భృంగి వాహనంపై శ్రీశైల మల్లన్న విహారం

శ్రీశైల క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలిరోజు ఆదివారం భ్రమరాంబాదేవి మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

Updated : 20 Mar 2023 05:35 IST

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైల క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలిరోజు ఆదివారం భ్రమరాంబాదేవి మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం మల్లికార్జునస్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగి వాహనంపై కొలువుదీర్చి వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీశైల పురవీధుల్లో గ్రామోత్సవం శోభాయమానంగా జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని