో రోజూ ఎన్ని గంటలు శ్రమిస్తుందో తెలియదు. ఆమెకు పని ఒత్తిడి మరింత పెరగనుందని తాజా అధ్యయనంలో తేలింది. 2036 నాటికి దేశ జనాభా పెరుగుదల అంచనాలతో ‘భారతదేశంలో మహిళలు-పురుషులు-2022’ నివేదికను కేంద్ర గణాంక మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసింది. మారుతున్న సామాజిక పరిస్థితులు, జనాభా పెరుగుదల తీరును ఇందులో వివరించింది.
* భారతదేశ జనాభా 2021లో 136 కోట్లుంటే 2036 నాటికి 152 కోట్లు దాటనుందని అంచనా. ‘పనిచేసి ఉపాధి పొందే వయసు’ (వర్కింగ్ ఏజ్) జనాభా ప్రస్తుతం 88 కోట్లుండగా 2036 నాటికి 98.85 కోట్లకు పెరుగుతుంది. అప్పటికి దేశంలో 14 ఏళ్లలోపు బాలలు 30.64 కోట్లు, 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు 22.74 కోట్ల మంది ఉంటారని అంచనా.
* భారతీయ కుటుంబ సంప్రదాయం ప్రకారం.. ఇంట్లో 14 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధుల బాగోగులను ఎక్కువగా గృహిణులే చూసుకుంటారని ఈ నివేదిక తెలిపింది. ఇలా ఆధారపడి జీవించే బాలలు, వృద్ధుల జనాభా శాతాన్ని డిపెండెన్సీ రేషియో అని పిలుస్తారు. ఈ జనాభా 2021లో 48.75 కోట్లుంటే.. 2036 నాటికి 53.38 కోట్లకు పెరుగుతుంది. అంటే గృహిణులు సేవలందించాల్సిన వారి సంఖ్య మరో 4.63 కోట్లు పెరుగుతుంది. కానీ ఇలా సేవలందిస్తున్న గృహిణులు ఇప్పుడెంతమంది ఉన్నారు.. 2036 నాటికి వీరి సంఖ్య ఎంత పెరుగుతుందనే గణాంకాలను విడిగా ఇవ్వలేదు.
పిల్లలు తగ్గి.. వృద్ధులు పెరిగి..
14 ఏళ్లలోపు బాలల సంఖ్య 2011లో 37.38 కోట్లు ఉండగా.. 2036 నాటికి 30.63 కోట్లకు తగ్గిపోనుంది. 60 ఏళ్లు దాటిన వృద్ధుల జనాభా 10.15 కోట్ల నుంచి 22.74 కోట్లకు పెరుగుతుంది. వృద్ధుల జనాభా ఏకంగా 124 శాతం పెరగనుండగా బాలల జనాభా 18 శాతం పడిపోనుంది. జనాభా నియంత్రణకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, యువత త్వరగా పెళ్లిళ్లు చేసుకోకపోవడం వంటివి ఈ పరిస్థితులకు కారణాలని అంచనా.
రికార్డు స్థాయికి లింగ నిష్పత్తి
దేశంలో 1951 నాటికి వెయ్యి మంది బాలురకు 965 మంది బాలికలుండగా 1991లో బాలికల నిష్పత్తి అత్యల్పంగా 938కి పడిపోయి.. 2021లో 958కి పెరిగింది. ఇది 2036 నాటికి 969కి చేరవచ్చని అంచనా. దేశ లింగనిష్పత్తి చరిత్రలో అదే అత్యధికమవుతుంది. కానీ రాబోయే 15 ఏళ్ల తరువాత కూడా బాలికల సంఖ్య బాలురను మించే అవకాశాల్లేవు.
ఊబకాయులు మరింతగా..
* పెరుగుతున్న వైద్యసౌకర్యాల కారణంగా భారతీయుల సగటు జీవితకాలం 2031-36 మధ్య పురుషులకు 71.2, మహిళలకు 74.7 సంవత్సరాలుంటుందని అంచనా.
* జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 2015-16లో దేశంలోని పురుషుల్లో 18.9 శాతం ఊబకాయులుంటే 2019-21కల్లా అది 22.9 శాతానికి పెరిగింది. మహిళల శాతం 20.6 నుంచి 24కి చేరింది.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
నగర శివారులో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్